ETV Bharat / business

ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బందుల్లో విజయ్​ మాల్యా!

భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని లండన్​ పరారైన మద్యం వ్యాపారి విజయ్​ మాల్యాకు ఇప్పడు నిధుల కొరత వెంటాడుతోంది. ఫ్రాన్స్​లోని స్థిరాస్తులను ఈడీ జప్తు చేసిన క్రమంలో జీవన, లీగల్​ ఖర్చుల కోసం బ్రిటన్​ హైకోర్టును ఆశ్రయించారు మాల్యా. ఫ్రెంచ్​ ప్రాపర్టీ అమ్మకంతో వచ్చిన నిధుల్లోంచి కొంత భాగం పొందేందుకు అనుమతించాలని అభ్యర్థించారు.

author img

By

Published : Dec 12, 2020, 2:27 PM IST

Vijay mallya
విజయ్​ మాల్యా

భారత్​లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్​కు పరారైన విజయ్​ మాల్యా నిధుల కొరత ఎదుర్కొంటున్నారు. తన జీవన వ్యయాలు, కోర్టు ఖర్చుల కోసం.. జప్తు చేసిన నిధులు పొందేందుకు అనుమతించాలని కోరుతూ బ్రిటన్​ హైకోర్టును ఆశ్రయించారు. దివాలా చర్యల్లో భాగంగా జప్తు చేసి కోర్టు నిధుల కార్యాలయానికి అటాచ్​ చేసిన నగదులోంచి 1.5 మిలియన్​ పౌండ్లు(సుమారు రూ.15 కోట్లు) తీసుకునేందుకు వీలుకల్పించాలని కోరారు మాల్యా.

పిటిషన్​ను పరిశీలించిన డిప్యూటీ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు న్యాయమూర్తి రాబర్ట్​ షాఫెర్​.. మాల్యా అభ్యర్థనను తిరస్కరించారు. ఈ కేసులో తదుపరి విచారణలు పూర్తయ్యే వరకు.. ఈ ఏడాది తొలినాళ్లలో ఫ్రెంచ్​ లగ్జరీ ప్రాపర్టీ లీ గ్రాండ్​ జార్డిన్​ అమ్మకంతో వచ్చిన నిధులను పొందేందుకు నిరాకరించారు.

అయితే.. వచ్చే వారం కీలక విచారణ ఉన్నందున కోర్టు​ ఖర్చుల కోసం 2,40,000 పౌండ్లు తీసుకునేందుకు మాత్రం అనుమతించింది న్యాయస్థానం.

శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది.. నిధులు విడుదల చేయాలని కోర్టుకు విన్నవించారు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన జీవన, కోర్టు ఖర్చుల కోసం అత్యవసరంగా న్యాయస్థానం అధీనంలో ఉన్న నిధుల్లోంచి తీసుకునేందుకు అనుమతించాలని వాదించారు. నిధులు లేకపోవటం వల్ల వచ్చేవారం జరిగే కీలక విచారణకు మాల్యా ఎలాంటి న్యాయ సహాయం పొందలేరని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: విజయ్ మాల్యాకు మరో షాక్​- ఫ్రాన్స్​లో ఆస్తులు సీజ్​

భారత్​లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్​కు పరారైన విజయ్​ మాల్యా నిధుల కొరత ఎదుర్కొంటున్నారు. తన జీవన వ్యయాలు, కోర్టు ఖర్చుల కోసం.. జప్తు చేసిన నిధులు పొందేందుకు అనుమతించాలని కోరుతూ బ్రిటన్​ హైకోర్టును ఆశ్రయించారు. దివాలా చర్యల్లో భాగంగా జప్తు చేసి కోర్టు నిధుల కార్యాలయానికి అటాచ్​ చేసిన నగదులోంచి 1.5 మిలియన్​ పౌండ్లు(సుమారు రూ.15 కోట్లు) తీసుకునేందుకు వీలుకల్పించాలని కోరారు మాల్యా.

పిటిషన్​ను పరిశీలించిన డిప్యూటీ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు న్యాయమూర్తి రాబర్ట్​ షాఫెర్​.. మాల్యా అభ్యర్థనను తిరస్కరించారు. ఈ కేసులో తదుపరి విచారణలు పూర్తయ్యే వరకు.. ఈ ఏడాది తొలినాళ్లలో ఫ్రెంచ్​ లగ్జరీ ప్రాపర్టీ లీ గ్రాండ్​ జార్డిన్​ అమ్మకంతో వచ్చిన నిధులను పొందేందుకు నిరాకరించారు.

అయితే.. వచ్చే వారం కీలక విచారణ ఉన్నందున కోర్టు​ ఖర్చుల కోసం 2,40,000 పౌండ్లు తీసుకునేందుకు మాత్రం అనుమతించింది న్యాయస్థానం.

శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది.. నిధులు విడుదల చేయాలని కోర్టుకు విన్నవించారు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన జీవన, కోర్టు ఖర్చుల కోసం అత్యవసరంగా న్యాయస్థానం అధీనంలో ఉన్న నిధుల్లోంచి తీసుకునేందుకు అనుమతించాలని వాదించారు. నిధులు లేకపోవటం వల్ల వచ్చేవారం జరిగే కీలక విచారణకు మాల్యా ఎలాంటి న్యాయ సహాయం పొందలేరని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: విజయ్ మాల్యాకు మరో షాక్​- ఫ్రాన్స్​లో ఆస్తులు సీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.