ETV Bharat / business

లాక్​డౌన్​ తర్వాత ఆన్​లైన్ షాపింగ్​దే హవా!

author img

By

Published : Apr 25, 2020, 2:59 PM IST

మహమ్మారి కరోనా కారణంగా దేశంలో లాక్​డౌన్​ అమలవుతోంది. ఫలితంగా ప్రజల కొనుగోలు ప్రవర్తనలో పెను మార్పులు సంభవించనున్నాయని ఓ సర్వేలో తేలింది. ప్రస్తుతం అధిక శాతం ప్రజలు ఆన్​లైన్​ షాపింగ్​ వైపు మొగ్గు చూపుతున్నారని... లాక్​డౌన్​ అనంతరం ఇదే ధోరణి కొనసాగుతుందని ఆ సర్వే నివేదించింది.

Majority of Indian consumers may shift to online shopping in next 9 months: Survey
లాక్​డౌన్​ తర్వాత ఎక్కువమంది ఆన్​లైన్​లోనే షాపింగ్​ చేస్తారట!

కరోనా కారణంగా అమల్లో ఉన్న లాక్​డౌన్​... ప్రజల షాపింగ్​ ప్రవర్తనలో మార్పులకు దారితీస్తుందని ఓ సర్వేలో వెల్లడైంది. లాక్​డౌన్​ అనంతరం అధిక శాతం వినియోగదారులు ఆన్​లైన్​ షాపింగ్​కు మొగ్గు చూపుతారని ఆ అధ్యయనంలో తేలింది. రాబోయే 6 నుంచి 9 నెలల్లో 46 నుంచి 64శాతం ఆన్​లైన్ షాపింగ్​ వినియోగదారులు పెరుగుతారని ఆ సర్వే ద్వారా తెలిసింది.

లాక్​డౌన్​ తర్వాత అంతే..

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలవుతున్న కారణంగా ప్రజలంతా ఒక్కసారిగా ఆన్​లైన్​లోనే షాపింగ్​ చేస్తున్నారు. లాక్​డౌన్ అనంతరం ఇదే ధోరణి కొనసాగుతుందని కాప్​జెమిని అనే ఐటీ సంస్థ ఓ నివేదిక ప్రచురించింది. ఏప్రిల్​ నెల తొలి రెండు వారాల్లో ఆ సంస్థ చేసిన సర్వే చేసినట్లు తెలిపింది.

సర్వేలోని ముఖ్యాంశాలు..

  • మహమ్మారి దేశంలోకి ప్రవేశించక ముందు 59 శాతం ప్రజలు చిల్లర వ్యాపారుల నుంచి కొనుగోళ్లు చేసేవారు. అయితే ఇప్పుడు అది 46 శాతానికి పడిపోయింది.
  • కరోనా సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత 78శాతం మంది ఆన్​లైన్​ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
  • ఆన్​లైన్​లో షాపింగ్​లో అవసరమైనప్పుడు వస్తువులను ఆర్డర్​ చేసుకొనే సౌకర్యం కారణంగా 74శాతం మొగ్గు చూపనున్నారు.
  • 89 శాతం మంది ఆరోగ్య భద్రత, పరిశుభ్రతపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు.
  • 65 శాతం ప్రజలు రాబోయే 6-9నెలల కాలంలో కిరాణా, ఇంటికి కావాల్సిన సరకులను ఆన్​లైన్​లో కొనడాన్ని పెంచనున్నారు.
  • రాబోయే 6 నెలల్లో సంక్షోభం నుంచి కోలుకుంటామని 75 శాతం భారతీయ వినియోగదారులు ఆశాజనకంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సగటు 48శాతంగా ఉంది.

ఇదీ చూడండి: లాక్​డౌన్ ఫ్రస్ట్రేషన్​ను బయటపెడితే క్యాష్​బ్యాక్!

కరోనా కారణంగా అమల్లో ఉన్న లాక్​డౌన్​... ప్రజల షాపింగ్​ ప్రవర్తనలో మార్పులకు దారితీస్తుందని ఓ సర్వేలో వెల్లడైంది. లాక్​డౌన్​ అనంతరం అధిక శాతం వినియోగదారులు ఆన్​లైన్​ షాపింగ్​కు మొగ్గు చూపుతారని ఆ అధ్యయనంలో తేలింది. రాబోయే 6 నుంచి 9 నెలల్లో 46 నుంచి 64శాతం ఆన్​లైన్ షాపింగ్​ వినియోగదారులు పెరుగుతారని ఆ సర్వే ద్వారా తెలిసింది.

లాక్​డౌన్​ తర్వాత అంతే..

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలవుతున్న కారణంగా ప్రజలంతా ఒక్కసారిగా ఆన్​లైన్​లోనే షాపింగ్​ చేస్తున్నారు. లాక్​డౌన్ అనంతరం ఇదే ధోరణి కొనసాగుతుందని కాప్​జెమిని అనే ఐటీ సంస్థ ఓ నివేదిక ప్రచురించింది. ఏప్రిల్​ నెల తొలి రెండు వారాల్లో ఆ సంస్థ చేసిన సర్వే చేసినట్లు తెలిపింది.

సర్వేలోని ముఖ్యాంశాలు..

  • మహమ్మారి దేశంలోకి ప్రవేశించక ముందు 59 శాతం ప్రజలు చిల్లర వ్యాపారుల నుంచి కొనుగోళ్లు చేసేవారు. అయితే ఇప్పుడు అది 46 శాతానికి పడిపోయింది.
  • కరోనా సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత 78శాతం మంది ఆన్​లైన్​ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
  • ఆన్​లైన్​లో షాపింగ్​లో అవసరమైనప్పుడు వస్తువులను ఆర్డర్​ చేసుకొనే సౌకర్యం కారణంగా 74శాతం మొగ్గు చూపనున్నారు.
  • 89 శాతం మంది ఆరోగ్య భద్రత, పరిశుభ్రతపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు.
  • 65 శాతం ప్రజలు రాబోయే 6-9నెలల కాలంలో కిరాణా, ఇంటికి కావాల్సిన సరకులను ఆన్​లైన్​లో కొనడాన్ని పెంచనున్నారు.
  • రాబోయే 6 నెలల్లో సంక్షోభం నుంచి కోలుకుంటామని 75 శాతం భారతీయ వినియోగదారులు ఆశాజనకంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సగటు 48శాతంగా ఉంది.

ఇదీ చూడండి: లాక్​డౌన్ ఫ్రస్ట్రేషన్​ను బయటపెడితే క్యాష్​బ్యాక్!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.