ETV Bharat / business

బర్గర్​ కింగ్​ భలే భలే.. ఐపీఓకు భారీ స్పందన

author img

By

Published : Dec 5, 2020, 6:16 AM IST

పబ్లిక్ ఇష్యూ చివరి రోజున బర్గర్​ కింగ్​ అదరగొట్టింది. రోజు ముగిసేసరికి మదుపర్ల నుంచి156 రెట్ల అధిక స్పందన కనిపించింది. ఇష్యూలో భాగంగా ఆ కంపెనీ 13.50 కోట్ల షేర్లను విక్రయించింది.

Investors binge on Burger King India IPO; offer gets subscribed over 156 times
బర్గర్​ కింగ్​ భలే భలే.. ఐపీఓకు భారీ స్పందన

రెస్టారెంట్ల గొలుసుకట్టు సంస్థ బర్గర్​ కింగ్ పబ్లిక్​ ఇష్యూకు మదుపర్లు బ్రహ్మరథం పట్టారు. పబ్లిక్​ ఇష్యూ చివరి రోజు(శుక్రవారం) ముగిసే సరికి 156.65 రెట్ల అధిక స్పందన లభించింది. అర్హులైన సంస్థాగత మదుపర్ల(క్యూఐబీ) విభాగంలో 86.64 రెట్లు, ఎన్​ఐఐ విభాగంలో 354.11 రెట్లు, రిటైల్​ విభాగంలో 68.14 రెట్ల స్పందన కనిపించింది. ఈ ఇష్యూ ద్వారా సంస్థ రూ.810 కోట్లు సమీకరించనుంది.

ఇష్యూలో భాగంగా కంపెనీ 13.50 కోట్ల షేర్లను విక్రయించింది. తాజాగా 7.5 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఆఫర్​ సేల్​ పద్ధతిలో మరో 6 కోట్ల షేర్లను ప్రమోటర్​ సంస్థ క్యూఎస్​ఆర్​ ఆసియా పీటీఈ విక్రయించనుంది. పబ్లిక్​ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను విక్రయశాలల విస్తరణ, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించనుంది. బర్గర్​ కింగ్ షేర్లు ఈ నెల 14న బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలలో నమోదయ్యే అవకాశం ఉంది.

రెస్టారెంట్ల గొలుసుకట్టు సంస్థ బర్గర్​ కింగ్ పబ్లిక్​ ఇష్యూకు మదుపర్లు బ్రహ్మరథం పట్టారు. పబ్లిక్​ ఇష్యూ చివరి రోజు(శుక్రవారం) ముగిసే సరికి 156.65 రెట్ల అధిక స్పందన లభించింది. అర్హులైన సంస్థాగత మదుపర్ల(క్యూఐబీ) విభాగంలో 86.64 రెట్లు, ఎన్​ఐఐ విభాగంలో 354.11 రెట్లు, రిటైల్​ విభాగంలో 68.14 రెట్ల స్పందన కనిపించింది. ఈ ఇష్యూ ద్వారా సంస్థ రూ.810 కోట్లు సమీకరించనుంది.

ఇష్యూలో భాగంగా కంపెనీ 13.50 కోట్ల షేర్లను విక్రయించింది. తాజాగా 7.5 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఆఫర్​ సేల్​ పద్ధతిలో మరో 6 కోట్ల షేర్లను ప్రమోటర్​ సంస్థ క్యూఎస్​ఆర్​ ఆసియా పీటీఈ విక్రయించనుంది. పబ్లిక్​ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను విక్రయశాలల విస్తరణ, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించనుంది. బర్గర్​ కింగ్ షేర్లు ఈ నెల 14న బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలలో నమోదయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:ఉద్యోగుల చేతికే ఎయిర్​ ఇండియా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.