ETV Bharat / business

'మీరూ మేమూ కలిస్తేనే 5 ట్రిలియన్ల ఎకానమీ'

భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో ఐదు ట్రిలియన్​ డాలర్లకు చేరుకోవాలంటే ప్రభుత్వం, కంపెనీల భాగస్వామంతోనే సాధ్యమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్​ గోయల్​ అన్నారు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయాలంటే అంకుర సంస్థల పాత్ర కీలకం అని తెలిపారు. ఈ మేరకు ఇండియన్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ ఏర్పాటు చేసిన వర్చువల్​ సదస్సులో మాట్లాడారు.

author img

By

Published : Dec 16, 2020, 4:42 AM IST

india will grow to be 5 trillion economy by next 10 years with the help of  industrialists
'మీరూ మేమూ కలిస్తేనే 5 ట్రిలియన్ల ఎకానమీ'

భారత ఆర్థిక వ్యవస్థ 2025లోగా ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. రాబోయే 25-30 ఏళ్లలో దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించగల సామర్థ్యం వ్యాపార, అంకుర‌ సంస్థలకు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. 'కానీ మన ముందున్న సవాల్‌ను అంగీకరించాలి. 2047లో వందో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొనే నాటికి మనం ప్రపంచంలోనే నంబర్‌ 1 ఆర్థిక వ్యవస్థగా అవతరించగలమా?' అని ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ ఏర్పాటు చేసిన వర్చువల్‌ సదస్సులో ప్రశ్నించారు.

అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో అత్యత విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ను నేడు ప్రపంచం చూస్తోందని పీయూష్‌ అన్నారు. 'ఈరోజు ఈ అవకాశాన్ని మనం అందుకోకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. ఇది మన బాధ్యత. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలి. ఆత్మనిర్భర్‌ భారత్‌ను మన మంత్రం, స్ఫూర్తి, లక్ష్యంగా మార్చుకోవాలి' అని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ను అమలు చేస్తున్నప్పటికీ ప్రపంచంతో సంబంధాలు మరింత పెంచుకోవాలని ఆయన సూచించారు.

'ఆధునిక సాంకేతికత, యంత్రాలను మనం దిగుమతి చేసుకోవాలి. అప్పుడే మన పని తేలికవుతుంది. మరింత నాణ్యతా ప్రమాణాలతో తక్కువ ధరలో మెరుగైన ఉత్పాదనలను భారత్‌లోనే తయారుచేయగలం. ఇవన్నీ ఉపయోగించుకొని ఇప్పుడు ఔషధ రంగంలో అయినట్టే భారత్‌ను ప్రపంచానికే కర్మాగారంగా తయారుచేయాలి. మనమంతా ఒక జట్టుగా పనిచేయాలి. ప్రభుత్వం, పరిశ్రమలు భాగస్వాములుగా మారి భారత్‌ను 2025కు ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలి. ఆ తర్వాత మరో 7-10 ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్లుగా ఎదగాలి' అని పీయూష్ గోయల్‌ అన్నారు.

ఇదీ చూడండి: 'రెండు దశాబ్దాల్లో.. టాప్‌-3 ఆర్థికవ్యవస్థల్లో భారత్‌'

భారత ఆర్థిక వ్యవస్థ 2025లోగా ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. రాబోయే 25-30 ఏళ్లలో దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించగల సామర్థ్యం వ్యాపార, అంకుర‌ సంస్థలకు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. 'కానీ మన ముందున్న సవాల్‌ను అంగీకరించాలి. 2047లో వందో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొనే నాటికి మనం ప్రపంచంలోనే నంబర్‌ 1 ఆర్థిక వ్యవస్థగా అవతరించగలమా?' అని ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ ఏర్పాటు చేసిన వర్చువల్‌ సదస్సులో ప్రశ్నించారు.

అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో అత్యత విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ను నేడు ప్రపంచం చూస్తోందని పీయూష్‌ అన్నారు. 'ఈరోజు ఈ అవకాశాన్ని మనం అందుకోకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. ఇది మన బాధ్యత. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలి. ఆత్మనిర్భర్‌ భారత్‌ను మన మంత్రం, స్ఫూర్తి, లక్ష్యంగా మార్చుకోవాలి' అని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ను అమలు చేస్తున్నప్పటికీ ప్రపంచంతో సంబంధాలు మరింత పెంచుకోవాలని ఆయన సూచించారు.

'ఆధునిక సాంకేతికత, యంత్రాలను మనం దిగుమతి చేసుకోవాలి. అప్పుడే మన పని తేలికవుతుంది. మరింత నాణ్యతా ప్రమాణాలతో తక్కువ ధరలో మెరుగైన ఉత్పాదనలను భారత్‌లోనే తయారుచేయగలం. ఇవన్నీ ఉపయోగించుకొని ఇప్పుడు ఔషధ రంగంలో అయినట్టే భారత్‌ను ప్రపంచానికే కర్మాగారంగా తయారుచేయాలి. మనమంతా ఒక జట్టుగా పనిచేయాలి. ప్రభుత్వం, పరిశ్రమలు భాగస్వాములుగా మారి భారత్‌ను 2025కు ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలి. ఆ తర్వాత మరో 7-10 ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్లుగా ఎదగాలి' అని పీయూష్ గోయల్‌ అన్నారు.

ఇదీ చూడండి: 'రెండు దశాబ్దాల్లో.. టాప్‌-3 ఆర్థికవ్యవస్థల్లో భారత్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.