కరోనా వైరస్కు సంబంధించి వ్యాక్సిన్ ట్రయల్స్ వేగంగా జరుగతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో వినియోగానికి ఆమెదం పొందిన కొవిడ్-19 వ్యాక్సిన్ భారత్లో అందుబాటులోకి రావచ్చిన బెర్న్స్టీన్ నివేదిక ద్వారా తెలిసింది.
ప్రపంచవ్యాప్తంగా 4 సంస్థల వ్యాక్సిన్లు ప్రస్తుతం తుది అనుమతులు పొందే రేసులో ముందు వరుసలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వ్యాక్సిన్లకు అనుమతులు లభించొచ్చని పేర్కొంది.
భాగస్వామ్య ఒప్పందం ద్వారా వీటిలో ఆక్స్ఫర్డ్ రూపొందిస్తున్న 'వెక్టర్ వ్యాక్సిన్', నోవావాక్స్ తయారు చేస్తున్న 'ప్రొటీన్ సబ్నిట్ వ్యాక్సిన్' భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని బెర్న్స్టీన్ నివేదిక వెల్లడించింది.
1,2వ దశ ట్రయల్స్ డేటా ప్రకారం ఈ రెండు టీకాలు భద్రత, సామర్థ్యం పరంగా ఉత్తమ పని తీరు కనబర్చరినట్లు తేలిందని నివేదిక వివరిచింది. వీటికి తుది అనుమతులు లభిస్తే.. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దేశీయంగా వినియోగానికి అందుబాటులోకి రావచ్చని వెల్లడించింది.
టీకా ధర..
భారత్లో కరోనా వ్యాక్సిన్ ధర డోసుకు రూ.255 నుంచి రూ.550 వరకు ఉండొచ్చని అంచనా వేసింది నివేదిక.
అయితే భారత్లో వయోజనులకు ఒకేసారి భారీ స్థాయిలో టీకా అందించేందుకు సవాళ్లు ఎదురవుతాయని నివేదిక పేర్కొంది. ఫలితంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు భారత్కు రెండేళ్లు పట్టొచ్చని తెలిపింది. గతంలో వయోజనులకు ఒకేసారి భారీ స్థాయిలో టీకా అందించిన అనుభవం లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ, సిబ్బంది కొరత వంటివి ఇందుకు ప్రధాన అడ్డంకులుగా పేర్కొంది.
ఇదీ చూడండి:జీఎస్టీ పరిహారంపై బిహార్ రూటే సెపరేటు