ETV Bharat / business

ఐఎల్​ఎఫ్​ఎస్​ కేసులో ఠాక్రేకు ఈడీ సమన్లు

ఐఎల్ అండ్ ఎఫ్​ఎస్​ సంస్థ బకాయిల ఎగవేత వ్యవహారంలో ఎంఎన్ఎస్ అధినేత రాజ్​ ఠాక్రేకు ఈడీ సమన్లు జారీచేసింది. మనీలాండరింగ్​ కేసు విచారణ కోసం ఈనెల 22న విచారణకు రావాలని సూచించింది.

author img

By

Published : Aug 19, 2019, 2:20 PM IST

Updated : Sep 27, 2019, 12:41 PM IST

ఐఎల్​ఎఫ్​ఎస్​ కేసులో ఠాక్రేకు ఈడీ సమన్లు

రూ.91 వేల కోట్ల మేర అప్పుల్లో చిక్కుకున్న ఐఎల్​ అండ్​ ఎఫ్​ఎస్​ సంస్థకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రేకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్​ కేసు విచారణ కోసం ఈనెల 22న దిల్లీలోని ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించింది.

ఠాక్రేతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నాయకుడు మనోహర్​ జోషి కుమారుడు ఉమేష్​ జోషికి సమన్లు జారీ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్. ఉమేష్ జోషిని సోమవారం లేదా మంగళవారం విచారణకు రావాలని ఆదేశించింది.

కోహినూర్​ సీటీఎన్​ఎల్​ అనే సంస్థలో ఐఎల్​ఎఫ్​ఎస్​ పెట్టుబడికి సంబంధించి ఠాక్రే, జోషి పాత్రపై ఈడీ ప్రశ్నించాలని భావిస్తున్నట్లు సమాచారం. కోహినూర్​ సీటీఎన్​ఎల్​ సంస్థకు జోషి ప్రమోటర్​గా వ్యవహరించారు. తొలుత కోహినూర్​కు సంబంధించిన ఆస్తుల కొనుగోలుకు బిడ్ వేసిన ఠాక్రే, జోషి... తర్వాత ఆ ప్రక్రియ నుంచి వైదొలిగారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్​ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చూడండి:కశ్మీర్: పాఠశాలలు షురూ- విద్యార్థులు గైర్హాజరు

రూ.91 వేల కోట్ల మేర అప్పుల్లో చిక్కుకున్న ఐఎల్​ అండ్​ ఎఫ్​ఎస్​ సంస్థకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రేకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్​ కేసు విచారణ కోసం ఈనెల 22న దిల్లీలోని ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించింది.

ఠాక్రేతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నాయకుడు మనోహర్​ జోషి కుమారుడు ఉమేష్​ జోషికి సమన్లు జారీ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్. ఉమేష్ జోషిని సోమవారం లేదా మంగళవారం విచారణకు రావాలని ఆదేశించింది.

కోహినూర్​ సీటీఎన్​ఎల్​ అనే సంస్థలో ఐఎల్​ఎఫ్​ఎస్​ పెట్టుబడికి సంబంధించి ఠాక్రే, జోషి పాత్రపై ఈడీ ప్రశ్నించాలని భావిస్తున్నట్లు సమాచారం. కోహినూర్​ సీటీఎన్​ఎల్​ సంస్థకు జోషి ప్రమోటర్​గా వ్యవహరించారు. తొలుత కోహినూర్​కు సంబంధించిన ఆస్తుల కొనుగోలుకు బిడ్ వేసిన ఠాక్రే, జోషి... తర్వాత ఆ ప్రక్రియ నుంచి వైదొలిగారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్​ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చూడండి:కశ్మీర్: పాఠశాలలు షురూ- విద్యార్థులు గైర్హాజరు

AP Video Delivery Log - 0700 GMT News
Monday, 19 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0640: Philippines Indonesia Protest AP Clients Only 4225575
Protest in Manila calls for 'Free West Papua'
AP-APTN-0521: Hong Kong Protest Mooncake AP Clients Only 4225572
Hong Kong bakery shows support for protests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.