దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇందుకుగాను తన మొదటి ఎలక్ట్రిక్ మోడల్ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. వినియోగదారులు ఎక్కువగా ఈ విభాగంలో వాహనాలు కొనేందుకు మొగ్గు చూపుతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రాజస్థాన్లోని జైపుర్, జర్మనీలోని స్టెఫాన్స్కిర్చెన్ రీసర్చ్ కేంద్రాలను ఉపయోగించి సొంతంగా వాహనాన్ని రూపొందించాలని చూస్తున్నట్లు వివరించారు.
హీరో మోటోకార్ప్ 2022 మొదటి త్రైమాసికంలో సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయనుంది. ఇందుకుగాను ఇటీవలే తైవాన్కు చెందిన గొగోరో అనే బ్యాటరీల కంపెనీతో చేతులు కలిపింది.
"మా సంస్థ నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఉత్పత్తులలో ఒకదాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. అందుకే గొగోరో అనే తైవాన్ కంపనీతో చేతులు కలిపాము."
-నిరంజన్ గుప్తా, హీరో మోటోకార్ప్ సీఎఫ్ఓ
గొగోరోతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల తమ సంస్థ తన సొంత ఉత్పత్తులను కూడా పెంచుకునే అవకాసం లభించిందని గుప్తా తెలిపారు.
ఇదీ చూడండి: ఏప్రిల్లో మూడు రెట్లు పెరిగిన ఎగుమతులు