ETV Bharat / business

'బీమా సంస్థల్లో 74శాతానికి ఎఫ్​డీఐలు' - insurance companies increase FDI limit from 49% to 74%

1938 బీమా చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతానికి పెంచనున్నట్లు వెల్లడించారు.

Govt proposes to increase FDI cap in insurance sector to 74 pc
బీమా సంస్థల్లో 74 శాతానికి ఎఫ్​డీఐలు
author img

By

Published : Feb 1, 2021, 12:39 PM IST

Updated : Feb 1, 2021, 12:44 PM IST

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది కేంద్రం. ఇప్పటివరకు 49 శాతానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తుండగా.. తాజా బడ్జెట్​లో ఈ పరిమితిని 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఇందుకు సంబంధించి విదేశీ సంస్థలకు యాజమాన్య వాటా దక్కేలా 1938 ఇన్సూరెన్స్ చట్టానికి మార్పులు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇన్​వెస్టర్ ఛార్టర్​ను సైతం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

"1938 బీమా చట్టాన్ని సవరించాలని ప్రతిపాదిస్తున్నా. దీని ప్రకారం బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెరుగుతుంది. ఈ సంస్థలను నియంత్రించే అధికారం విదేశీ యాజమాన్యానికి లభిస్తుంది."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది కేంద్రం. ఇప్పటివరకు 49 శాతానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తుండగా.. తాజా బడ్జెట్​లో ఈ పరిమితిని 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఇందుకు సంబంధించి విదేశీ సంస్థలకు యాజమాన్య వాటా దక్కేలా 1938 ఇన్సూరెన్స్ చట్టానికి మార్పులు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇన్​వెస్టర్ ఛార్టర్​ను సైతం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

"1938 బీమా చట్టాన్ని సవరించాలని ప్రతిపాదిస్తున్నా. దీని ప్రకారం బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెరుగుతుంది. ఈ సంస్థలను నియంత్రించే అధికారం విదేశీ యాజమాన్యానికి లభిస్తుంది."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

Last Updated : Feb 1, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.