ETV Bharat / business

క్రిప్టోకరెన్సీపై ఆర్థిక శాఖ కీలక ప్రకటన!

భారత్​లో క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టడంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు కేంద్రం సిద్ధం అని తెలిపారు. ఇంటర్​ మినిస్టిరియల్​ కమిటీ నివేదికను పరిశీలించి ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

author img

By

Published : Mar 6, 2021, 8:20 PM IST

crypto currency
క్రిప్టోకరెన్సీ చెలామణిపై కేంద్రం కీలక ప్రకటన

దేశంలో క్రిప్టోకరెన్సీ చెలామణీపై కేంద్రం శనివారం కీలక ప్రకటన చేసింది. పాలన వ్యవస్థను మెరుగుపరిచే ఏ సాంకేతికతను అయినా అమలులోకి తేవడానికి సిద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ తెలిపారు. అందులో క్రిప్టోకరెన్సీ ఒక భాగమేనన్నారు. సాంకేతికను స్వాగతించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.

"కొత్త సాంకేతికతను మేము స్వాగతిస్తాం. బ్లాక్​చైన్ టెక్నాలజీ అందులో ఓ భాగం. వర్చువల్​ కరెన్సీగా క్రిప్టో కరెన్సీ ఉంది. కొత్త విషయాలను, ఆలోచనలపై అవగాహన పెంచుకుని వాటిని ప్రోత్సహించాలని నేను బలంగా నమ్ముతాను. డిజిటల్ కరెన్సీలపై ఇంటర్​ మినిస్టిరియల్ కమిటీ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాము. ఈ క్రమంలో చట్టాన్ని ప్రతిపాదించాల్సి వస్తే.. పార్లమెంటులో ప్రవేశపెడతాము."

-అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి

క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్​ కరెన్సీల్లో యూనిట్లను ఉత్పత్తి నియంత్రించేందుకు, నగదు బదిలీని ధ్రువీకరించేందుకు ఎన్​క్రిప్షెన్​ పద్ధతిని ఉపయోగిస్తారు.

ఈ క్రిప్టోకరెన్సీపైన ఆర్​బీఐ ఇప్పటికే తన అభిప్రాయం తెలిపింది. వీటి అమలు వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీ ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : వారంలో భారీగా కరిగిన ఎలాన్ మస్క్‌ సంపద!

దేశంలో క్రిప్టోకరెన్సీ చెలామణీపై కేంద్రం శనివారం కీలక ప్రకటన చేసింది. పాలన వ్యవస్థను మెరుగుపరిచే ఏ సాంకేతికతను అయినా అమలులోకి తేవడానికి సిద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ తెలిపారు. అందులో క్రిప్టోకరెన్సీ ఒక భాగమేనన్నారు. సాంకేతికను స్వాగతించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.

"కొత్త సాంకేతికతను మేము స్వాగతిస్తాం. బ్లాక్​చైన్ టెక్నాలజీ అందులో ఓ భాగం. వర్చువల్​ కరెన్సీగా క్రిప్టో కరెన్సీ ఉంది. కొత్త విషయాలను, ఆలోచనలపై అవగాహన పెంచుకుని వాటిని ప్రోత్సహించాలని నేను బలంగా నమ్ముతాను. డిజిటల్ కరెన్సీలపై ఇంటర్​ మినిస్టిరియల్ కమిటీ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాము. ఈ క్రమంలో చట్టాన్ని ప్రతిపాదించాల్సి వస్తే.. పార్లమెంటులో ప్రవేశపెడతాము."

-అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి

క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్​ కరెన్సీల్లో యూనిట్లను ఉత్పత్తి నియంత్రించేందుకు, నగదు బదిలీని ధ్రువీకరించేందుకు ఎన్​క్రిప్షెన్​ పద్ధతిని ఉపయోగిస్తారు.

ఈ క్రిప్టోకరెన్సీపైన ఆర్​బీఐ ఇప్పటికే తన అభిప్రాయం తెలిపింది. వీటి అమలు వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీ ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : వారంలో భారీగా కరిగిన ఎలాన్ మస్క్‌ సంపద!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.