ETV Bharat / business

ఆర్బీఐ నుంచి కేంద్రానికి రూ.30వేల కోట్ల మధ్యంతర డివిడెండ్!

ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యమూ దారితప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ లోటు పూడ్చుకోవడానికి కేంద్రం ఈ సంవత్సరం చివరినాటికి ఆర్​బీఐ నుంచి రూ.30 వేల కోట్లు మేర మధ్యంతర డివిడెండ్​ కోరనుందని సమాచారం.

author img

By

Published : Sep 29, 2019, 6:21 PM IST

Updated : Oct 2, 2019, 12:01 PM IST

ఆర్బీఐ నుంచి కేంద్రానికి రూ.30వేల కోట్ల మధ్యంతర డివిడెండ్!

కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్​బీఐ నుంచి సుమారు 30 వేల కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్ కోవచ్చని సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ఈ ఆర్థిక లోటు భర్తీ చేసుకునేందుకు ఆర్​బీఐ నుంచి డివిడెంట్​ కోరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"అవసరమైతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల మేర మధ్యంతర డివిడెండ్​ మంజూరు చేయాలని రిజర్వ్​ బ్యాంకు ఆఫ్ ఇండియాను అభ్యర్థించవచ్చు. ఈ విషయంపై జనవరి ప్రారంభంలో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది."- ఓ అధికారి

నెమ్మదించిన ప్రగతి రథానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ఇటీవల కీలక చర్యలు చేపట్టింది. వృద్ధి తగ్గుదలతో ఆదాయమూ గణనీయంగా తగ్గింది. ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి.

ఇతర మార్గాలూ ఉన్నాయ్​

ఆర్​బీఐ డివిడెండ్ కాకుండా, ఆర్థికలోటు పూడ్చుకునేందుకు ప్రభుత్వానికి ఇతర మార్గాలూ ఉన్నాయి. అవి.. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, నేషనల్​ స్మాల్ సేవింగ్ ఫండ్​ (ఎన్​ఎస్​ఎస్​ఎఫ్​)ను ఉపయోగించుకోవడం.

ప్రభుత్వానికి ఇది అలవాటే...

కేంద్రం తన ఆర్థిక ఖాతాను సమతుల్యం చేసుకునేందుకు... ఆర్​బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్​ తీసుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. గతేడాది ఆర్బీఐ... కేంద్రానికి రూ.28,000 కోట్లు మధ్యంతర డివిడెండ్ ఇచ్చింది. 2017-18లో రూ.10 వేల కోట్లు ఇలానే ప్రభుత్వానికి సమర్పించింది.

బ్రహ్మాస్త్రం వాడేశారు......

గత నెలలో గవర్నర్ శక్తికాంత దాస్​ నేతృత్వంలోని ఆర్​బీఐ కేంద్ర బోర్డు 2018-19 సంవత్సరానికి రూ.1,76,051 కోట్లను బదిలీచేయడానికి అనుమతి ఇచ్చింది.
రుణాలు పెరుగుతున్నాయ్​

స్థూల రుణాల విషయానికి వస్తే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.5.35 లక్షల కోట్లు ఉన్నాయి. ఇవి 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి గణనీయంగా రూ.7.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రభుత్వ స్థూల రుణాలు రూ.4.42 లక్షల కోట్లు ఉంటుంది. ఇది మొత్తం ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 62.3 శాతం కావడం గమనార్హం.

ఇదీ చూడండి: మరో పారిశ్రామిక విప్లవం కోసం కేంద్రం కసరత్తు

కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్​బీఐ నుంచి సుమారు 30 వేల కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్ కోవచ్చని సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ఈ ఆర్థిక లోటు భర్తీ చేసుకునేందుకు ఆర్​బీఐ నుంచి డివిడెంట్​ కోరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"అవసరమైతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల మేర మధ్యంతర డివిడెండ్​ మంజూరు చేయాలని రిజర్వ్​ బ్యాంకు ఆఫ్ ఇండియాను అభ్యర్థించవచ్చు. ఈ విషయంపై జనవరి ప్రారంభంలో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది."- ఓ అధికారి

నెమ్మదించిన ప్రగతి రథానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ఇటీవల కీలక చర్యలు చేపట్టింది. వృద్ధి తగ్గుదలతో ఆదాయమూ గణనీయంగా తగ్గింది. ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి.

ఇతర మార్గాలూ ఉన్నాయ్​

ఆర్​బీఐ డివిడెండ్ కాకుండా, ఆర్థికలోటు పూడ్చుకునేందుకు ప్రభుత్వానికి ఇతర మార్గాలూ ఉన్నాయి. అవి.. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, నేషనల్​ స్మాల్ సేవింగ్ ఫండ్​ (ఎన్​ఎస్​ఎస్​ఎఫ్​)ను ఉపయోగించుకోవడం.

ప్రభుత్వానికి ఇది అలవాటే...

కేంద్రం తన ఆర్థిక ఖాతాను సమతుల్యం చేసుకునేందుకు... ఆర్​బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్​ తీసుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. గతేడాది ఆర్బీఐ... కేంద్రానికి రూ.28,000 కోట్లు మధ్యంతర డివిడెండ్ ఇచ్చింది. 2017-18లో రూ.10 వేల కోట్లు ఇలానే ప్రభుత్వానికి సమర్పించింది.

బ్రహ్మాస్త్రం వాడేశారు......

గత నెలలో గవర్నర్ శక్తికాంత దాస్​ నేతృత్వంలోని ఆర్​బీఐ కేంద్ర బోర్డు 2018-19 సంవత్సరానికి రూ.1,76,051 కోట్లను బదిలీచేయడానికి అనుమతి ఇచ్చింది.
రుణాలు పెరుగుతున్నాయ్​

స్థూల రుణాల విషయానికి వస్తే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.5.35 లక్షల కోట్లు ఉన్నాయి. ఇవి 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి గణనీయంగా రూ.7.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రభుత్వ స్థూల రుణాలు రూ.4.42 లక్షల కోట్లు ఉంటుంది. ఇది మొత్తం ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 62.3 శాతం కావడం గమనార్హం.

ఇదీ చూడండి: మరో పారిశ్రామిక విప్లవం కోసం కేంద్రం కసరత్తు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
Manchester - 29 September 2019
1. UK Prime Minister Boris Johnson's leaving BBC studios
2. Various of protesters outside studios
3. Various of UK Prime Minister Boris Johnson's motorcade
4. Johnson getting out of car and walking into building which is hosting the Conservative Conference
STORYLINE:
UK Prime Minister Boris Johnson was confronted by protesters in Manchester ahead of the Conservative party conference on Sunday.
The prime minister has been criticised for his use of the phrase "surrender" act to describe an opposition law ordering a Brexit delay.
He is also attempting to fend off accusations US businesswoman Jennifer Arcuri received favourable treatment during his time as mayor of London because of their friendship.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.