దేశవ్యాప్తంగా ఇకపై అన్ని వాహనాలకు ఒకే రకమైన కాలుష్య నియంత్రణ(పీయూసీ) ధ్రువీకరణ(PUC certificate) పత్రాన్ని జారీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సర్టిఫికేట్పై క్యూఆర్ కోడ్(QR code)ను ప్రింట్ చేయనున్నట్లు తెలిపింది. పీయూసీ డేటాబేస్(PUC database)ను నేషనల్ రిజిస్టర్(National Register)కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. 1989 మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులకు అనుగుణంగా.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పీయూసీ సర్టిఫికేట్పై ఉండే క్యూఆర్ కోడ్లో.. వాహనంతో పాటు యజమాని వివరాలు, కాలుష్య ఉద్గార స్థాయి వంటి సమాచారం ఉంటుందని వివరించింది. వీటితో పాటు యజమాని మొబైల్ నంబర్ను ఇందులో తప్పనిసరి చేసింది. వాహనం ధ్రువీకరణ కోసం ఈ నంబర్కు ఎస్ఎంఎస్ అలర్ట్లు వస్తాయని తెలిపింది.
తొలిసారి 'తిరస్కరణ పత్రం'(rejection slip) అనే విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది. అనుమతించే స్థాయి కన్నా అధిక ఉద్గారాలు వెలువడుతున్నట్లు పరీక్షల్లో తేలితే.. ఈ స్లిప్ను యజమానికి ఇవ్వనున్నట్లు తెలిపింది.
అలా చేయకపోతే జరిమానా...
ఏదైనా వాహనం కాలుష్య ప్రమాణాలకు లోబడి లేదని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భావిస్తే.. ఆ వాహనాన్ని పీయూసీ టెస్టింగ్ సెంటర్కు తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని అధికారులు యజమానికి.. నేరుగా లేదా ఆన్లైన్ మాధ్యమం ద్వారా సమాచారం అందించవచ్చని పేర్కొంది. ఒకవేళ అధికారుల ఆదేశాలను విస్మరిస్తే.. వాహన యజమాని జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
నూతన నిబంధనలను పాటించకపోతే వాహన రిజిస్ట్రేషన్ సహా పర్మిట్ను రద్దు చేసే అధికారం రిజిస్టరింగ్ అథారిటీకి ఉంటుందని వివరించింది.
ఇవీ చదవండి: