ETV Bharat / business

ఓటీటీ, డిజిటల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు

author img

By

Published : Feb 25, 2021, 2:21 PM IST

Updated : Feb 25, 2021, 3:39 PM IST

Government notifies new rules for OTT platforms and Digital Media
సోషల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు

14:18 February 25

సోషల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు

ఓటీటీ, డిజిటల్​ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈమేరకు కఠిన చర్యలు చేపట్టింది. సోషల్​ మీడియాపై ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. చీఫ్​ కంప్లయిన్స్​ ఆఫీసర్​, నోడల్​ అధికారి, రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

"భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఓటీటీలు, డిజిటల్ మీడియా స్వీయ నియంత్రణ పాటించేలా చూసేందుకే ఈ మార్గదర్శకాలు తెచ్చాం" అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ వెల్లడించారు. ఓటీటీల కోసం మూడంచెల విధానం తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఓటీటీ, డిజిటల్​ మీడియాకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి కాదని, తమ వివరాలను మాత్రం వెల్లడించాలని పేర్కొన్నారు. 

''ఓటీటీ, డిజిటల్‌ వేదికలు స్వీయనియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత జడ్జిల ఆధ్వర్యంలో ఇది ఉండాలి. ఓటీటీ కంటెంట్‌కు వయస్సు ఆధారంగా వర్గీకరణ ఉండాలి. ఓటీటీలను పిల్లలు చూడకుండా నియంత్రించే సదుపాయం ఉండాలి.''‌

          -  ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి

"సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, తప్పుడు సమాచారం వ్యాప్తిపై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే కేంద్రం ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమ సంస్థలు గ్రీవెన్స్ అధికారిని నియమించాలి. ఏమైనా ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోగా నమోదు చేయాలి. మహిళల నగ్న, మార్ఫ్​డ్​ చిత్రాలు ఉన్న కంటెంట్​ను 24 గంటల్లోగా తొలగించాలి." అని వివరించారు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. 

గ్రీవెన్స్​ అధికారి తప్పనిసరిగా భారత నివాసి అయి ఉండాలని స్పష్టం చేశారు. 

స్వాగతిస్తాం.. కానీ!

ఎలాంటి సామాజిక మాధ్యమాన్ని అయినా భారత్​లో స్వాగతిస్తామని.. కానీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తే ఉపేక్షించేది లేదని రవిశంకర్​ ప్రసాద్​ స్పష్టం చేశారు. 

''క్యాపిటల్​ హిల్​ భవనంపై దాడి జరిగితే.. సామాజిక మాధ్యమాలు పోలీసు చర్యకు మద్దతు ఇచ్చాయి. అదే ఎర్రకోటపై దాడి జరిగితే ద్వంద్వ వైఖరి అవలంబించాయి. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.''

            - రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ఐటీ శాఖ మంత్రి

14:18 February 25

సోషల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు

ఓటీటీ, డిజిటల్​ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈమేరకు కఠిన చర్యలు చేపట్టింది. సోషల్​ మీడియాపై ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. చీఫ్​ కంప్లయిన్స్​ ఆఫీసర్​, నోడల్​ అధికారి, రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

"భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఓటీటీలు, డిజిటల్ మీడియా స్వీయ నియంత్రణ పాటించేలా చూసేందుకే ఈ మార్గదర్శకాలు తెచ్చాం" అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ వెల్లడించారు. ఓటీటీల కోసం మూడంచెల విధానం తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఓటీటీ, డిజిటల్​ మీడియాకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి కాదని, తమ వివరాలను మాత్రం వెల్లడించాలని పేర్కొన్నారు. 

''ఓటీటీ, డిజిటల్‌ వేదికలు స్వీయనియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత జడ్జిల ఆధ్వర్యంలో ఇది ఉండాలి. ఓటీటీ కంటెంట్‌కు వయస్సు ఆధారంగా వర్గీకరణ ఉండాలి. ఓటీటీలను పిల్లలు చూడకుండా నియంత్రించే సదుపాయం ఉండాలి.''‌

          -  ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి

"సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, తప్పుడు సమాచారం వ్యాప్తిపై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే కేంద్రం ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమ సంస్థలు గ్రీవెన్స్ అధికారిని నియమించాలి. ఏమైనా ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోగా నమోదు చేయాలి. మహిళల నగ్న, మార్ఫ్​డ్​ చిత్రాలు ఉన్న కంటెంట్​ను 24 గంటల్లోగా తొలగించాలి." అని వివరించారు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. 

గ్రీవెన్స్​ అధికారి తప్పనిసరిగా భారత నివాసి అయి ఉండాలని స్పష్టం చేశారు. 

స్వాగతిస్తాం.. కానీ!

ఎలాంటి సామాజిక మాధ్యమాన్ని అయినా భారత్​లో స్వాగతిస్తామని.. కానీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తే ఉపేక్షించేది లేదని రవిశంకర్​ ప్రసాద్​ స్పష్టం చేశారు. 

''క్యాపిటల్​ హిల్​ భవనంపై దాడి జరిగితే.. సామాజిక మాధ్యమాలు పోలీసు చర్యకు మద్దతు ఇచ్చాయి. అదే ఎర్రకోటపై దాడి జరిగితే ద్వంద్వ వైఖరి అవలంబించాయి. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.''

            - రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ఐటీ శాఖ మంత్రి

Last Updated : Feb 25, 2021, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.