ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Dec 15, 2020, 4:55 PM IST

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో మంగళవారం రూ.510కిపైగా ఎగిసింది. వెండి ధర కిలోకు మళ్లీ రూ.63,600 పైకి చేరింది.

Gold and Silver Price Rise
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.514 పెరిగి.. రూ.48,847 వద్దకు చేరింది.

రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా పసిడికి పెరిగిన డిమాండ్​తో.. దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.1,046 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.63,612 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,845 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 23.16 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:'రెండు దశాబ్దాల్లో.. టాప్‌-3 ఆర్థికవ్యవస్థల్లో భారత్‌'

ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.514 పెరిగి.. రూ.48,847 వద్దకు చేరింది.

రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా పసిడికి పెరిగిన డిమాండ్​తో.. దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.1,046 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.63,612 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,845 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 23.16 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:'రెండు దశాబ్దాల్లో.. టాప్‌-3 ఆర్థికవ్యవస్థల్లో భారత్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.