ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Jan 4, 2021, 3:58 PM IST

పసిడి, వెండి ధరలు సోమవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర మళ్లీ రూ.50 వేల పైకి చేరింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.69 వేలు దాటింది.

Huge rise in Gold and Silver price
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర సోమవారం భారీగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.877 ఎగిసి.. రూ.50,619 వద్దకు చేరింది.

డాలర్​ విలువ క్షీణిస్తున్న కారణంగా పసిడి ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు(దిల్లీలో) భారీగా రూ.2,012 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,454 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,935 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.30 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చూడండి:ఇక భారత్‌లోనూ లెనోవో టాబ్లెట్​ల తయారీ

బంగారం ధర సోమవారం భారీగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.877 ఎగిసి.. రూ.50,619 వద్దకు చేరింది.

డాలర్​ విలువ క్షీణిస్తున్న కారణంగా పసిడి ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు(దిల్లీలో) భారీగా రూ.2,012 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,454 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,935 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.30 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చూడండి:ఇక భారత్‌లోనూ లెనోవో టాబ్లెట్​ల తయారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.