ETV Bharat / business

గోద్రెజ్​ గ్రూపులో త్వరలో వ్యాపార విభజన!

author img

By

Published : Oct 30, 2021, 7:39 PM IST

గోద్రెజ్​ గ్రూపునకు సారథ్యం వహిస్తున్న గోద్రెజ్ కుటుంబంలో చీలిక(Godrej Group Split) వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం గ్రూపును రెండుగా విభజించాలని భావిస్తున్నారని సమాచారం. వ్యాపార విభజనలో బయటి నుంచి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సలహాలు కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Godrej Group split
గోద్రెజ్​ గ్రూపు

సబ్బులు, గృహోపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీయ దిగ్గజం గోద్రెజ్ గ్రూప్‌. ఈ గ్రూపు​నకు గోద్రెజ్‌ కుటుంబం(Godrej Family) సారథ్యం వహిస్తోంది. అయితే, అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం ఈ కుటుంబంలో చీలిక(Godrej Group Split) వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపార విభజన(Godrej Group Split) జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బయటి నుంచి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సలహాలు కోరినట్లు పేర్కొన్నాయి.

124 సంవత్సరాల క్రితం 1897లో న్యాయవాది నుంచి వ్యాపారవేత్త అవతారమెత్తిన అర్దెశిర్ గోద్రెజ్.. గోద్రెజ్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం గోద్రెజ్ గ్రూపునకు ఆది గోద్రెజ్ (79) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు నాదిర్.. గోద్రెజ్ ఇండస్ట్రీస్‌, గోద్రెజ్ అగ్రోవెట్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. వీరి కజిన్‌ జంషీద్‌ ఎన్‌ గోద్రెజ్.. గోద్రెజ్ అండ్‌ బోయ్స్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు.

ఇలా విభజిస్తారట..

ప్రస్తుతం గ్రూపును రెండుగా విభజించాలని(Godrej Group Split) భావిస్తున్నారని సమాచారం. దీంట్లో ఒకదానికి ఆది, నాదిర్‌ నేతృత్వం వహిస్తారు. మరో దాన్ని జంషీద్‌, ఆయన సోదరి స్మితా గోద్రెజ్ కృష్ణా నిర్వహిస్తారు. ఈ వార్తలపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన గోద్రెజ్ కుటుంబం.. "తమ గ్రూపు సంస్థల్లోని వాటాదార్లకు లబ్ధి చేకూరేలా దీర్ఘకాల వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తున్నాం" అని తెలిపింది. ఇందులో భాగంగా బయటి నుంచి కూడా సలహాలు కోరినట్లు పేర్కొంది. ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉండే బ్యాంకర్లు నిమేశ్‌ కంపానీ, ఉదయ్‌ కొటాక్‌తో పాటు న్యాయపరమైన వ్యవహారాల్లో పేరుగాంచిన జియా మోదీ, సిరిల్‌ ష్రాఫ్‌ సైతం ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ట్రస్టులకు 23 శాతం..

గోద్రెజ్ గ్రూప్ ప్రమోటర్‌ హోల్డింగ్‌లో 23 శాతం ట్రస్టులకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ట్రస్టులు పర్యావరణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.

ఇవీ కంపెనీలు..

గోద్రెజ్ గ్రూపు కంపెనీల్లో గోద్రెజ్ అండ్‌ బోయ్స్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ ప్రముఖమైంది. స్టాక్‌మార్కెట్‌లో నమోదు కాని ఈ కంపెనీ జంషీద్‌ నేతృత్వంలో ఉంది. ఇక గోద్రెజ్ కన్జ్యూమర్‌ పోడక్ట్స్‌ లిమిటెడ్‌, గోద్రెజ్ అగ్రోవెట్‌, గోద్రెజ్ ప్రాపర్టీస్‌ అండ్ గోద్రెజ్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఇవి ఆది, నాదిర్‌ ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే, ఇరు వర్గాలకు రెండు వైపుల కంపెనీల్లో వాటాలుంటాయి. కేవలం కార్యకలాపాల నిర్వహణ కోసం మాత్రమే ఇప్పటి వరకు బాధ్యతల విభజన కొనసాగింది.

ఇవీ ప్రస్తుత హోదాలు..

ఇప్పటి వరకు ఛైర్మన్‌ హోదాలో ఈ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఆది గోద్రెజ్ క్రమంగా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. తర్వాతి తరం సంస్థలో ఇప్పటికే వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె తన్యా దుబాష్‌.. గోద్రెజ్ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, చీఫ్‌ బ్రాండ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. చిన్నకూతురు నిసబా గోద్రెజ్.. గోద్రెజ్ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. కుమారుడు ఫిరోజ్‌షా.. గోద్రెజ్ ప్రాపర్టీస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు గత ఆగస్టులో ఆది గోద్రెజ్ ప్రకటించారు. తన సోదరుడు నాదిర్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. ఇక జంషీద్‌ సోదరి స్మితా వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఆమె భర్త విజయ్‌ కృష్ణా గోద్రెజ్ అండ్ బోయ్స్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా.. గోద్రెజ్ ఇండస్ట్రీస్‌, గోద్రెజ్ అగ్రోవెట్‌ డైరెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇందుకే విభజన..

తర్వాతి తరం వ్యాపారంలోకి వస్తున్న కొద్దీ బాధ్యతలు, యాజమాన్యంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని కుటుంబం భావించిన నేపథ్యంలో విభజన(Godrej Group Split) అనివార్యమైనట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

సబ్బులు, గృహోపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీయ దిగ్గజం గోద్రెజ్ గ్రూప్‌. ఈ గ్రూపు​నకు గోద్రెజ్‌ కుటుంబం(Godrej Family) సారథ్యం వహిస్తోంది. అయితే, అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం ఈ కుటుంబంలో చీలిక(Godrej Group Split) వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపార విభజన(Godrej Group Split) జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బయటి నుంచి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సలహాలు కోరినట్లు పేర్కొన్నాయి.

124 సంవత్సరాల క్రితం 1897లో న్యాయవాది నుంచి వ్యాపారవేత్త అవతారమెత్తిన అర్దెశిర్ గోద్రెజ్.. గోద్రెజ్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం గోద్రెజ్ గ్రూపునకు ఆది గోద్రెజ్ (79) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు నాదిర్.. గోద్రెజ్ ఇండస్ట్రీస్‌, గోద్రెజ్ అగ్రోవెట్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. వీరి కజిన్‌ జంషీద్‌ ఎన్‌ గోద్రెజ్.. గోద్రెజ్ అండ్‌ బోయ్స్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు.

ఇలా విభజిస్తారట..

ప్రస్తుతం గ్రూపును రెండుగా విభజించాలని(Godrej Group Split) భావిస్తున్నారని సమాచారం. దీంట్లో ఒకదానికి ఆది, నాదిర్‌ నేతృత్వం వహిస్తారు. మరో దాన్ని జంషీద్‌, ఆయన సోదరి స్మితా గోద్రెజ్ కృష్ణా నిర్వహిస్తారు. ఈ వార్తలపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన గోద్రెజ్ కుటుంబం.. "తమ గ్రూపు సంస్థల్లోని వాటాదార్లకు లబ్ధి చేకూరేలా దీర్ఘకాల వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తున్నాం" అని తెలిపింది. ఇందులో భాగంగా బయటి నుంచి కూడా సలహాలు కోరినట్లు పేర్కొంది. ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉండే బ్యాంకర్లు నిమేశ్‌ కంపానీ, ఉదయ్‌ కొటాక్‌తో పాటు న్యాయపరమైన వ్యవహారాల్లో పేరుగాంచిన జియా మోదీ, సిరిల్‌ ష్రాఫ్‌ సైతం ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ట్రస్టులకు 23 శాతం..

గోద్రెజ్ గ్రూప్ ప్రమోటర్‌ హోల్డింగ్‌లో 23 శాతం ట్రస్టులకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ట్రస్టులు పర్యావరణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.

ఇవీ కంపెనీలు..

గోద్రెజ్ గ్రూపు కంపెనీల్లో గోద్రెజ్ అండ్‌ బోయ్స్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ ప్రముఖమైంది. స్టాక్‌మార్కెట్‌లో నమోదు కాని ఈ కంపెనీ జంషీద్‌ నేతృత్వంలో ఉంది. ఇక గోద్రెజ్ కన్జ్యూమర్‌ పోడక్ట్స్‌ లిమిటెడ్‌, గోద్రెజ్ అగ్రోవెట్‌, గోద్రెజ్ ప్రాపర్టీస్‌ అండ్ గోద్రెజ్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఇవి ఆది, నాదిర్‌ ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే, ఇరు వర్గాలకు రెండు వైపుల కంపెనీల్లో వాటాలుంటాయి. కేవలం కార్యకలాపాల నిర్వహణ కోసం మాత్రమే ఇప్పటి వరకు బాధ్యతల విభజన కొనసాగింది.

ఇవీ ప్రస్తుత హోదాలు..

ఇప్పటి వరకు ఛైర్మన్‌ హోదాలో ఈ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఆది గోద్రెజ్ క్రమంగా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. తర్వాతి తరం సంస్థలో ఇప్పటికే వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె తన్యా దుబాష్‌.. గోద్రెజ్ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, చీఫ్‌ బ్రాండ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. చిన్నకూతురు నిసబా గోద్రెజ్.. గోద్రెజ్ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. కుమారుడు ఫిరోజ్‌షా.. గోద్రెజ్ ప్రాపర్టీస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు గత ఆగస్టులో ఆది గోద్రెజ్ ప్రకటించారు. తన సోదరుడు నాదిర్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. ఇక జంషీద్‌ సోదరి స్మితా వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఆమె భర్త విజయ్‌ కృష్ణా గోద్రెజ్ అండ్ బోయ్స్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా.. గోద్రెజ్ ఇండస్ట్రీస్‌, గోద్రెజ్ అగ్రోవెట్‌ డైరెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇందుకే విభజన..

తర్వాతి తరం వ్యాపారంలోకి వస్తున్న కొద్దీ బాధ్యతలు, యాజమాన్యంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని కుటుంబం భావించిన నేపథ్యంలో విభజన(Godrej Group Split) అనివార్యమైనట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.