దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర 25 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా పెట్రోల్ ధర రూ.92.11కి పెరిగింది. మరోవైపు, దిల్లీలో లీటరు డీజిల్ ధర సైతం 25 పైసలు పెరిగి.. రూ.82.67కి చేరుకుంది.
తాజా పెంపుతో భోపాల్లో పెట్రోల్ వంద రూపాయలు దాటింది. ప్రస్తుతం రూ.100.08 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.90.05కి పెరిగింది.
ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.98.36గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.75కి చేరింది.