ETV Bharat / business

కొత్త ఏడాది నుంచి వాహనాలకు ఫాస్ట్​ట్యాగ్ తప్పనిసరి

author img

By

Published : Dec 24, 2020, 8:16 PM IST

వచ్చే జనవరి 1 నుంచి అన్ని రకాల వాహనాలకు ఫాస్ట్​ట్యాగ్​ తప్పనిసరి చేసింది కేంద్రం. దీనివల్ల టోల్​గేట్ల వద్ద రుసుం చెల్లించేటప్పుడు రద్దీ తగ్గుతుందని తెలిపింది. వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని పేర్కొంది.

FASTag to be mandatory for vehicles from Jan 1, says Gadkari
కొత్త ఏడాది నుంచి వాహనాలకు ఫాస్ట్​ట్యాగ్ తప్పనిసరి

కొత్త ఏడాది జనవరి 1 నుంచి దేశంలోని అన్ని రకాల వాహనాలకు ఫాస్ట్​ట్యాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల టోల్​ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్​ పద్ధతిలో రుసుములు చెల్లించవచ్చని,.. ఫలితంగా రద్ధీ తగ్గడమే కాకుండా వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. గురువారం ఓ వర్చువల్​ సమావేశంలో పాల్గొన్న గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఎలక్ట్రానిక్​ పద్ధతిలో టోల్​ రుసుం చెల్లించే ఫాస్ట్​ట్యాగ్​ విధానాన్ని 2016లోనే ప్రారంభించింది కేంద్రం. ఆ ఏడాది నాలుగు బ్యాంకులు కలిసి దాదాపు లక్ష ఫాస్ట్​ట్యాగ్​లను జారీ చేశాయి. ఆ తర్వాత 2017లో ఫాస్ట్​ట్యాగ్​ల సంఖ్య 7 లక్షలకు పెరిగింది. 2018లో ఏకంగా 34లక్షలకు పైగా ఫాస్ట్​ట్యాగ్​లను జారీ చేశారు.

పాత వహనాలు, 2017 డిసెంబర్​ 1కి ముందు వరకు విక్రయించిన వాహనాలకు ఫాస్ట్​ట్యాగ్​ తప్పనిసరి అని ఈ ఏడాది నవంబర్​లోనే నోటిఫికేషన్​ విడుదల చేసింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. 1989 కేంద్ర మోటారు వాహనాల నిబంధనల మేరకు కొత్త వాహనాలకు ఫాస్ట్​ ట్యాగ్​ తప్పనిసరి చేసింది. వాహనాల ఫిట్​నెస్​ సర్టిఫికేట్​ పునరుద్ధరణకు ఫాస్ట్​ట్యాగ్​ ​ కావాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: '2020-21 క్యూ3లో వృద్ధి రేటు క్షీణత 0.8 శాతమే'

కొత్త ఏడాది జనవరి 1 నుంచి దేశంలోని అన్ని రకాల వాహనాలకు ఫాస్ట్​ట్యాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల టోల్​ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్​ పద్ధతిలో రుసుములు చెల్లించవచ్చని,.. ఫలితంగా రద్ధీ తగ్గడమే కాకుండా వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. గురువారం ఓ వర్చువల్​ సమావేశంలో పాల్గొన్న గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఎలక్ట్రానిక్​ పద్ధతిలో టోల్​ రుసుం చెల్లించే ఫాస్ట్​ట్యాగ్​ విధానాన్ని 2016లోనే ప్రారంభించింది కేంద్రం. ఆ ఏడాది నాలుగు బ్యాంకులు కలిసి దాదాపు లక్ష ఫాస్ట్​ట్యాగ్​లను జారీ చేశాయి. ఆ తర్వాత 2017లో ఫాస్ట్​ట్యాగ్​ల సంఖ్య 7 లక్షలకు పెరిగింది. 2018లో ఏకంగా 34లక్షలకు పైగా ఫాస్ట్​ట్యాగ్​లను జారీ చేశారు.

పాత వహనాలు, 2017 డిసెంబర్​ 1కి ముందు వరకు విక్రయించిన వాహనాలకు ఫాస్ట్​ట్యాగ్​ తప్పనిసరి అని ఈ ఏడాది నవంబర్​లోనే నోటిఫికేషన్​ విడుదల చేసింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. 1989 కేంద్ర మోటారు వాహనాల నిబంధనల మేరకు కొత్త వాహనాలకు ఫాస్ట్​ ట్యాగ్​ తప్పనిసరి చేసింది. వాహనాల ఫిట్​నెస్​ సర్టిఫికేట్​ పునరుద్ధరణకు ఫాస్ట్​ట్యాగ్​ ​ కావాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: '2020-21 క్యూ3లో వృద్ధి రేటు క్షీణత 0.8 శాతమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.