ETV Bharat / business

కరోనా టీకా సమాచారానికి ఫేస్​బుక్​ కొత్త టూల్​

author img

By

Published : May 19, 2021, 6:51 PM IST

భారత్​లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం 'ఫేస్‌బుక్' తనవంతు సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య విభాగాలు కరోనా సంబంధిత సమాచారాన్ని త్వరితగతిన పంచుకునేలా 'కొవిడ్-19 అనౌన్స్‌మెంట్' టూల్​ను భారత్​లో అందుబాటులోకి తీసుకురానునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది.

Facebook
ఫేస్‌బుక్

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ 'కొవిడ్-19 అనౌన్స్‌మెంట్' ఫీచర్​ను భారత్​లో ప్రవేశపెట్టనుంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీనిని రూపొందించనున్నట్లు వెల్లడించింది. ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చిన రెండో దేశం భారతదేశమేనని 'ఎఫ్​బీ' తెలిపింది.

కొవిడ్-19 అనౌన్స్‌మెంట్' ఫీచర్స్..

  • రాష్ట్ర ఆరోగ్య శాఖ పేజీల్లోని పోస్ట్‌లను ప్రజలు ఎక్కువ సంఖ్యలో వీక్షించే అవకాశం ఉందని ఫేస్​బుక్ తెలిపింది. ఈ సేవలను మరింత విస్తరించి, కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోని వ్యక్తులకు అలెర్ట్ నోటిఫికేషన్లను పంపనున్నట్లు ఫేస్​బుక్ పేర్కొంది.
  • కరోనా టీకాల సమాచారాన్ని ప్రజలకు సకాలంలో చేరవేసేందుకు రాష్ట్రాల ఆరోగ్య విభాగాలకు ఈ ఫీచర్​ తోడ్పడనుంది. అంతేగాక.. టీకాల గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు అందించనుంది.
  • కరోనా చికిత్స వనరులపై సమాచారాన్ని పంచుకునేందుకు ఈ పేజీలను హెల్ప్‌లైన్‌లుగా ఉపయోగించవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది. ఐసీయూ, ఆక్సిజన్ పడకలకు సంబంధించిన సమాచారంతో పాటు.. జిల్లా ఆసుపత్రుల్లో కరోనా పడకల లభ్యత, లాక్​డౌన్​, రాత్రి కర్ఫ్యూలు, కరోనా చికిత్స నిబంధనలను ఈ పేజీల ద్వారా పంచుకోనుంది ఫేస్​బుక్.

ఇవీ చదవండి: 'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్!

ఇకపై రాష్ట్రాల వారీగా ట్విట్టర్ 'ఎస్ఓఎస్'

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ 'కొవిడ్-19 అనౌన్స్‌మెంట్' ఫీచర్​ను భారత్​లో ప్రవేశపెట్టనుంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీనిని రూపొందించనున్నట్లు వెల్లడించింది. ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చిన రెండో దేశం భారతదేశమేనని 'ఎఫ్​బీ' తెలిపింది.

కొవిడ్-19 అనౌన్స్‌మెంట్' ఫీచర్స్..

  • రాష్ట్ర ఆరోగ్య శాఖ పేజీల్లోని పోస్ట్‌లను ప్రజలు ఎక్కువ సంఖ్యలో వీక్షించే అవకాశం ఉందని ఫేస్​బుక్ తెలిపింది. ఈ సేవలను మరింత విస్తరించి, కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోని వ్యక్తులకు అలెర్ట్ నోటిఫికేషన్లను పంపనున్నట్లు ఫేస్​బుక్ పేర్కొంది.
  • కరోనా టీకాల సమాచారాన్ని ప్రజలకు సకాలంలో చేరవేసేందుకు రాష్ట్రాల ఆరోగ్య విభాగాలకు ఈ ఫీచర్​ తోడ్పడనుంది. అంతేగాక.. టీకాల గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు అందించనుంది.
  • కరోనా చికిత్స వనరులపై సమాచారాన్ని పంచుకునేందుకు ఈ పేజీలను హెల్ప్‌లైన్‌లుగా ఉపయోగించవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది. ఐసీయూ, ఆక్సిజన్ పడకలకు సంబంధించిన సమాచారంతో పాటు.. జిల్లా ఆసుపత్రుల్లో కరోనా పడకల లభ్యత, లాక్​డౌన్​, రాత్రి కర్ఫ్యూలు, కరోనా చికిత్స నిబంధనలను ఈ పేజీల ద్వారా పంచుకోనుంది ఫేస్​బుక్.

ఇవీ చదవండి: 'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్!

ఇకపై రాష్ట్రాల వారీగా ట్విట్టర్ 'ఎస్ఓఎస్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.