పంజాబ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్ను ఆర్థిక ఉల్లంఘనల విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేశారు. రూ. 4,355.43 కోట్లు కుంభకోణానికి పాల్పన్నందుకు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబయికి చెందిన ఈఓడబ్ల్యూ పోలీసులు ఆయనను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు తెలిపారు.
ముంబయిలో బ్యాంక్ మాజీ ఛైర్మన్, హెచ్డీఐఎల్ ప్రమోటర్లకు చెందిన ఆరు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈఓడబ్ల్యూ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వీరిపై చర్యలు చేపట్టింది.
ఎఫ్ఐఆర్లో మరికొంత మంది పేర్లు
ఇప్పటికే హెచ్డీఐఎల్ డైరెక్టర్లు రాకేష్ వాద్వాన్, సారంగ్ వాద్వాన్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గత దశాబ్ద కాలంలో బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్డీఐఎల్ సీనియర్ అధికారులపై ఈఓడబ్ల్యూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్లో పీఎంసీ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్, మాజీ ఛైర్మన్ వార్యమ్ సింగ్, ఇతర ఉన్నతాధికారుల పేర్లు చేర్చారు.