ETV Bharat / business

'డిజిటల్‌ మోసాలకు టెక్నాలజీతో కళ్లెం'

author img

By

Published : Mar 21, 2021, 6:31 AM IST

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆన్​లైన్​ మోసాలు వెలుగుచూస్తున్నాయి. బ్యాంకులు తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నా.. ఏదో ఒక రకంగా వినియోగదారులు సైబర్​ నేరాలకు గురవుతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అనుబ్రత బిశ్వాస్. అవేంటో చదివేయండి.

escape from cyber attacks with technical tips: Airtel Payments Bank MD, CEO Anubrata Biswas
డిజిటల్‌ మోసాలకు టెక్నాలజీతో కళ్లెం

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా డిజిటల్‌ మోసాలే. ఆన్‌లైన్‌లో నగదు తస్కరించారని, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే డబ్బు పోయిందని, డెబిట్‌/ క్రెడిట్‌ కార్డును క్లోనింగ్‌ చేసి ఖాతా ఖాళీ చేశారని.. ఇలా పలు రకాలైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక పక్క ఆర్‌బీఐ మరోపక్క బ్యాంకులు తమ ఖాతాదార్లను ఎంతగా అప్రమత్తం చేస్తున్నా.. ఏదో ఒక మార్గంలో వినియోగదార్లను సైబర్‌ నేరస్తులు మోసం చేస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల డిజిటల్‌ లావాదేవీలు బాగా పెరగడం కూడా మోసగాళ్లకు కలిసివస్తోంది. డిజిటల్‌ మోసాలు జరుగుతున్న తీరు, బదులుగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి.. తమ వైపు నుంచి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అనే అంశాలను ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అనుబ్రత బిశ్వాస్‌ 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఆ విశేషాలు..

డిజిటల్‌ మోసాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. వీటికి కళ్లెం వేసేదెట్లా

దేశంలో 'డిజిటల్‌ ఎకానమీ' ని ఆవిష్కరించటంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోంది. అందులోనూ మోసాలను అరికట్టటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు వినియోగదార్లను అప్రమత్తం చేయటంతో పాటు టెక్నాలజీ పరంగా చేయగలిగిందంతా చేస్తోంది. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. ఇటీవల కాలంలో మోసాలు పెరగటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మభ్యపెట్టి మోసం చేయటానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో భయం ఏర్పడింది. ఈ మధ్య ఒక సర్వే వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రజల్లో 47% మంది డిజిటల్‌ మోసాలపై హడలిపోతున్నారని ఈ సర్వేలో స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో వినియోగదార్లు జాగ్రత్తగా ఉండాలి. భద్రమైన రీతిలో లావాదేవీలు నిర్వహించాలి. తద్వారా మోసాల నుంచి తప్పించుకోవచ్చు.

ఖాతాదార్లు ఏవిధంగా డిజిటల్‌ మోసాలకు గురవుతున్నారు..

ఫిషింగ్‌, లాగిన్‌ క్రెడెన్షియల్స్‌- పాస్‌వర్డ్‌లు దొంగిలించటం, ఫోన్‌ క్లోనింగ్‌... వంటి మార్గాల్లో డిజిటల్‌ మోసాలు జరుగుతున్నాయి. వినియోగదార్లను మాటల్లో పెట్టి, ఏదో జరిగిపోతోందని భయపెట్టి లేదా ఏదో ఒక ఆశ చూపి కీలకమైన సమాచారాన్ని మోసగాళ్లు తస్కరిస్తారు. ఓటీపీ వంటి ముఖ్యమైన వివరాలు లాగేసుకుంటారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయటం ద్వారా మోసగించే పద్ధతులను మోసగాళ్లు ఇటీవల అనుసరిస్తున్నారు.

ఇటువంటి మోసాలను నివారించటం ఎలా

అన్ని రకాలైన భద్రతా చర్యలు అనుసరించటమే మార్గం. బ్యాంకుల, చెల్లింపుల సేవల్లో నిమగ్నమై ఉన్న సంస్థలు అత్యుత్తమ టెక్నాలజీని వినియోగించాలి. అదే సమయంలో ఖాతాదార్లు తమకు తాముగా జాగ్రత్తలు పాటించాలి. బ్యాంకుల వైపు నుంచి వినియోగదార్ల డేటా బయటకు వెళ్లకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఓటీపీలు- పాస్‌వర్డ్‌లు వంటి ముఖ్యమైన సమాచారాన్ని బయటకు వెల్లడించకూడదు. అజ్ఞాత వ్యక్తులు చేసే ఫోన్‌కాల్స్‌కు స్పందించరాదు.

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటోంది

మా ఖాతాదార్లు ఎవరూ డిజిటల్‌ మోసాలకు గురికారాదనే లక్ష్యంతో 'ఎయిర్‌టెల్‌ సేఫ్‌ పే' అనే సదుపాయాన్ని ఆవిష్కరించాం. ఇదొక అదనపు భద్రతా చర్య. ఓటీపీ (మోసగాళ్లు ఓటీపీని తెలుసుకోగలిగితే..) తర్వాత ఖాతాదారుడి మొబైల్‌కు 'పేమెంట్‌ వాలిడేషన్‌ మెసేజ్‌' వెళ్తుంది. దాన్ని ఖాతాదారుడు ఆమోదిస్తేనే చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఎయిర్‌టెల్‌కు ప్రత్యేకంగా ఉన్న నెట్‌వర్క్‌ ఇంటిలిజెన్స్‌ మీద ఆధారపడి ఎయిర్‌టెల్‌ సిమ్‌తో ఓటీఏ (ఓవర్‌ ద ఎయిర్‌) టెక్నాలజీ ద్వారా తీసుకువచ్చిన సరికొత్త భద్రతా చర్య ఇది. అందువల్ల మా ఖాతాదార్లు చెల్లింపులు చేసే సమయంలో మోసాలకు గురయ్యే అవకాశం దాదాపు ఉండదు.

ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సేవలు, ఎయిర్‌టెల్‌ సేఫ్‌పే కేవలం ఎయిర్‌టెల్‌ వినియోగదార్లకేనా... లేక ఇతర టెలికామ్‌ సంస్థల వినియోగదార్లు కూడా పొందవచ్చా

ఈ సేవలు ఎయిర్‌టెల్‌ టెక్నాలజీ ఆధారంగా అందిస్తున్న సేవలు అయినందున ఇతర టెలికామ్‌ సంస్థల వినియోగదార్లకు అందించటం సాధ్యం కాదు.

ఇదీ చూడండి: ఉద్యోగుల టీకా ఖర్చు మేమే చెల్లిస్తాం: అదానీ గ్రూప్​

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా డిజిటల్‌ మోసాలే. ఆన్‌లైన్‌లో నగదు తస్కరించారని, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే డబ్బు పోయిందని, డెబిట్‌/ క్రెడిట్‌ కార్డును క్లోనింగ్‌ చేసి ఖాతా ఖాళీ చేశారని.. ఇలా పలు రకాలైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక పక్క ఆర్‌బీఐ మరోపక్క బ్యాంకులు తమ ఖాతాదార్లను ఎంతగా అప్రమత్తం చేస్తున్నా.. ఏదో ఒక మార్గంలో వినియోగదార్లను సైబర్‌ నేరస్తులు మోసం చేస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల డిజిటల్‌ లావాదేవీలు బాగా పెరగడం కూడా మోసగాళ్లకు కలిసివస్తోంది. డిజిటల్‌ మోసాలు జరుగుతున్న తీరు, బదులుగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి.. తమ వైపు నుంచి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అనే అంశాలను ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అనుబ్రత బిశ్వాస్‌ 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఆ విశేషాలు..

డిజిటల్‌ మోసాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. వీటికి కళ్లెం వేసేదెట్లా

దేశంలో 'డిజిటల్‌ ఎకానమీ' ని ఆవిష్కరించటంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోంది. అందులోనూ మోసాలను అరికట్టటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు వినియోగదార్లను అప్రమత్తం చేయటంతో పాటు టెక్నాలజీ పరంగా చేయగలిగిందంతా చేస్తోంది. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. ఇటీవల కాలంలో మోసాలు పెరగటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మభ్యపెట్టి మోసం చేయటానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో భయం ఏర్పడింది. ఈ మధ్య ఒక సర్వే వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రజల్లో 47% మంది డిజిటల్‌ మోసాలపై హడలిపోతున్నారని ఈ సర్వేలో స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో వినియోగదార్లు జాగ్రత్తగా ఉండాలి. భద్రమైన రీతిలో లావాదేవీలు నిర్వహించాలి. తద్వారా మోసాల నుంచి తప్పించుకోవచ్చు.

ఖాతాదార్లు ఏవిధంగా డిజిటల్‌ మోసాలకు గురవుతున్నారు..

ఫిషింగ్‌, లాగిన్‌ క్రెడెన్షియల్స్‌- పాస్‌వర్డ్‌లు దొంగిలించటం, ఫోన్‌ క్లోనింగ్‌... వంటి మార్గాల్లో డిజిటల్‌ మోసాలు జరుగుతున్నాయి. వినియోగదార్లను మాటల్లో పెట్టి, ఏదో జరిగిపోతోందని భయపెట్టి లేదా ఏదో ఒక ఆశ చూపి కీలకమైన సమాచారాన్ని మోసగాళ్లు తస్కరిస్తారు. ఓటీపీ వంటి ముఖ్యమైన వివరాలు లాగేసుకుంటారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయటం ద్వారా మోసగించే పద్ధతులను మోసగాళ్లు ఇటీవల అనుసరిస్తున్నారు.

ఇటువంటి మోసాలను నివారించటం ఎలా

అన్ని రకాలైన భద్రతా చర్యలు అనుసరించటమే మార్గం. బ్యాంకుల, చెల్లింపుల సేవల్లో నిమగ్నమై ఉన్న సంస్థలు అత్యుత్తమ టెక్నాలజీని వినియోగించాలి. అదే సమయంలో ఖాతాదార్లు తమకు తాముగా జాగ్రత్తలు పాటించాలి. బ్యాంకుల వైపు నుంచి వినియోగదార్ల డేటా బయటకు వెళ్లకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఓటీపీలు- పాస్‌వర్డ్‌లు వంటి ముఖ్యమైన సమాచారాన్ని బయటకు వెల్లడించకూడదు. అజ్ఞాత వ్యక్తులు చేసే ఫోన్‌కాల్స్‌కు స్పందించరాదు.

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటోంది

మా ఖాతాదార్లు ఎవరూ డిజిటల్‌ మోసాలకు గురికారాదనే లక్ష్యంతో 'ఎయిర్‌టెల్‌ సేఫ్‌ పే' అనే సదుపాయాన్ని ఆవిష్కరించాం. ఇదొక అదనపు భద్రతా చర్య. ఓటీపీ (మోసగాళ్లు ఓటీపీని తెలుసుకోగలిగితే..) తర్వాత ఖాతాదారుడి మొబైల్‌కు 'పేమెంట్‌ వాలిడేషన్‌ మెసేజ్‌' వెళ్తుంది. దాన్ని ఖాతాదారుడు ఆమోదిస్తేనే చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఎయిర్‌టెల్‌కు ప్రత్యేకంగా ఉన్న నెట్‌వర్క్‌ ఇంటిలిజెన్స్‌ మీద ఆధారపడి ఎయిర్‌టెల్‌ సిమ్‌తో ఓటీఏ (ఓవర్‌ ద ఎయిర్‌) టెక్నాలజీ ద్వారా తీసుకువచ్చిన సరికొత్త భద్రతా చర్య ఇది. అందువల్ల మా ఖాతాదార్లు చెల్లింపులు చేసే సమయంలో మోసాలకు గురయ్యే అవకాశం దాదాపు ఉండదు.

ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సేవలు, ఎయిర్‌టెల్‌ సేఫ్‌పే కేవలం ఎయిర్‌టెల్‌ వినియోగదార్లకేనా... లేక ఇతర టెలికామ్‌ సంస్థల వినియోగదార్లు కూడా పొందవచ్చా

ఈ సేవలు ఎయిర్‌టెల్‌ టెక్నాలజీ ఆధారంగా అందిస్తున్న సేవలు అయినందున ఇతర టెలికామ్‌ సంస్థల వినియోగదార్లకు అందించటం సాధ్యం కాదు.

ఇదీ చూడండి: ఉద్యోగుల టీకా ఖర్చు మేమే చెల్లిస్తాం: అదానీ గ్రూప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.