ETV Bharat / business

కరోనా సోకిన వారు దగ్గర ఉంటే ఇట్టే చెప్పేస్తుంది!

author img

By

Published : May 21, 2020, 1:30 PM IST

కరోనాపై పోరులో భాగంగా జట్టుకట్టిన దిగ్గజ సంస్థలు యాపిల్-గూగుల్.. కొత్త సాంకేతికతతో ముందుకొచ్చాయి. వైరస్ నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునే విధంగా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని రూపొందించాయి.

apple google corona tracing
ఆపిల్ కరోనా ట్రాకింగ్

కరోనా నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునే విధంగా స్మార్ట్​ఫోన్​ సాంకేతితకను దిగ్గజ సంస్థలు.. యాపిల్-గూగుల్ విడుదల చేశాయి. ఈ టెక్నాలజీ ఉన్న మొబైల్ యాప్​లను ఉపయోగించిన వ్యక్తుల్లో ఎవరికైనా పాజిటివ్​గా తేలితే.. వారు తిరిగిన ప్రదేశాల్లోని ఇతర యూజర్లకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశాయి.

అయితే కాంటాక్ట్ ట్రేసింగ్​ స్థానంలో ఈ సాంకేతికతను తీసుకురాలేదని యాపిల్-గూగుల్ స్పష్టం చేశాయి. 'ఆటోమెటిక్ ఎక్​స్పోజర్ నోటిఫికేషన్' వ్యవస్థ ద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ​ను మరింత మెరుగుపరిచి కొవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని వెల్లడించాయి. వినియోగదారుల సమాచారానికి పటిష్ఠమైన ఎన్​క్రిప్షన్ టెక్నాలజీ ద్వారా రక్షణ కల్పించనున్నట్లు స్పష్టం చేశాయి.

"టెక్నాలజీని వినియోగదారులు ఆమోదించేలా చేయడమే విజయానికి ముఖ్య సూత్రం. ఈ అప్లికేషన్లను ఉపయోగించేలా యూజర్లను ప్రోత్సహించడానికి పటిష్ఠమైన గోప్యత నిబంధనలు చాలా అవసరం."

-యాపిల్-గూగుల్ సంయుక్త ప్రకటన

కొన్ని దేశాల ప్రభుత్వాలు సొంతంగా మొబైల్ అప్లికేషన్లను రూపొందించినా.. వాటిలో ఎక్కువగా సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు యాపిల్-గూగుల్ తెలిపాయి. ఆ యాప్​లలో ఎక్కువ శాతం మొబైల్ జీపీఎస్​ను ఉపయోగిస్తున్నాయి. అయితే, గోప్యత నిబంధనలను పటిష్ఠం చేయడానికి జీపీఎస్​ అనుసంధానం కాకుండా యాపిల్, గూగుల్ సంస్థలు కొత్త టూల్స్​ ప్రవేశపెట్టాయి.

భిన్నాభిప్రాయాలు

జర్మనీ, అల్బేనియా వంటి దేశాలతో పాటు అమెరికాలోని దక్షిణ కరోలీనా, ఉత్తర డకోటా రాష్ట్రాల్లోని సంస్థలు యాపిల్-గూగుల్ సాంకేతికత వినియోగానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ గోప్యత ఆంక్షల వల్ల ప్రభుత్వాలకు కచ్చితమైన సమాచారం అందే అవకాశం లేదని మరికొన్ని దేశాలు చెబుతున్నాయి.

కరోనా నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునే విధంగా స్మార్ట్​ఫోన్​ సాంకేతితకను దిగ్గజ సంస్థలు.. యాపిల్-గూగుల్ విడుదల చేశాయి. ఈ టెక్నాలజీ ఉన్న మొబైల్ యాప్​లను ఉపయోగించిన వ్యక్తుల్లో ఎవరికైనా పాజిటివ్​గా తేలితే.. వారు తిరిగిన ప్రదేశాల్లోని ఇతర యూజర్లకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశాయి.

అయితే కాంటాక్ట్ ట్రేసింగ్​ స్థానంలో ఈ సాంకేతికతను తీసుకురాలేదని యాపిల్-గూగుల్ స్పష్టం చేశాయి. 'ఆటోమెటిక్ ఎక్​స్పోజర్ నోటిఫికేషన్' వ్యవస్థ ద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ​ను మరింత మెరుగుపరిచి కొవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని వెల్లడించాయి. వినియోగదారుల సమాచారానికి పటిష్ఠమైన ఎన్​క్రిప్షన్ టెక్నాలజీ ద్వారా రక్షణ కల్పించనున్నట్లు స్పష్టం చేశాయి.

"టెక్నాలజీని వినియోగదారులు ఆమోదించేలా చేయడమే విజయానికి ముఖ్య సూత్రం. ఈ అప్లికేషన్లను ఉపయోగించేలా యూజర్లను ప్రోత్సహించడానికి పటిష్ఠమైన గోప్యత నిబంధనలు చాలా అవసరం."

-యాపిల్-గూగుల్ సంయుక్త ప్రకటన

కొన్ని దేశాల ప్రభుత్వాలు సొంతంగా మొబైల్ అప్లికేషన్లను రూపొందించినా.. వాటిలో ఎక్కువగా సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు యాపిల్-గూగుల్ తెలిపాయి. ఆ యాప్​లలో ఎక్కువ శాతం మొబైల్ జీపీఎస్​ను ఉపయోగిస్తున్నాయి. అయితే, గోప్యత నిబంధనలను పటిష్ఠం చేయడానికి జీపీఎస్​ అనుసంధానం కాకుండా యాపిల్, గూగుల్ సంస్థలు కొత్త టూల్స్​ ప్రవేశపెట్టాయి.

భిన్నాభిప్రాయాలు

జర్మనీ, అల్బేనియా వంటి దేశాలతో పాటు అమెరికాలోని దక్షిణ కరోలీనా, ఉత్తర డకోటా రాష్ట్రాల్లోని సంస్థలు యాపిల్-గూగుల్ సాంకేతికత వినియోగానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ గోప్యత ఆంక్షల వల్ల ప్రభుత్వాలకు కచ్చితమైన సమాచారం అందే అవకాశం లేదని మరికొన్ని దేశాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.