ETV Bharat / business

తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కొవాగ్జిన్ టీకాలు

తెలంగాణ, తమిళనాడు సహా మొత్తం ఆరు రాష్ట్రాలకు కొవాగ్జిన్ టీకాలను సరఫరా చేసినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. అయితే ఏ రాష్ట్రానికి ఎన్ని డోసులు పంపిన విషయం ఇంకా వెల్లడించలేదు.

author img

By

Published : May 14, 2021, 12:31 PM IST

Updated : May 14, 2021, 1:07 PM IST

Covaxin dispatched Six states
కొవాగ్జిన్ టీకా రాష్ట్రాలకు సరఫరా

గుజరాత్​, అసోం, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు నేరుగా కరోనా టీకా కొవాగ్జిన్ డోసులను సరఫరా చేసినట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది. పవిత్ర రంజాన్​ మాసంలోనూ ఇందుకోసం కృషి చేసిన తమ ఉద్యోగులందరికీ ట్విట్టర్​ ద్వారా అభినందనలు తెలిపారు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, ఎండీ సుచిత్ర ఎల్లా.

దిల్లీ ప్రభుత్వంతో సరఫరా సంబంధిత సమస్యల నేపథ్యంలో కొవాగ్జిన్​ లాట్లను కేరళ, ఉత్తరాఖండ్​కు పంపినట్లు కూడా పేర్కొన్నారు సుచిత్రా ఎల్లా. అయితే ఏ రాష్ట్రానికి ఎన్ని డోసులు సరఫరా చేసిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

పుణె ప్లాంట్​లో ఆగస్టు నాటికి ఉత్పత్తి..

బయోవెట్ ప్రైవేట్​ లిమిటెడ్​కు పుణెలో ఉన్న ప్లాంట్​ను కొవాగ్జిన్ తయారీకి ఉపయోగించుకునేందుకు భారత్​ బయోటెక్​కు అప్పగించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. పుణె డివిజినల్ కమిషనర్ సురభ్ రావ్, జిల్లా కలెక్టర్​ రాజేశ్ దేశ్​ముఖ్​లు ప్లాంట్​ను సందర్శించారు. ఈ ప్లాంట్​లో ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయిలో కొవాగ్జిన్ ఉత్పత్తి జరిగేందుకు అవకాశముందని వెల్లడించారు.

ఇదీ చదవండి:కుటుంబ పత్రం..రాసి పెట్టుకున్నారా?

గుజరాత్​, అసోం, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు నేరుగా కరోనా టీకా కొవాగ్జిన్ డోసులను సరఫరా చేసినట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది. పవిత్ర రంజాన్​ మాసంలోనూ ఇందుకోసం కృషి చేసిన తమ ఉద్యోగులందరికీ ట్విట్టర్​ ద్వారా అభినందనలు తెలిపారు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, ఎండీ సుచిత్ర ఎల్లా.

దిల్లీ ప్రభుత్వంతో సరఫరా సంబంధిత సమస్యల నేపథ్యంలో కొవాగ్జిన్​ లాట్లను కేరళ, ఉత్తరాఖండ్​కు పంపినట్లు కూడా పేర్కొన్నారు సుచిత్రా ఎల్లా. అయితే ఏ రాష్ట్రానికి ఎన్ని డోసులు సరఫరా చేసిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

పుణె ప్లాంట్​లో ఆగస్టు నాటికి ఉత్పత్తి..

బయోవెట్ ప్రైవేట్​ లిమిటెడ్​కు పుణెలో ఉన్న ప్లాంట్​ను కొవాగ్జిన్ తయారీకి ఉపయోగించుకునేందుకు భారత్​ బయోటెక్​కు అప్పగించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. పుణె డివిజినల్ కమిషనర్ సురభ్ రావ్, జిల్లా కలెక్టర్​ రాజేశ్ దేశ్​ముఖ్​లు ప్లాంట్​ను సందర్శించారు. ఈ ప్లాంట్​లో ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయిలో కొవాగ్జిన్ ఉత్పత్తి జరిగేందుకు అవకాశముందని వెల్లడించారు.

ఇదీ చదవండి:కుటుంబ పత్రం..రాసి పెట్టుకున్నారా?

Last Updated : May 14, 2021, 1:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.