ETV Bharat / business

భూ నిల్వలే ఎవర్‌గ్రాండ్​ను కాపాడతాయా!

author img

By

Published : Sep 22, 2021, 7:12 AM IST

ఎవర్​గ్రాండ్​.. చైనాకు చెందిన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా (Evergrande crisis) వార్తల్లో ఉంది. ఆ సంస్థ అప్పులే (Evergrande total debt) ఇందుకు కారణం. కంపెనీ దివాలా తీయొచ్చని ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతుంటే.. కొంత మంది మాత్రం అల జరగకపోవచ్చని అంటున్నారు. ఇందుకు వారు చెబుతున్న కారణాలు ఏమిటి? సంస్థకు ఉన్న ఆస్తులు ఇందుకు తోడ్పడగలవా?

Evergrande
ఎవర్‌గ్రాండ్‌

చైనాలోని రెండో అతిపెద్ద స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్‌ కార్యాలయానికి 2 నెలలుగా వందలమంది వచ్చి వెళ్తున్నారు. 'మా డబ్బులు మాకిచ్చేయండి' అంటూ ఆ కంపెనీ బాండ్లను కొనుగోలు చేసిన మదుపర్లతో పాటు సంస్థ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న వారు కూడా వీరిలో ఉంటున్నారు. ఏడాదిలోగా ఇలాంటి చెల్లింపులు 124 బిలియన్‌ డాలర్ల మేర జరపాల్సి ఉన్నా, అందులో పదో వంతు మాత్రమే కంపెనీ వద్ద ఉంది. సరిగ్గా 13 ఏళ్ల కిందట.. సెప్టెంబరులోనే అమెరికాలోని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అయిన లేమాన్‌ బ్రదర్స్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని సునామీలా ముంచెత్తింది. ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభాన్ని దానితో పోలుస్తూ, కొందరు ఆందోళన చెందుతుంటే, కంపెనీకి భూనిల్వలున్నందున అలాంటి భయాలు అక్కర్లేదని మరికొందరు పేర్కొంటున్నారు.

నిర్మాణంలో 800 ప్రాజెక్టులు

ఎవర్‌గ్రాండ్‌ చైనా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రనే పోషిస్తోంది. ఈ కంపెనీకి 2 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరు, వీరి కుటుంబాలు కలిసి వందల కోట్ల యువాన్‌ల సొమ్ముతో కంపెనీ బాండ్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ కింద 800 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అందులో సగం నిధుల కొరతతో ఆగిపోయాయి. ఎవర్‌గ్రాండ్‌కు కావాల్సిన నిర్మాణ వస్తువులను సరఫరా చేసేందుకు, ఇతర పనుల్లో వేల కొద్దీ కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఇవన్నీ ఏటా 38 లక్షల మందికి ఉపాధి చూపుతున్నాయని అంచనా.

అప్పులతోనే అంతా..

చైనాలోని స్థిరాస్తి కంపెనీలు భారీగా అప్పులు చేయడం, భారీ టర్నోవరు పొందడం, భారీ లాభాలు ఆర్జించడం అనే మూడు సూత్రాలనే నమ్ముతాయి. 2018లో ఎవర్‌గ్రాండ్‌ సైతం 7,200 కోట్ల యువాన్‌ల రికార్డు లాభాన్ని పొందింది. అయితే సంస్థ ఏటా 10,000 కోట్ల యువాన్‌లను వడ్డీ కిందే కట్టడం గమనార్హం. లావాదేవీలు బాగా జరిగిన రోజుల్లోనూ కంపెనీ వద్ద నిర్వహణ నగదు ఉండేది కాదు. డబ్బులు అవసరమైతే బ్యాంకుల వైపు చూసేది. అవి కాదంటే.. సొంత ఉద్యోగుల నుంచే లక్ష్యాలు పెట్టి మరీ సమీకరించేంది. అందుకు ప్రతిగా ‘చౌషౌబౌ’ పేరిట క్రౌడ్‌ ఫండింగ్‌ బాండ్లను జారీ చేసేది. 25 శాతం వడ్డీ ఆశ చూపించేది. దీంతో కొంత మంది అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. అయినా కూడా నిధులు చాలకపోవడంతో ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇది కాస్తా అప్పుల కుప్పను పెంచింది. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి 2 లక్షల కోట్ల యువాన్‌ (300 బిలియన్‌ డాలర్లు)ల అప్పులు సంస్థకు ఉన్నట్లు రుణ పుస్తకం చెబుతోంది. ఈనెల 23న సంస్థ చెల్లించాల్సిన 83.5 మిలియన్‌ డాలర్ల వడ్డీ కీలకం కానుంది.

మన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గుర్తుకొస్తోంది

చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ పరిస్థితి చూస్తుంటే.. అమెరికాకు చెందిన లేమాన్‌ బ్రదర్స్‌, మన దేశంలోని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వ్యవహారాలు గుర్తుకు వస్తున్నాయని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడుతున్నారు. ‘ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వ్యవహారంలో భారత ప్రభుత్వం సరిగ్గా స్పందించింది. ఆర్థిక మార్కెట్లను శాంత పరిచింది’ అంటూ ఉదయ్‌ కోటక్‌ ట్వీట్‌ చేశారు. 2018 చివర్లో ఇబ్బందుల్లో పడ్డ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను కాపాడే నిపుణుల బృందానికి కోటక్‌ నాయకత్వం వహించింది. గ్రూప్‌ చేసిన రూ.99,000 కోట్ల రుణాల నుంచి రూ.61,000 కోట్లను రికవరీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. అందులో 71 శాతం వరకు రికవరీ చేయగలిగారు.

పరిస్థితులు చక్కబడతాయ్‌..

ఎవర్‌గ్రాండ్‌ కుప్పకూలదని, చైనా ప్రభుత్వం ఆదుకుంటుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ రంగ కంపెనీలు ఇప్పటికే ఎవర్‌గ్రాండ్‌తో షెంఝెన్‌ ప్రాజెక్టులపై చర్చిస్తున్నాయని చెబుతున్నారు. దివాలాకు వెళుతున్నట్లు వచ్చిన వార్తలను ఎవర్‌గ్రాండ్‌ కూడా కొట్టిపారేసింది. సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు, వినియోగదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు చేయాల్సిందల్లా చేస్తామని తన వెబ్‌సైట్‌లో వివరించింది. కంపెనీ నియమించిన ఆర్థిక సలహాదార్లు అన్ని పరిష్కారాలను పరిశీలిస్తున్నారు. ఈక్విటీ, ఆస్తులను విక్రయిస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. కొంత మంది పెట్టుబడిదార్లు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. చైనాలో భూములకు చాలా ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఎవర్‌గ్రాండ్‌కున్న భారీ భూ నిల్వలు, ఆ సంస్థను ఆపద నుంచి గట్టెక్కిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జూన్‌ చివరి నాటికి సంస్థ మొత్తం ఆస్తులు 2.38 లక్షల కోట్ల యువాన్‌లుండగా.. మొత్తం అప్పులు 1.97 లక్షల కోట్ల యువాన్‌లుగానే ఉన్నాయని అంటున్నారు. భారీ అప్పులున్నా గత కొన్నేళ్లుగా నిధులను కంపెనీ సమీకరించగలిగిందని, ఇపుడూ అలాగే బయటపడుతుందని ఆ దేశ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ మార్కెట్లపై ప్రభావం

సోమవారానికి భిన్నంగా మంగళవారం కొన్ని మార్కెట్లు స్పందించాయి. ఐరోపా, హాంకాంగ్‌ లాభాలు ఆర్జిస్తే, జపాన్‌ మార్కెట్లు 2% నష్టపోయాయి. భారత మార్కెట్లు కోలుకున్నాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.

ఇవీ చదవండి:

చైనాలోని రెండో అతిపెద్ద స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్‌ కార్యాలయానికి 2 నెలలుగా వందలమంది వచ్చి వెళ్తున్నారు. 'మా డబ్బులు మాకిచ్చేయండి' అంటూ ఆ కంపెనీ బాండ్లను కొనుగోలు చేసిన మదుపర్లతో పాటు సంస్థ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న వారు కూడా వీరిలో ఉంటున్నారు. ఏడాదిలోగా ఇలాంటి చెల్లింపులు 124 బిలియన్‌ డాలర్ల మేర జరపాల్సి ఉన్నా, అందులో పదో వంతు మాత్రమే కంపెనీ వద్ద ఉంది. సరిగ్గా 13 ఏళ్ల కిందట.. సెప్టెంబరులోనే అమెరికాలోని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అయిన లేమాన్‌ బ్రదర్స్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని సునామీలా ముంచెత్తింది. ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభాన్ని దానితో పోలుస్తూ, కొందరు ఆందోళన చెందుతుంటే, కంపెనీకి భూనిల్వలున్నందున అలాంటి భయాలు అక్కర్లేదని మరికొందరు పేర్కొంటున్నారు.

నిర్మాణంలో 800 ప్రాజెక్టులు

ఎవర్‌గ్రాండ్‌ చైనా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రనే పోషిస్తోంది. ఈ కంపెనీకి 2 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరు, వీరి కుటుంబాలు కలిసి వందల కోట్ల యువాన్‌ల సొమ్ముతో కంపెనీ బాండ్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ కింద 800 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అందులో సగం నిధుల కొరతతో ఆగిపోయాయి. ఎవర్‌గ్రాండ్‌కు కావాల్సిన నిర్మాణ వస్తువులను సరఫరా చేసేందుకు, ఇతర పనుల్లో వేల కొద్దీ కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఇవన్నీ ఏటా 38 లక్షల మందికి ఉపాధి చూపుతున్నాయని అంచనా.

అప్పులతోనే అంతా..

చైనాలోని స్థిరాస్తి కంపెనీలు భారీగా అప్పులు చేయడం, భారీ టర్నోవరు పొందడం, భారీ లాభాలు ఆర్జించడం అనే మూడు సూత్రాలనే నమ్ముతాయి. 2018లో ఎవర్‌గ్రాండ్‌ సైతం 7,200 కోట్ల యువాన్‌ల రికార్డు లాభాన్ని పొందింది. అయితే సంస్థ ఏటా 10,000 కోట్ల యువాన్‌లను వడ్డీ కిందే కట్టడం గమనార్హం. లావాదేవీలు బాగా జరిగిన రోజుల్లోనూ కంపెనీ వద్ద నిర్వహణ నగదు ఉండేది కాదు. డబ్బులు అవసరమైతే బ్యాంకుల వైపు చూసేది. అవి కాదంటే.. సొంత ఉద్యోగుల నుంచే లక్ష్యాలు పెట్టి మరీ సమీకరించేంది. అందుకు ప్రతిగా ‘చౌషౌబౌ’ పేరిట క్రౌడ్‌ ఫండింగ్‌ బాండ్లను జారీ చేసేది. 25 శాతం వడ్డీ ఆశ చూపించేది. దీంతో కొంత మంది అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. అయినా కూడా నిధులు చాలకపోవడంతో ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇది కాస్తా అప్పుల కుప్పను పెంచింది. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి 2 లక్షల కోట్ల యువాన్‌ (300 బిలియన్‌ డాలర్లు)ల అప్పులు సంస్థకు ఉన్నట్లు రుణ పుస్తకం చెబుతోంది. ఈనెల 23న సంస్థ చెల్లించాల్సిన 83.5 మిలియన్‌ డాలర్ల వడ్డీ కీలకం కానుంది.

మన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గుర్తుకొస్తోంది

చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ పరిస్థితి చూస్తుంటే.. అమెరికాకు చెందిన లేమాన్‌ బ్రదర్స్‌, మన దేశంలోని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వ్యవహారాలు గుర్తుకు వస్తున్నాయని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడుతున్నారు. ‘ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వ్యవహారంలో భారత ప్రభుత్వం సరిగ్గా స్పందించింది. ఆర్థిక మార్కెట్లను శాంత పరిచింది’ అంటూ ఉదయ్‌ కోటక్‌ ట్వీట్‌ చేశారు. 2018 చివర్లో ఇబ్బందుల్లో పడ్డ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను కాపాడే నిపుణుల బృందానికి కోటక్‌ నాయకత్వం వహించింది. గ్రూప్‌ చేసిన రూ.99,000 కోట్ల రుణాల నుంచి రూ.61,000 కోట్లను రికవరీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. అందులో 71 శాతం వరకు రికవరీ చేయగలిగారు.

పరిస్థితులు చక్కబడతాయ్‌..

ఎవర్‌గ్రాండ్‌ కుప్పకూలదని, చైనా ప్రభుత్వం ఆదుకుంటుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ రంగ కంపెనీలు ఇప్పటికే ఎవర్‌గ్రాండ్‌తో షెంఝెన్‌ ప్రాజెక్టులపై చర్చిస్తున్నాయని చెబుతున్నారు. దివాలాకు వెళుతున్నట్లు వచ్చిన వార్తలను ఎవర్‌గ్రాండ్‌ కూడా కొట్టిపారేసింది. సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు, వినియోగదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు చేయాల్సిందల్లా చేస్తామని తన వెబ్‌సైట్‌లో వివరించింది. కంపెనీ నియమించిన ఆర్థిక సలహాదార్లు అన్ని పరిష్కారాలను పరిశీలిస్తున్నారు. ఈక్విటీ, ఆస్తులను విక్రయిస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. కొంత మంది పెట్టుబడిదార్లు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. చైనాలో భూములకు చాలా ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఎవర్‌గ్రాండ్‌కున్న భారీ భూ నిల్వలు, ఆ సంస్థను ఆపద నుంచి గట్టెక్కిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జూన్‌ చివరి నాటికి సంస్థ మొత్తం ఆస్తులు 2.38 లక్షల కోట్ల యువాన్‌లుండగా.. మొత్తం అప్పులు 1.97 లక్షల కోట్ల యువాన్‌లుగానే ఉన్నాయని అంటున్నారు. భారీ అప్పులున్నా గత కొన్నేళ్లుగా నిధులను కంపెనీ సమీకరించగలిగిందని, ఇపుడూ అలాగే బయటపడుతుందని ఆ దేశ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ మార్కెట్లపై ప్రభావం

సోమవారానికి భిన్నంగా మంగళవారం కొన్ని మార్కెట్లు స్పందించాయి. ఐరోపా, హాంకాంగ్‌ లాభాలు ఆర్జిస్తే, జపాన్‌ మార్కెట్లు 2% నష్టపోయాయి. భారత మార్కెట్లు కోలుకున్నాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.