ETV Bharat / business

చైనా వస్తువుల బ్యాన్​ కోసం ప్రచారం షురూ - Chinese goods boycott

చైనా వస్తువుల వినియోగాన్ని బహిష్కరించాలని పిలుపునిస్తూ అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. 2021 డిసెంబరు నాటికి 13 బిలియన్​ డాలర్లు విలువ చేసే చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం తగ్గించాలని పిలుపునిచ్చింది.

CAIT launches campaign to boycott Chinese goods
చైనా వస్తువులు భహిష్కరించాలని ప్రచారం ప్రారంభం
author img

By

Published : Jun 10, 2020, 4:56 PM IST

చైనా వస్తువుల వినియోగాన్ని బహిష్కరించాలని 'ఇండియన్ గూడ్స్-అవర్ ప్రైడ్​' పేరిట ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టింది అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ). చైనా నుంచి దిగుమతి చేసుకునే 13 బిలియన్​ డాలర్లు విలువ చేసే వస్తువులను 2021 డిసెంబరు నాటికి మొత్తం తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ ఉత్పత్తులకు బదులుగా భారత్​లోనే తయారయ్యే 3,000 వస్తువులను వినియోగించవచ్చని జాబితా తయారు చేసింది.

సీఏఐటీలో 7 కోట్ల మంది వ్యాపారులున్నారు. 40 వేల వాణిజ్య సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రచారం నిర్వహిస్తోంది సీఏఐటీ.

చైనా నుంచి ప్రస్తుతం వస్తువులు, ముడి పదార్థాలు, విడి భాగాలు, సాంకేతిక ఉత్పత్తులు వంటి నాలుగు రకాల దిగుమతులు చేసుకుంటున్నామని వీడియో కాన్ఫరెన్స్​ సమావేశంలో తెలిపారు సీఏఐటీ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖందేల్వాల్​. ప్రచారంలో భాగంగా మొదటి విడతలో చైనా వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

చైనా నుంచి భారత్​ దిగుమతుల విలువ ప్రస్తుతం 70 బిలియన్​ డాలర్లుగా ఉంది.

చైనా వస్తువుల వినియోగాన్ని బహిష్కరించాలని 'ఇండియన్ గూడ్స్-అవర్ ప్రైడ్​' పేరిట ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టింది అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ). చైనా నుంచి దిగుమతి చేసుకునే 13 బిలియన్​ డాలర్లు విలువ చేసే వస్తువులను 2021 డిసెంబరు నాటికి మొత్తం తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ ఉత్పత్తులకు బదులుగా భారత్​లోనే తయారయ్యే 3,000 వస్తువులను వినియోగించవచ్చని జాబితా తయారు చేసింది.

సీఏఐటీలో 7 కోట్ల మంది వ్యాపారులున్నారు. 40 వేల వాణిజ్య సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రచారం నిర్వహిస్తోంది సీఏఐటీ.

చైనా నుంచి ప్రస్తుతం వస్తువులు, ముడి పదార్థాలు, విడి భాగాలు, సాంకేతిక ఉత్పత్తులు వంటి నాలుగు రకాల దిగుమతులు చేసుకుంటున్నామని వీడియో కాన్ఫరెన్స్​ సమావేశంలో తెలిపారు సీఏఐటీ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖందేల్వాల్​. ప్రచారంలో భాగంగా మొదటి విడతలో చైనా వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

చైనా నుంచి భారత్​ దిగుమతుల విలువ ప్రస్తుతం 70 బిలియన్​ డాలర్లుగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.