స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ సోమవారం రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. బడ్జెట్ అందించిన ఉత్సాహంతో బీఎస్ఈ-సెన్సెక్స్ 2,315 పాయింట్లు పెరిగి.. 48,600 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 647 పాయింట్ల లాభంతో తిరిగి 14,281 వద్ద స్థిరపడింది.
బ్యాంకింగ్ షేర్లు అత్యధికంగా లాభాలను గడించాయి.
- ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, ఎల్&టీ, హెచ్డీఎఫ్బీ
- డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్లో నష్టాలతో ముగిశాయి.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన.. షాంఘై, నిక్కీ, కోస్పీ, హాంగ్సెంగ్ సూచీలు భారీగా లాభాలను గడించాయి.
మదుపరుల సంపద భారీ వృద్ధి..
స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన నేపథ్యంలో.. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మదుపరుల సంపద రూ.6.34 లక్షల కోట్లు పెరిగింది.