ETV Bharat / business

మహీంద్రా విద్యుత్ వాహనాలతో అమెజాన్​ డెలివరీ - అమెజాన్​ డెలివరీ నెట్​వర్క్​ కోసం మహీంద్రాతో ఒప్పందం

డెలివరీ నెట్​వర్క్​లో విద్యుత్ వాహనాల వినియోగ లక్ష్యంలో భాగంగా అమెజాన్​ ఇండియా.. మహీంద్రా ఎలక్ట్రిక్​తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో దాదాపు 100 విద్యుత్​ ( త్రిచక్ర) వాహనాలను డెలివరీ కోసం వినియోగించనుంది.

Mahindra E vehicle to Amazon delivery
అమెజాన్​ డెలివరీకి మహీంద్రా వాహనాలు
author img

By

Published : Feb 23, 2021, 12:44 PM IST

ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్..​ డెలివరీ నెట్​వర్క్​లో మహీంద్రా విద్యుత్​ వాహనాలను వినియోగించేందుకు ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీనితో అమెజాన్ ఇండియా దాదాపు వంద మహీంద్రా ట్రియో జోర్​ (త్రిచక్ర వాహనం) విద్యుత్ వాహనాలను తమ డెలివరీ నెట్​వర్క్​లో వినియోగించనుంది. హైదరాబాద్​, దిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్​, భోపాల్​, ఇండోర్, లఖ్​నవూ నగరాల్లో వీటిని నడపనుంది.

2025 నాటికి దేశవ్యాప్తంగా తమ డెలివరీ నెట్​వర్క్​లో విద్యుత్ వాహనాల సామర్థ్యాన్ని 10 వేలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెజాన్ గత ఏడాది ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ లక్ష్యం లక్ష వాహనాలుగా పేర్కొంది. ఈ లక్ష్యంలో భాగంగానే మహీంద్రాతో ఒప్పదం చేసుకున్నట్లు తెలిపింది.

ఈ-మొబిలిటీ, పర్యావరణ సంరక్షణ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ ఒప్పందం కీలక అడుగని అమెజాన్ ఇండియా పేర్కొంది.

అమెజాన్​ ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్​కార్ట్ కూడా 2030 నాటికి తమ డెలివరీ నెట్​వర్క్​లో పూర్తిగా విద్యుత్ వాహనాలను వినియోగించాలని భావిస్తున్నట్లు గతంలో తెలిపింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్​, దిల్లీ, జైపుర్​, భువనేశ్వర్​, పుణె, ముంబయి, బెంగళూరు, కోల్​కతా, లఖ్​నవూలో విద్యుత్ వాహనాలను వినియోగిస్తోంది.

ఇదీ చదవండి:2020లో 12.5% తగ్గిన స్మార్ట్​ఫోన్ల విక్రయాలు

ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్..​ డెలివరీ నెట్​వర్క్​లో మహీంద్రా విద్యుత్​ వాహనాలను వినియోగించేందుకు ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీనితో అమెజాన్ ఇండియా దాదాపు వంద మహీంద్రా ట్రియో జోర్​ (త్రిచక్ర వాహనం) విద్యుత్ వాహనాలను తమ డెలివరీ నెట్​వర్క్​లో వినియోగించనుంది. హైదరాబాద్​, దిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్​, భోపాల్​, ఇండోర్, లఖ్​నవూ నగరాల్లో వీటిని నడపనుంది.

2025 నాటికి దేశవ్యాప్తంగా తమ డెలివరీ నెట్​వర్క్​లో విద్యుత్ వాహనాల సామర్థ్యాన్ని 10 వేలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెజాన్ గత ఏడాది ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ లక్ష్యం లక్ష వాహనాలుగా పేర్కొంది. ఈ లక్ష్యంలో భాగంగానే మహీంద్రాతో ఒప్పదం చేసుకున్నట్లు తెలిపింది.

ఈ-మొబిలిటీ, పర్యావరణ సంరక్షణ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ ఒప్పందం కీలక అడుగని అమెజాన్ ఇండియా పేర్కొంది.

అమెజాన్​ ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్​కార్ట్ కూడా 2030 నాటికి తమ డెలివరీ నెట్​వర్క్​లో పూర్తిగా విద్యుత్ వాహనాలను వినియోగించాలని భావిస్తున్నట్లు గతంలో తెలిపింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్​, దిల్లీ, జైపుర్​, భువనేశ్వర్​, పుణె, ముంబయి, బెంగళూరు, కోల్​కతా, లఖ్​నవూలో విద్యుత్ వాహనాలను వినియోగిస్తోంది.

ఇదీ చదవండి:2020లో 12.5% తగ్గిన స్మార్ట్​ఫోన్ల విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.