ETV Bharat / business

ఆశలు, అనుమానాలు... ఫ్లాట్​గా ముగిసిన ​మార్కెట్లు

రెండు వరుస సెషన్ల లాభాలకు తెరపడింది. స్వల్ప నష్టాలతో సెషన్​ను ముగించాయి స్టాక్​ సూచీలు. సెన్సెక్స్​, నిఫ్టీలు 6 పాయింట్ల నష్టంతో ఫ్లాట్​గా ముగిశాయి. ఆటోమొబైల్స్​ రంగం మినహా... ఐటీ, లోహ, విద్యుత్తు రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.

author img

By

Published : Jun 27, 2019, 4:07 PM IST

Updated : Jun 27, 2019, 4:28 PM IST

ఆశలు, అనుమానాలు... ఫ్లాట్​గా ముసిగిన స్టాక్​మార్కెట్లు

జూన్​ డెరివేటివ్​లకు నేడు గడువు తీరనున్న నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. స్వల్ప నష్టాలతో ట్రేడింగ్​ను ముగించాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్​ 6 పాయింట్లు కోల్పోయింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ కూడా 6 పాయింట్లు క్షీణించింది.

ఇంట్రాడే సాగిందిలా...

సెన్సెక్స్​ నేటి ట్రేడింగ్​ను 39 వేల 633 వద్ద ప్రారంభించింది. ఒక దశలో 39 వేల 817 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ​.. ఒడుదొడుకులకు లోనై 300 పాయింట్ల మేర కోల్పోయింది. సెషన్​ చివరకు 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 39 వేల 586 వద్ద ట్రేడింగ్​ను ముగించింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించింది. 11 వేల 850 మార్కు దిగువకు చేరింది. చివరకు 11 వేల 842 వద్ద స్థిరపడింది.

ఆటోమొబైల్స్​ రంగానికి కొనుగోళ్ల ఊతం లభించగా.. ఐటీ, లోహ, విద్యుత్తు రంగాల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి.

టాటామోటార్స్​కు 3 శాతం లాభాలు..

ఎం అండ్​ ఎం, టాటా మోటార్స్​, ఇండియా బుల్స్​ హౌసింగ్​, ఐచర్​ మోటార్స్​, ఓఎన్​జీసీ, భారతీ ఇన్​ఫ్రా టెల్​ అత్యధిక లాభాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్​ 3 శాతం లాభం పొందింది.

టెక్​ మహీంద్రా, అదానీ పోర్ట్స్​, హెచ్​సీఎల్​ టెక్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, యూపీఎల్​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

జూన్​ డెరివేటివ్​లకు నేడు గడువు తీరనున్న నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. స్వల్ప నష్టాలతో ట్రేడింగ్​ను ముగించాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్​ 6 పాయింట్లు కోల్పోయింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ కూడా 6 పాయింట్లు క్షీణించింది.

ఇంట్రాడే సాగిందిలా...

సెన్సెక్స్​ నేటి ట్రేడింగ్​ను 39 వేల 633 వద్ద ప్రారంభించింది. ఒక దశలో 39 వేల 817 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ​.. ఒడుదొడుకులకు లోనై 300 పాయింట్ల మేర కోల్పోయింది. సెషన్​ చివరకు 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 39 వేల 586 వద్ద ట్రేడింగ్​ను ముగించింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించింది. 11 వేల 850 మార్కు దిగువకు చేరింది. చివరకు 11 వేల 842 వద్ద స్థిరపడింది.

ఆటోమొబైల్స్​ రంగానికి కొనుగోళ్ల ఊతం లభించగా.. ఐటీ, లోహ, విద్యుత్తు రంగాల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి.

టాటామోటార్స్​కు 3 శాతం లాభాలు..

ఎం అండ్​ ఎం, టాటా మోటార్స్​, ఇండియా బుల్స్​ హౌసింగ్​, ఐచర్​ మోటార్స్​, ఓఎన్​జీసీ, భారతీ ఇన్​ఫ్రా టెల్​ అత్యధిక లాభాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్​ 3 శాతం లాభం పొందింది.

టెక్​ మహీంద్రా, అదానీ పోర్ట్స్​, హెచ్​సీఎల్​ టెక్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, యూపీఎల్​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

MOFA Briefing
Spokesperson: Geng Shuang
Date: 27 June 2019
Duration: 04:47
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 27, 2019, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.