కరోనా మహమ్మారిపై పోరులో భారత్కు అండగా నిలిచింది ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ). వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి 1.5 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు తెలిపింది.
మహమ్మారిపై పోరాడటానికి 26 దేశాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఏడీబీ గతేడాది ఏప్రిల్లో 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు 26 దేశాలకు వివిధ రూపాల్లో 16.1 బిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగానే భారత్కు ఈ ఏడాది చివరి నాటికి.. కేటాయించిన మొత్తంను అందిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఇదీ చూడండి: సభ్య దేశాలకు ఏడీబీ మరింత సాయం