ETV Bharat / business

భారత్​కు ఏడీబీ 220 కోట్ల​ డాలర్ల సాయం

కరోనాపై యుద్ధంలో భాగంగా భారత్​కు 2.2 బిలియన్​ డాలర్ల ప్యాకేజీతో మద్దతునివ్వడానికి ఏషియన్​ డెవలప్​మెంట్​ బ్యాంకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు బ్యాంకు అధ్యక్షుడు మసట్సుగు హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించారు.

author img

By

Published : Apr 10, 2020, 11:16 AM IST

adb-assures-usd-2-dot-2-bn-support-package-to-india-for-covid-19-response
భారత్​కు ఏడీబీ 2.2 బిలియన్​ డాలర్ల సహాయం

ప్రాణాంతక కరోనా వైరస్​పై పోరులో భారత్​కు ఏషియన్​ డెవలప్​మెంట్​ బ్యాంకు(ఏడీబీ) అండగా నిలిచింది. 2.2 బిలియన్​ డాలర్ల(సుమారు రూ.16,500కోట్లు) ప్యాకేజీతో మద్దతిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు బ్యాంకు అధ్యక్షుడు మసట్సుగు అసకావ హామీ ఇచ్చారు.

వైరస్​పై యుద్ధంలో భారత్​ చేపడుతున్న చర్యలను మసట్సుగు ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన.. ఆర్థిక ప్యాకేజీ, వ్యాపారాలకు ఉపశమనం, జాతీయ ఆరోగ్య అత్యవసర కార్యక్రమం వంటి చర్యలను కొనియాడారు.

"అత్యవసర పరిస్థితుల్లో భారత్​కు ఏడీబీ అండగా ఉంటుంది. దేశంలోని ఆరోగ్య విభాగం, పేదలు, కార్మికులపై మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే 2.2 బిలియన్​ డాలర్ల సహాయం అందించడానికి ఏడీబీ సిద్ధమవుతోంది."

--- మసట్సుగు అసకావ, ఏడీబీ అధ్యక్షుడు.

పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. భారత్​కు మరింత సహాయాన్ని అందించేందుకూ సిద్ధమేనని మసట్సుగు పేర్కొన్నారు.

విపత్తు పరిస్థితుల్లో ప్రైవేటు రంగాలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునే విధంగా సహాయపడటానికి కూడా ఏడీబీ ప్రణాళికలు రచిస్తోంది.

ఇదీ చూడండి:- కరోనాతో పేదరికంలోకి 50 కోట్ల మంది ప్రజలు!

ప్రాణాంతక కరోనా వైరస్​పై పోరులో భారత్​కు ఏషియన్​ డెవలప్​మెంట్​ బ్యాంకు(ఏడీబీ) అండగా నిలిచింది. 2.2 బిలియన్​ డాలర్ల(సుమారు రూ.16,500కోట్లు) ప్యాకేజీతో మద్దతిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు బ్యాంకు అధ్యక్షుడు మసట్సుగు అసకావ హామీ ఇచ్చారు.

వైరస్​పై యుద్ధంలో భారత్​ చేపడుతున్న చర్యలను మసట్సుగు ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన.. ఆర్థిక ప్యాకేజీ, వ్యాపారాలకు ఉపశమనం, జాతీయ ఆరోగ్య అత్యవసర కార్యక్రమం వంటి చర్యలను కొనియాడారు.

"అత్యవసర పరిస్థితుల్లో భారత్​కు ఏడీబీ అండగా ఉంటుంది. దేశంలోని ఆరోగ్య విభాగం, పేదలు, కార్మికులపై మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే 2.2 బిలియన్​ డాలర్ల సహాయం అందించడానికి ఏడీబీ సిద్ధమవుతోంది."

--- మసట్సుగు అసకావ, ఏడీబీ అధ్యక్షుడు.

పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. భారత్​కు మరింత సహాయాన్ని అందించేందుకూ సిద్ధమేనని మసట్సుగు పేర్కొన్నారు.

విపత్తు పరిస్థితుల్లో ప్రైవేటు రంగాలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునే విధంగా సహాయపడటానికి కూడా ఏడీబీ ప్రణాళికలు రచిస్తోంది.

ఇదీ చూడండి:- కరోనాతో పేదరికంలోకి 50 కోట్ల మంది ప్రజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.