ETV Bharat / business

జీడీపీ పతనంపై మాజీ ప్రధాని తీవ్ర ఆందోళన

దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) క్రమంగా పడిపోతోంది. తాజాగా జులై-సెప్టెంబర్​ త్రైమాసికానికి 4.5 శాతంతో జీడీపీ ఆరేళ్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో.. వృద్ధి రేటు క్షీణతపై కాంగ్రెస్​ ఆందోళన వ్యక్తం చేసింది. జీడీపీ పడిపోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​.

author img

By

Published : Nov 30, 2019, 5:09 AM IST

Updated : Nov 30, 2019, 7:57 AM IST

4-dot-5-per-cent-gdp-growth-rate-unacceptable-worrisome-manmohan-singh
జీడీపీ పతనంపై మాజీ ప్రధాని తీవ్ర ఆందోళన
జీడీపీ పతనంపై మాజీ ప్రధాని తీవ్ర ఆందోళన

భారత వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో... ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​లు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ.

భారత మాజీ ప్రధానమంత్రి... డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ వృద్ధి రేటు క్షీణతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు స్థూల జాతీయోత్పత్తి అంశంపై మాట్లాడిన మన్మోహన్‌.. మరోసారి క్యూ2 జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంపై స్పందించారు.

సమాజానికి ఎంతో నష్టం...

వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉందన్నారు. వృద్ధి రేటు తగ్గుదల కేవలం ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి ఎంతో నష్టం చేకూరుస్తుందని తెలిపారు.

''అధికారికంగా గణాంకాల ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ 4.5 శాతం నమోదైంది. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదు. దేశంలో 8 నుంచి 9 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సిఉండగా.. 4.5 శాతానికి పడిపోవడం విచారించదగ్గ అంశం. మొదటి త్రైమాసికంలో నమోదైన 5 శాతం కంటే ఈ సారి ఇంకా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.''

- మన్మోహన్​ సింగ్​, భారత మాజీ ప్రధాని, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి

ఆర్థిక విధానాల మార్పు సానుకూల ఫలితాల్ని ఇవ్వలేదన్నారు మన్మోహన్​ సింగ్​. ఈ సందర్భంగా.. కేంద్రానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలన్నా, ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలగాలన్నా 8 శాతం వృద్ధి రేటు నమోదవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

ప్రస్తుత సమాజ స్థితి ఎలా ఉంటుందో ఆర్థిక వ్యవస్థ చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు నమ్మకం, విశ్వాసం పూర్తిగా నశిస్తోందని ఆయన విమర్శించారు.

ఇదీ చూడండి:

మరోమారు తగ్గిన జీడీపీ.. 2019-20 క్యూ2లో 4.5 శాతమే

జీడీపీ పతనంపై మాజీ ప్రధాని తీవ్ర ఆందోళన

భారత వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో... ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​లు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ.

భారత మాజీ ప్రధానమంత్రి... డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ వృద్ధి రేటు క్షీణతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు స్థూల జాతీయోత్పత్తి అంశంపై మాట్లాడిన మన్మోహన్‌.. మరోసారి క్యూ2 జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంపై స్పందించారు.

సమాజానికి ఎంతో నష్టం...

వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉందన్నారు. వృద్ధి రేటు తగ్గుదల కేవలం ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి ఎంతో నష్టం చేకూరుస్తుందని తెలిపారు.

''అధికారికంగా గణాంకాల ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ 4.5 శాతం నమోదైంది. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదు. దేశంలో 8 నుంచి 9 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సిఉండగా.. 4.5 శాతానికి పడిపోవడం విచారించదగ్గ అంశం. మొదటి త్రైమాసికంలో నమోదైన 5 శాతం కంటే ఈ సారి ఇంకా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.''

- మన్మోహన్​ సింగ్​, భారత మాజీ ప్రధాని, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి

ఆర్థిక విధానాల మార్పు సానుకూల ఫలితాల్ని ఇవ్వలేదన్నారు మన్మోహన్​ సింగ్​. ఈ సందర్భంగా.. కేంద్రానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలన్నా, ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలగాలన్నా 8 శాతం వృద్ధి రేటు నమోదవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

ప్రస్తుత సమాజ స్థితి ఎలా ఉంటుందో ఆర్థిక వ్యవస్థ చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు నమ్మకం, విశ్వాసం పూర్తిగా నశిస్తోందని ఆయన విమర్శించారు.

ఇదీ చూడండి:

మరోమారు తగ్గిన జీడీపీ.. 2019-20 క్యూ2లో 4.5 శాతమే

AP Video Delivery Log - 2000 GMT News
Friday, 29 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1955: Belgium Christmas Market AP Clients Only 4242434
Christmas market opens on Brussels' Grand Place
AP-APTN-1939: Mexico Free Climber Died 2 AP Clients Only 4242433
Mexico rescuers prepare to retrieve climber's body
AP-APTN-1920: US TX Plant Explosion Presser Must credit KTRK; No access Houston; No use by US broadcast networks; No re-sale, re-use or archive 4242432
Evacuation order lifted near Texas plant fire
AP-APTN-1913: France Amazon Protest Must credit Attac France 4242431
Activists protest outside Amazon's Paris HQ
AP-APTN-1857: UK London Bridge Police Must credit Michael Gawda 4242429
Police respond to incident on London Bridge
AP-APTN-1852: UK London Bridge Suspect Must credit content creator 4242425
Moment London suspect is tackled caught on camera
AP-APTN-1848: Spain Migrants AP Clients Only 4242428
Spanish police discover migrants hidden in car
AP-APTN-1829: UK London Bridge Mayor 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4242421
London mayor Khan on London Bridge attack
AP-APTN-1824: UK London Evacuation Scenes No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4242426
Police evacuate, comfort Londoners amid incident
AP-APTN-1811: UK London Bridge PM AP Clients Only 4242424
UK PM: We'll 'hunt down' anyone linked to attack
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 30, 2019, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.