ETV Bharat / business

రాష్ట్రాలకు లక్ష కోట్ల సాయం- వడ్డీ లేని రుణం!

author img

By

Published : Feb 1, 2022, 1:12 PM IST

Updated : Feb 1, 2022, 2:20 PM IST

2022-23 Budget: 2022-23 బడ్జెట్​లో రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఈ ప్రత్యేక నిధి ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తామని తెలిపారు.

Budget
బడ్జెట్

2022-23 Budget: 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్లను సాయంగా కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 50 ఏళ్ల వ్యవధితో ఇచ్చే ఈ వడ్డీ రహిత రుణాలు.. రాష్ట్రాల సాధారణ రుణాలకు అదనం. పీఎం గతి శక్తి, రాష్ట్రాల ఇతర మూలధన పెట్టుబడుల కింద ఈ నిధులను కేటాయిస్తారు. అయితే.. 2022-23లో రాష్ట్రాలకు ద్రవ్యలోటు పరిమితుల్లో ఊరటనిచ్చింది కేంద్రం. జీఎస్‌డీపీలో 4 శాతం వరకు ద్రవ్యలోటుకు అనుమతినిచ్చింది. కానీ ఈ మొత్తంలో 0.5 శాతం విద్యుత్ రంగ సంస్కరణలకు కేటాయించాలని స్పష్టం చేసింది.

రాష్ట్రాలకు సాయంగా కేటాయించిన నిధులను గ్రామ్​ సడక్​ యోజన, డిజిటల్ పేమెంట్స్, ఓఎఫ్​సీ నెట్​వర్క్​లను పూర్తి చేయడం సహా ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ, రవాణా, టౌన్​ ప్లానింగ్ స్కీంలకు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

బడ్జెట్‌ స్వరూపం

  • 2022-23 మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు.
  • 2022-23 మూలధన వ్యయం అంచనా రూ.10.68 లక్షల కోట్లు. ఇది జీడీపీలో 4.1 శాతం.
  • 2022-23 బడ్జెట్‌లో ద్రవ్య లోటు అంచనా 6.4 శాతం; 2021-22 ద్రవ్యలోటు 6.9.
  • 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యం.
  • 2022-23 ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు.
  • జీఎస్‌డీపీలో రాష్ట్రాలకు 4 శాతం వరకు ద్రవ్యలోటుకు అనుమతి.
  • 'రాష్ట్రాల మూలధన పెట్టుబడులు' పథకానికి బడ్జెట్ అంచనాల్లో రూ. 10,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్లకు పెంపు.
  • 2021-22 బడ్జెట్​లో మూలధన వ్యయం 34.83లక్షల కోట్లుగా అంచనా వేస్తే.. దానిని రూ.37.70లక్షల కోట్లకు సవరించారు.

ఇదీ చదవండి: 'ఇక దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్!​'

2022-23 Budget: 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్లను సాయంగా కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 50 ఏళ్ల వ్యవధితో ఇచ్చే ఈ వడ్డీ రహిత రుణాలు.. రాష్ట్రాల సాధారణ రుణాలకు అదనం. పీఎం గతి శక్తి, రాష్ట్రాల ఇతర మూలధన పెట్టుబడుల కింద ఈ నిధులను కేటాయిస్తారు. అయితే.. 2022-23లో రాష్ట్రాలకు ద్రవ్యలోటు పరిమితుల్లో ఊరటనిచ్చింది కేంద్రం. జీఎస్‌డీపీలో 4 శాతం వరకు ద్రవ్యలోటుకు అనుమతినిచ్చింది. కానీ ఈ మొత్తంలో 0.5 శాతం విద్యుత్ రంగ సంస్కరణలకు కేటాయించాలని స్పష్టం చేసింది.

రాష్ట్రాలకు సాయంగా కేటాయించిన నిధులను గ్రామ్​ సడక్​ యోజన, డిజిటల్ పేమెంట్స్, ఓఎఫ్​సీ నెట్​వర్క్​లను పూర్తి చేయడం సహా ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ, రవాణా, టౌన్​ ప్లానింగ్ స్కీంలకు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

బడ్జెట్‌ స్వరూపం

  • 2022-23 మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు.
  • 2022-23 మూలధన వ్యయం అంచనా రూ.10.68 లక్షల కోట్లు. ఇది జీడీపీలో 4.1 శాతం.
  • 2022-23 బడ్జెట్‌లో ద్రవ్య లోటు అంచనా 6.4 శాతం; 2021-22 ద్రవ్యలోటు 6.9.
  • 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యం.
  • 2022-23 ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు.
  • జీఎస్‌డీపీలో రాష్ట్రాలకు 4 శాతం వరకు ద్రవ్యలోటుకు అనుమతి.
  • 'రాష్ట్రాల మూలధన పెట్టుబడులు' పథకానికి బడ్జెట్ అంచనాల్లో రూ. 10,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్లకు పెంపు.
  • 2021-22 బడ్జెట్​లో మూలధన వ్యయం 34.83లక్షల కోట్లుగా అంచనా వేస్తే.. దానిని రూ.37.70లక్షల కోట్లకు సవరించారు.

ఇదీ చదవండి: 'ఇక దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్!​'

Last Updated : Feb 1, 2022, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.