ETV Bharat / briefs

రైతులకు పెట్టుబడి సాయం ఏటా రూ.12,500

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను ఆ పార్టీ అధినేత జగన్​మోహన్ రెడ్డి విడుదల చేశారు. అధికారంలోకి వస్తే కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

author img

By

Published : Apr 6, 2019, 3:10 PM IST

Updated : Apr 6, 2019, 4:27 PM IST

jagan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయంలో... పార్టీ అధినేత జగన్​మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని జగన్ అన్నారు. అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక రూపొందించామనీ.. అధికారంలోకి వస్తే కచ్చితంగా హామీలన్నింటినీ అమలు చేస్తామనీ తెలిపారు. ఈ ప్రణాళిక గెలుపు కోసం కాదనీ.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలన్నదే తన ధ్యేయమనీ స్పష్టం చేశారు. ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీలకు ఉంటుందనీ... అవి అమలుచేయకపోతే ప్రజలు నిలదీసే పరిస్థితి రావాలన్నారు.

రైతులపై వరాల జల్లు

పాదయాత్రలో ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచామనీ... నవరత్నాల్లో రైతులకు చెప్పిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. ఏటా రూ. 12,500 చొప్పున రైతులకు ఇస్తామని చెప్పారు జగన్. అన్నదాతలు చెల్లించాల్సిన పంట బీమా ప్రీమియం తామే చెల్లిస్తామన్నారు. ఉచితంగా బోర్లు... 3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని తెలిపారు.

ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం

ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులను చేర్చి... వార్షికాదాయం 5లక్షల రూపాయలలోపు ఉన్న వారందరికీ అమలు చేస్తామన్నారు. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తామన్న వైకాపా అధినేత... వాటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని వివరించారు. ప్రత్యేకహోదా సాధించేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న 2లక్షల 30వేల ఉద్యోగాలను భర్తిచేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతామన్నారు.

మేనిఫెస్టో విడుదల చేసిన జగన్

ఇదీ చూడండి: ఓటుపై సందేహముందా? అయితే ఓ ఫోన్ కొట్టూ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయంలో... పార్టీ అధినేత జగన్​మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని జగన్ అన్నారు. అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక రూపొందించామనీ.. అధికారంలోకి వస్తే కచ్చితంగా హామీలన్నింటినీ అమలు చేస్తామనీ తెలిపారు. ఈ ప్రణాళిక గెలుపు కోసం కాదనీ.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలన్నదే తన ధ్యేయమనీ స్పష్టం చేశారు. ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీలకు ఉంటుందనీ... అవి అమలుచేయకపోతే ప్రజలు నిలదీసే పరిస్థితి రావాలన్నారు.

రైతులపై వరాల జల్లు

పాదయాత్రలో ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచామనీ... నవరత్నాల్లో రైతులకు చెప్పిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. ఏటా రూ. 12,500 చొప్పున రైతులకు ఇస్తామని చెప్పారు జగన్. అన్నదాతలు చెల్లించాల్సిన పంట బీమా ప్రీమియం తామే చెల్లిస్తామన్నారు. ఉచితంగా బోర్లు... 3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని తెలిపారు.

ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం

ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులను చేర్చి... వార్షికాదాయం 5లక్షల రూపాయలలోపు ఉన్న వారందరికీ అమలు చేస్తామన్నారు. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తామన్న వైకాపా అధినేత... వాటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని వివరించారు. ప్రత్యేకహోదా సాధించేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న 2లక్షల 30వేల ఉద్యోగాలను భర్తిచేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతామన్నారు.

మేనిఫెస్టో విడుదల చేసిన జగన్

ఇదీ చూడండి: ఓటుపై సందేహముందా? అయితే ఓ ఫోన్ కొట్టూ...

Intro:Ap_vsp_46_06_Andra_padya_kavita_sadssu_ugadi_vedukalu_ab_c4
విశాఖ జిల్లా అనకాపల్లి లో ఆంధ్ర పద్య కవితా సదస్సు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి సూర్యోదయ సమయంలో వికారి నామ సంవత్సరానికి వేద పండితులు కవులు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు
తెలుగు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న సభ్యులు ఉగాది వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా వికారి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కవులు కవితలు చదివి వినిపించారు సూర్యోదయ సమయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా చేసింది
ఈ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన సాంప్రదాయ వస్త్రధారణ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు


Body:ఉగాది వేడుకల్లో భాగంగా కవులను సత్కరించారు. ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు


Conclusion:డాక్టర్ వెంకటేశ్వరరావు ఆంధ్ర పద్య కవితా సదస్సు అధ్యక్షులు
Last Updated : Apr 6, 2019, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.