ETV Bharat / briefs

తప్పుడు వార్తలకు 'టిప్​లైన్'​తో కళ్లెం!

సార్వత్రిక ఎన్నికల వేళ తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు వాట్సాప్​ చర్యలు చేపట్టింది. సమాచారం నిజమైందా కాదా అని వినియోగదారులు తెలుసుకునేందుకు 'చెక్​పాయింట్​ టిప్​లైన్'​ ఫీచర్ తీసుకొచ్చింది.

author img

By

Published : Apr 2, 2019, 4:50 PM IST

వాట్సాప్​లో తప్పుడు వార్తలకు 'టిప్​లైన్'​తో కళ్లెం!

సామాజిక మాధ్యమం వాట్సాప్​ తప్పుడు వార్తల​ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు సమాచార వ్యాప్తి చెందకుండా కొత్త ఫీచర్​ను ఆవిష్కరించింది. తమకు అందిన సమాచారం నిజమైందా కాదా అని సరిచూసుకునేందుకు 'చెక్​పాయింట్​ టిప్​లైన్' అనే ఆప్షన్​ను ప్రవేశపెట్టింది.

"భారత్ కేంద్రంగా పనిచేసే మీడియా నిపుణుల స్టార్టప్​ ప్రోటో (పీఆర్​ఓటీఓ) ఈ 'టిప్​లైన్'​ను ప్రారంభించింది. ఇది ఎన్నికల సమయంలో పుకార్లతో కూడిన డేటాబేస్​ రూపొందించి... దాని ఆధారంగా సమాచారాన్నివిశ్లేషిస్తూ చెక్​ పాయింట్​కు సహకరిస్తుంది. ఈ పరిశోధన ప్రాజెక్ట్​ను వాట్సాప్ పర్యవేక్షిస్తూ సాంకేతిక సహకారం అందిస్తుంది. " -వాట్సాప్​

భారత వినియోగదారులు తమకు అందిన తప్పుడు సమాచారాన్ని, పుకార్లను వాట్సాప్​లోని (+ 91-9643-000-888) నంబర్ ద్వారా చెక్​పాయింట్​ టిప్​లైన్​కు పంపొచ్చని సంస్థ తెలిపింది. ఒకసారి వాట్సాప్ వినియోగదారుడు అనుమానిత సమాచారాన్ని టిప్​లైన్​కు పంపితే దానికి ప్రోటో ధ్రువీకరణ కేంద్రం స్పందిస్తుంది. ఆ సమాచారం నిజమా కాదా అనేది వినియోగదారునికి చేరవేస్తుంది.

ఈ కేంద్రం చిత్రాలు, వీడియో లింక్స్​, టెక్ట్స్ రూపంలోని సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ఆంగ్లంతో పాటు నాలుగు స్థానిక భాషలు హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళంలలో సమీక్షిస్తుంది.
తప్పుడు సమాచార వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన డిగ్​ డీపర్​ మీడియా, మీడాన్​ సంస్థలు భారత్​లో ఫేక్​న్యూస్​ కట్టడికి ప్రోటో(పీఆర్​ఓటీఓ)కు సహాయపడతాయని పేర్కొంది వాట్సాప్​.

"వాట్సాప్​లో క్రమ పద్ధతిలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై అధ్యయనం చేయటమే ఈ ప్రాజెక్ట్​ ముఖ్య ఉద్దేశం. ఎంత ఎక్కువ సమాచారం వస్తే అంత గొప్పగా మేం తప్పుడు సమాచారంపై విశ్లేషించగలుగుతాం. అనుమానాస్పద సమస్యలు, భాషలు, ప్రాంతాలు తదితరమైనవి గుర్తించగలుగుతాం." -రిత్విజ్​ పర్రీక్​, నాసర్​ ఉల్​ హాది, ప్రోటో వ్యవస్థాపకుడు

సామాజిక మాధ్యమం వాట్సాప్​ తప్పుడు వార్తల​ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు సమాచార వ్యాప్తి చెందకుండా కొత్త ఫీచర్​ను ఆవిష్కరించింది. తమకు అందిన సమాచారం నిజమైందా కాదా అని సరిచూసుకునేందుకు 'చెక్​పాయింట్​ టిప్​లైన్' అనే ఆప్షన్​ను ప్రవేశపెట్టింది.

"భారత్ కేంద్రంగా పనిచేసే మీడియా నిపుణుల స్టార్టప్​ ప్రోటో (పీఆర్​ఓటీఓ) ఈ 'టిప్​లైన్'​ను ప్రారంభించింది. ఇది ఎన్నికల సమయంలో పుకార్లతో కూడిన డేటాబేస్​ రూపొందించి... దాని ఆధారంగా సమాచారాన్నివిశ్లేషిస్తూ చెక్​ పాయింట్​కు సహకరిస్తుంది. ఈ పరిశోధన ప్రాజెక్ట్​ను వాట్సాప్ పర్యవేక్షిస్తూ సాంకేతిక సహకారం అందిస్తుంది. " -వాట్సాప్​

భారత వినియోగదారులు తమకు అందిన తప్పుడు సమాచారాన్ని, పుకార్లను వాట్సాప్​లోని (+ 91-9643-000-888) నంబర్ ద్వారా చెక్​పాయింట్​ టిప్​లైన్​కు పంపొచ్చని సంస్థ తెలిపింది. ఒకసారి వాట్సాప్ వినియోగదారుడు అనుమానిత సమాచారాన్ని టిప్​లైన్​కు పంపితే దానికి ప్రోటో ధ్రువీకరణ కేంద్రం స్పందిస్తుంది. ఆ సమాచారం నిజమా కాదా అనేది వినియోగదారునికి చేరవేస్తుంది.

ఈ కేంద్రం చిత్రాలు, వీడియో లింక్స్​, టెక్ట్స్ రూపంలోని సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ఆంగ్లంతో పాటు నాలుగు స్థానిక భాషలు హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళంలలో సమీక్షిస్తుంది.
తప్పుడు సమాచార వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన డిగ్​ డీపర్​ మీడియా, మీడాన్​ సంస్థలు భారత్​లో ఫేక్​న్యూస్​ కట్టడికి ప్రోటో(పీఆర్​ఓటీఓ)కు సహాయపడతాయని పేర్కొంది వాట్సాప్​.

"వాట్సాప్​లో క్రమ పద్ధతిలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై అధ్యయనం చేయటమే ఈ ప్రాజెక్ట్​ ముఖ్య ఉద్దేశం. ఎంత ఎక్కువ సమాచారం వస్తే అంత గొప్పగా మేం తప్పుడు సమాచారంపై విశ్లేషించగలుగుతాం. అనుమానాస్పద సమస్యలు, భాషలు, ప్రాంతాలు తదితరమైనవి గుర్తించగలుగుతాం." -రిత్విజ్​ పర్రీక్​, నాసర్​ ఉల్​ హాది, ప్రోటో వ్యవస్థాపకుడు


Kalahandi (Odisha), Apr 02 (ANI): Prime Minister Narendra Modi on Tuesday criticised the Congress and Biju Janata Dal (BJD) for the underdevelopment of Odisha and said that such parties conspired to keep the poor of the country poor for their vote bank politics. PM Modi also underlined the tragic incident of Dana Manjhi, a man in Odisha's Kalahandi, who walked 10 kilometers carrying his wife's body due to absence of ambulance in his village. "Parties like Congress and BJD conspired to keep the poor of the country poor, they deceived the poor. They treated them as vote-bank, and because of this don't know how many Dana Manjhis don't even get ambulance," PM Modi said at a public rally in Odisha's Kalahandi.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.