సిద్దిపేట జిల్లా చింతమడకలో ముఖ్యమంత్రి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఏజెంట్ల వద్ద పోలింగ్ స్లిప్పులను తీసుకుని తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు కేసీఆర్ దంపతులు. పోలింగ్ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి:లైవ్ అప్డేట్స్: దంగల్ 2019