ETV Bharat / briefs

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్

author img

By

Published : Jun 24, 2019, 4:03 PM IST

Updated : Jun 24, 2019, 4:10 PM IST

సచివాలయం కూల్చివేతపై శుక్రవారం విచారణ చేపడుతామని హైకోర్టు తెలిపింది. వాస్తు కోసం కూల్చివేయడం సమంజసం కాదని గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్​ రెడ్డి పిటిషన్​ వేశారు. సచివాలయం కూల్చివేతలకు రంగం సిద్ధమైందని ఇవాళ తాజాగా జీవన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ధర్మాసనం శుక్రవారం విచారిస్తామని పేర్కొంది.

secretariat
సచివాలయం కూల్చివేతపై శుక్రవారం విచారణ

సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టులో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత భవనాలను కూల్చి వేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని నిర్ణయించినప్పుడు 2016లో జీవన్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం కూల్చివేయడం సమంజసం కాదన్నారు. అయితే ప్రస్తుత భవనాలను కూల్చబోమని సర్కారు తరఫున అప్పటి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఏజీ వాంగ్మూలాన్ని గతంలో హైకోర్టు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన మాట మార్చిందని.. సచివాలయం కూల్చివేతలకు రంగం సిద్ధమైందని ఇవాళ తాజాగా జీవన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిల్​పై విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.

ఇదీ చూడండి: 29 జిల్లాల్లో ఘనంగా పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన

సచివాలయం కూల్చివేతపై శుక్రవారం విచారణ

సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టులో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత భవనాలను కూల్చి వేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని నిర్ణయించినప్పుడు 2016లో జీవన్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం కూల్చివేయడం సమంజసం కాదన్నారు. అయితే ప్రస్తుత భవనాలను కూల్చబోమని సర్కారు తరఫున అప్పటి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఏజీ వాంగ్మూలాన్ని గతంలో హైకోర్టు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన మాట మార్చిందని.. సచివాలయం కూల్చివేతలకు రంగం సిద్ధమైందని ఇవాళ తాజాగా జీవన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిల్​పై విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.

ఇదీ చూడండి: 29 జిల్లాల్లో ఘనంగా పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన

Intro:Body:Conclusion:
Last Updated : Jun 24, 2019, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.