పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రఫేల్ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో విమర్శలు చేశారు. రఫేల్ కుంభకోణంలో మోదీనే ప్రధాన నిందితుడని ఆరోపించారు. ఇటీవల రఫేల్ కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఉటంకిస్తూ విమర్శలు గుప్పించారు.

" రఫేల్ కుంభకోణంలో ఎవరైనా దోషిగా తేలుతారంటే.. అది ప్రధాని ఒక్కరే. లోక్పాల్ బిల్లును ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు?. ఇప్పుడు అది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే లోక్పాల్ అమలైతే ప్రధాని మోదీనే ప్రధాన నిందితుడవుతారు. అవినీతి బుల్లెట్ తగిలితే మోదీ దానిని భరించలేరు"
- వీరప్ప మొయిలీ