ETV Bharat / briefs

విషజ్వరాలతో వణికిపోతోన్న కొత్తపల్లి - kottapalli trembling with viral fevers till now two child died

అప్పటి వరకు భాగానే ఆడుకున్న చిన్నారులు కోడిపిల్లల్ల మంచాన పడుతున్నారు. ఏమైందని తెలుసుకునేలోపే ఇద్దరు చిన్నారులు ప్రాణాలొదిలారు. విషజ్వరాలుగా తెలుసుకుని తమ పిల్లల్ని రక్షించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు నిజామాబాద్​ జిల్లా కొత్తపల్లి గ్రామస్థులు.

kottapalli trembling with viral fevers till now two child died
author img

By

Published : Jun 27, 2019, 9:27 PM IST

నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలం కొత్తపల్లి విషజ్వరాలతో వణికిపోతోంది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు జ్వరం కారణంగా మృతి చెందడం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. నాలుగేళ్ల చిన్నారి సౌమ్య, పదకొండేళ్ల అబ్బాయి ప్రణయ్ విషజ్వరంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో వైద్య బృందం పర్యటించి 39 మంది రక్త నమూనాలను జిల్లా కేంద్రానికి తరలించారు. మలేరియా సోకి చనిపోయారా లేక ఇంకా ఏదైనా వ్యాధితో మరణించారా అన్నది వైద్యులు తేల్చాల్సిందిగా గ్రామస్థులు కోరుతున్నారు. కొంత మంది తమ పిల్లలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు అధికారులు.

విషజ్వరాలతో వణికిపోతోన్న కొత్తపల్లి

ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన

నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలం కొత్తపల్లి విషజ్వరాలతో వణికిపోతోంది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు జ్వరం కారణంగా మృతి చెందడం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. నాలుగేళ్ల చిన్నారి సౌమ్య, పదకొండేళ్ల అబ్బాయి ప్రణయ్ విషజ్వరంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో వైద్య బృందం పర్యటించి 39 మంది రక్త నమూనాలను జిల్లా కేంద్రానికి తరలించారు. మలేరియా సోకి చనిపోయారా లేక ఇంకా ఏదైనా వ్యాధితో మరణించారా అన్నది వైద్యులు తేల్చాల్సిందిగా గ్రామస్థులు కోరుతున్నారు. కొంత మంది తమ పిల్లలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు అధికారులు.

విషజ్వరాలతో వణికిపోతోన్న కొత్తపల్లి

ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన

File:Tg_Nzb_01_27_Armur_Jwaramtho_Gramastula_Bayam_Avb_C7 From: Shubhakar,Armur , Contributor, Camera: Personal. **********************************( ) గ్రామంలో విషజ్వరాలు రావడం తో గ్రామస్తుల భయాందోళన చెందుతున్నారు. తమ పిల్లలను మరో ఊరికి తరలించాలని ఆ గ్రామ తల్లిదండ్రులు భావిస్తున్నారు.. గ్రామంలో గత వారం వ్యవధిలో విష జ్వరాలతో ఇద్దరు పిల్లలు మృతి చెందడం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సౌమ్య(04) ప్రణయ్(11) లు విషజ్వరంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో వైద్య బృందం పర్యటించి 39 మంది రక్త నమూనాలను రక్త పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.... మలేరియాన సోకి చనిపోయార లేక ఇంకా ఏదైనా వ్యాధి సోకి చనిపోయార అన్నది గ్రామస్తులకు తెలియడం లేదు... ఇదిలా ఉండగా మిగతా పిల్లలకు విషజ్వరాలతో ప్రమాదం జరుగుతుందని భావించి తమ తమ పిల్లలను తల్లిదండ్రులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో గ్రామంలో విష జ్వరాల పై ఆందోళన నెలకొంది. గ్రామస్తులకు అవగాహన కల్పించడానికి వైద్యులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బైట్స్: 1)సుబ్బారావు సర్పంచ్. 2) వైద్యాధికారి సంజీవ్ రెడ్డి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.