ETV Bharat / briefs

భారతీయ డెంటిస్ట్​ హత్య

ఆస్ట్రేలియాలో విషాద ఘటన వెలుగుచూసింది. ఓ ఆసుపత్రిలో సర్జన్​గా పనిచేస్తున్న భారతీయ డెంటిస్ట్​ ప్రీతిరెడ్డి దారుణహత్యకు గురైంది. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని భావిస్తున్న ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు రోడ్డుప్రమాదంలో చనిపోవటంతో ఈ వ్యవహారం మిస్టరీగా మారింది.

author img

By

Published : Mar 6, 2019, 6:41 PM IST

డెంటిస్ట్​ హత్య

ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్​ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురైంది. మంగళవారం రాత్రి ఆమె కారులోనే సూట్​కేసులో మృతదేహం లభ్యమైంది. తన మాజీ ప్రియుడు హర్ష్​ నర్డే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. మృతురాలి శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. సిడ్నీలోని మార్కెట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో తన మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష్ నర్డేతో కలిసి వచ్చిన దృశ్యాలు సీసీ టీవీ దృశ్యాల్లో నిక్షిప్తమయ్యాయి. మృతదేహం లభ్యమైన మరుసటి రోజే డాక్టర్ హర్ష్ నర్డే కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఈకేసులో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్‌బ్రూక్ డెంటల్ హాస్పిటల్‌లో ప్రీతిరెడ్డి సర్జన్‌గా పనిచేస్తోంది. ఓ కాన్ఫరెన్స్​కు హాజరయ్యేందుకు సెయింట్ లియోనార్డ్స్​కు వచ్చింది. ఆదివారం బసచేసిన హోటల్‌ నుంచి అదృశ్యమైంది. ఆమె చివరిసారిగా మెక్‌ డోనాల్డ్‌కు వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైందని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియాలో హత్యకు గురైన ప్రీతిరెడ్డిది మహబూబ్​నగర్ జిల్లా గురుకంట గ్రామం. తండ్రి నర్సింహారెడ్డి, తల్లి రేణుక వీరికి ఇద్దరు అమ్మాయిలు. పెద్దకూతురు ప్రీతిరెడ్డి, చిన్న కుమార్తె ఇద్దరు వైద్యులే. నర్సింహారెడ్డి వైద్యుడు కావటంతో కుటుంబంతో సహా 1996లో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. చివరిసారిగా ప్రీతిరెడ్డి డిసెంబర్ 26న హైదరాబాద్​కు బంధువుల వివాహానికి వచ్చింది. ప్రీతి హత్య విషయం తెలియగానే సహోద్యోగులు షాక్​కి గురైయ్యారు.

ప్రీతి మృతదేహం సూట్ కేసులో లభ్యమవడం, ఆమె మాజీ ప్రియుడు తరువాత రోజే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పోలీసులకు అంతుచిక్కటం లేదు.

undefined
డెంటిస్ట్​ హత్య

ఇవీ చూడండి:ఆస్తి కోసం కత్తి దాడి

undefined

ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్​ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురైంది. మంగళవారం రాత్రి ఆమె కారులోనే సూట్​కేసులో మృతదేహం లభ్యమైంది. తన మాజీ ప్రియుడు హర్ష్​ నర్డే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. మృతురాలి శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. సిడ్నీలోని మార్కెట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో తన మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష్ నర్డేతో కలిసి వచ్చిన దృశ్యాలు సీసీ టీవీ దృశ్యాల్లో నిక్షిప్తమయ్యాయి. మృతదేహం లభ్యమైన మరుసటి రోజే డాక్టర్ హర్ష్ నర్డే కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఈకేసులో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్‌బ్రూక్ డెంటల్ హాస్పిటల్‌లో ప్రీతిరెడ్డి సర్జన్‌గా పనిచేస్తోంది. ఓ కాన్ఫరెన్స్​కు హాజరయ్యేందుకు సెయింట్ లియోనార్డ్స్​కు వచ్చింది. ఆదివారం బసచేసిన హోటల్‌ నుంచి అదృశ్యమైంది. ఆమె చివరిసారిగా మెక్‌ డోనాల్డ్‌కు వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైందని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియాలో హత్యకు గురైన ప్రీతిరెడ్డిది మహబూబ్​నగర్ జిల్లా గురుకంట గ్రామం. తండ్రి నర్సింహారెడ్డి, తల్లి రేణుక వీరికి ఇద్దరు అమ్మాయిలు. పెద్దకూతురు ప్రీతిరెడ్డి, చిన్న కుమార్తె ఇద్దరు వైద్యులే. నర్సింహారెడ్డి వైద్యుడు కావటంతో కుటుంబంతో సహా 1996లో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. చివరిసారిగా ప్రీతిరెడ్డి డిసెంబర్ 26న హైదరాబాద్​కు బంధువుల వివాహానికి వచ్చింది. ప్రీతి హత్య విషయం తెలియగానే సహోద్యోగులు షాక్​కి గురైయ్యారు.

ప్రీతి మృతదేహం సూట్ కేసులో లభ్యమవడం, ఆమె మాజీ ప్రియుడు తరువాత రోజే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పోలీసులకు అంతుచిక్కటం లేదు.

undefined
డెంటిస్ట్​ హత్య

ఇవీ చూడండి:ఆస్తి కోసం కత్తి దాడి

undefined
Intro:Tg_mbnr_04_05_P.M_shram_yogi_pathakam_avb_c6
ప్రధానమంత్రి శ్యామ్ యోగి మాన్- ధన్ సంఘటిత కార్మికులకు పెన్షన్ పథకం కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక కార్మికుడు ఈ పథకంలో భాగస్వాములు కావాలని 60 ఏళ్లు నిండిన తర్వాత కుటుంబం కు ఓదార్పు ఏర్పడుతుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు . ప్రధానమంత్రి శ్యాం యు మాన్ దన్ పథకమును ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కలెక్టర్ శశాంక
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని స్థానిక బాలభవన్ లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి యోగి మాన్ ధన్ కార్యక్రమం ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి ఒక్క కార్మికునికి 60 ఏళ్ల తర్వాత ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయని ఆ సమస్యలను ఎదుర్కోవాలంటే ఈ ప్రధానమంత్రి యోగి మాన్ పథకంలో చేరి నెలకు మూడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందని ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలి అని ఎమ్మెల్యే కోరారు 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఈ పథకం లో చేరవచ్చని ఎమ్మెల్యే క కార్మికులకు తెలిపారు సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు వారి యొక్క వయస్సును బట్టి 55 నుండి 200 ల మధ్య జమ చేసుకుంటే సంఘటిత కార్మికులకు పెన్షన్ పథకం వర్తింప చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.


Body:babanna


Conclusion:gadwal

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.