ETV Bharat / briefs

భార్య, కుమారుడుని హత్య చేసి పరార్​

హైదరాబాద్​ సనత్​నగర్​ పీఎసీ పరిధిలో అమానుషం జరిగింది. భార్య, నాలుగేళ్ల కుమారుడిని భర్త రాజేశ్​.. దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. 12 రోజుల క్రితం భాగ్యనగరానికి వచ్చిన ఉత్తరప్రదేశ్​ వాసి రాజేశ్​ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

author img

By

Published : May 26, 2019, 8:36 PM IST

Updated : May 26, 2019, 11:53 PM IST

దారుణ హత్య
భార్య, కుమారుడుని హత్య చేసి పరార్​

హైదరాబాద్​ సనత్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడుని.. భర్త రాజేశ్ హత్య చేసి పరారయ్యాడు. ఉత్తర ప్రదేశ్​కు చెందిన రాజేశ్ గత 12 రోజుల క్రితం హైదరాబాద్​కి వచ్చాడు. సనత్ నగర్ జింకల వాడలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భార్యతో గొడవపడిన రాజేశ్ ఇనుప రాడ్డుతో ఊర్మిళ తలపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం తన నాలుగేళ్ల కుమారుడు కిషన్​ను నీళ్ల బకెట్​లో ముంచి చంపాడు. గమనించిన స్థానికులు పోలసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'జనగామ జిల్లాలో దొంగల బీభత్సం'

భార్య, కుమారుడుని హత్య చేసి పరార్​

హైదరాబాద్​ సనత్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడుని.. భర్త రాజేశ్ హత్య చేసి పరారయ్యాడు. ఉత్తర ప్రదేశ్​కు చెందిన రాజేశ్ గత 12 రోజుల క్రితం హైదరాబాద్​కి వచ్చాడు. సనత్ నగర్ జింకల వాడలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భార్యతో గొడవపడిన రాజేశ్ ఇనుప రాడ్డుతో ఊర్మిళ తలపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం తన నాలుగేళ్ల కుమారుడు కిషన్​ను నీళ్ల బకెట్​లో ముంచి చంపాడు. గమనించిన స్థానికులు పోలసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'జనగామ జిల్లాలో దొంగల బీభత్సం'

Intro:Body:Conclusion:
Last Updated : May 26, 2019, 11:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.