ETV Bharat / briefs

నేటితో పూర్తికానున్న భవనాల అప్పగింతలు

ఇరు రాష్ట్రాల మధ్య భవనాల అప్పగింత వ్యవహారం తుదిదశకు చేరుకొంది. ఇప్పటికే 95 శాతం అప్పగించగా  మిగతా భవనాలు నేడు అప్పగించనున్నారు. నూతన సచివాలయ నిర్మాణం కోసం ప్రస్తుత భవనాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

author img

By

Published : Jun 18, 2019, 7:11 AM IST

Updated : Jun 18, 2019, 10:21 AM IST

నేటితో పూర్తికానున్న భవనాల అప్పగింతలు
నేటితో పూర్తికానున్న భవనాల అప్పగింతలు

భవనాలను అప్పగించే వ్యవహారం కొనసాగుతోంది. గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసినందున... ఆంధ్రప్రదేశ్​ ఆధీనంలో ఉన్న భవనాలన్నింటినీ ఈ నెల 19 లోగా అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలంగాణ సీఎస్ ఎస్కే జోషికి ఇప్పటికే లేఖ రాశారు. సోమవారం పలు భవనాలను తెలంగాణ అధికారులకు అప్పగించారు. మంత్రుల నివాస ప్రాంగణం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏపీకి కేటాయించిన భవనాలను అప్పగించారు. సచివాలయంలోని కొన్ని బ్లాకులను తెలంగాణకు అప్పగించారు. మిగతా వాటిని ఇవాళ అప్పగించనున్నారు. భవనాల అప్పగింత కొలిక్కి వచ్చినందున నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సచివాలయ స్థానంలో నూతన సముదాయాన్ని నిర్మించనున్నారు. అందుకోసం సెక్రటేరియట్​లో ఉన్న కార్యాలయాలను తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

కొత్త సచివాలయం నిర్మాణంపై కసరత్తు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి భవనాల తరలింపు అంశాలపై అధికారులతో చర్చించారు. మంత్రుల కార్యాలయాలను, శాఖాధిపతుల కార్యాలయాలకు మిగతా వాటిని బూర్గుల రామకృష్ణారావు భవన్​కు తరలించనున్నట్లు కనిపిస్తోంది. గతంలో హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాలను మరోమారు పరిశీలించి కొత్త సచివాలయ సముదాయ నిర్మాణ నమూనాలను ఖరారు చేయనున్నారు.

ఇదీ చూడండి: ఏపీ భవనాల అప్పగింత వేగవంతం

నేటితో పూర్తికానున్న భవనాల అప్పగింతలు

భవనాలను అప్పగించే వ్యవహారం కొనసాగుతోంది. గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసినందున... ఆంధ్రప్రదేశ్​ ఆధీనంలో ఉన్న భవనాలన్నింటినీ ఈ నెల 19 లోగా అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలంగాణ సీఎస్ ఎస్కే జోషికి ఇప్పటికే లేఖ రాశారు. సోమవారం పలు భవనాలను తెలంగాణ అధికారులకు అప్పగించారు. మంత్రుల నివాస ప్రాంగణం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏపీకి కేటాయించిన భవనాలను అప్పగించారు. సచివాలయంలోని కొన్ని బ్లాకులను తెలంగాణకు అప్పగించారు. మిగతా వాటిని ఇవాళ అప్పగించనున్నారు. భవనాల అప్పగింత కొలిక్కి వచ్చినందున నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సచివాలయ స్థానంలో నూతన సముదాయాన్ని నిర్మించనున్నారు. అందుకోసం సెక్రటేరియట్​లో ఉన్న కార్యాలయాలను తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

కొత్త సచివాలయం నిర్మాణంపై కసరత్తు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి భవనాల తరలింపు అంశాలపై అధికారులతో చర్చించారు. మంత్రుల కార్యాలయాలను, శాఖాధిపతుల కార్యాలయాలకు మిగతా వాటిని బూర్గుల రామకృష్ణారావు భవన్​కు తరలించనున్నట్లు కనిపిస్తోంది. గతంలో హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాలను మరోమారు పరిశీలించి కొత్త సచివాలయ సముదాయ నిర్మాణ నమూనాలను ఖరారు చేయనున్నారు.

ఇదీ చూడండి: ఏపీ భవనాల అప్పగింత వేగవంతం

Intro:Body:

eee


Conclusion:
Last Updated : Jun 18, 2019, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.