ETV Bharat / briefs

మోదీ, కేసీఆర్​ ఈవీఎంలను కూడా దొంగిలిస్తున్నారు

author img

By

Published : Apr 7, 2019, 10:06 PM IST

"నాయకులు కావాలని కొందరు, డబ్బు సంపాదించాలని ఇంకొందరు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ... కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం సమాజానికి సేవ చేసేందుకు వచ్చారు. కొండా కుటుంబంలో తన తాత, తండ్రులు కూడా సమాజానికి ఎంతో సేవ చేశారు."- గులాం నబీ ఆజాద్​

చేవెళ్ల ఆత్మగౌరవ సభలో ఆజాద్

మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు గులామ్ నబీ ఆజాద్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆత్మగౌరవ సభకు ఆజాద్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ, కేసీఆర్​పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో రెండేళ్ల చిన్నారులపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయత గల కుటుంబ నేపథ్యమున్న విశ్వేశ్వర్​రెడ్డిని 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి పార్లమెంట్​కు పంపాలని ఆజాద్ విజ్ఞప్తి చేశారు.

చేవెళ్ల ఆత్మగౌరవ సభలో ఆజాద్

ఇవీ చూడండి: మహిళల నృత్యాలతో హోరెత్తిన కోమటిరెడ్డి ప్రచారం

మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు గులామ్ నబీ ఆజాద్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆత్మగౌరవ సభకు ఆజాద్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ, కేసీఆర్​పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో రెండేళ్ల చిన్నారులపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయత గల కుటుంబ నేపథ్యమున్న విశ్వేశ్వర్​రెడ్డిని 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి పార్లమెంట్​కు పంపాలని ఆజాద్ విజ్ఞప్తి చేశారు.

చేవెళ్ల ఆత్మగౌరవ సభలో ఆజాద్

ఇవీ చూడండి: మహిళల నృత్యాలతో హోరెత్తిన కోమటిరెడ్డి ప్రచారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.