ETV Bharat / briefs

రాయిలాంటి బిడ్డను రత్నంగా మలిచిన మాతృమూర్తి - రాయిలాంటి బిడ్డను రత్నంగా మలిచిన మాతృమూర్తి

అవతార మూర్తి అయినా అణువంతే పుడతాడు... అమ్మపేగు తెంచుకునే అంతవాడవుతాడు అన్నాడో సినీకవి... ప్రతి తల్లి తనకు పండంటి బిడ్డ పుట్టాలని.. ఆ బిడ్డ ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరగాలని ఆశపడుతుంది. కానీ కన్నపేగు అచేతనంగా జన్మిస్తే.... ఆ చిన్నారిని చూసిన అందరూ ఈసడించుకుంటుంటే.. ఆ మాతృమూర్తి పడే వేదన వర్ణనాతీతం. అలాంటి బిడ్డకు జన్మనిచ్చి ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ తల్లి... మనోస్థైర్యాన్ని కూడగట్టుకుని ఆ పిల్లాడిని ప్రయోజకున్ని చేసింది. ఛీ అన్నవాళ్లే తన కొడుకుని పొగుడుతుంటే మాతృహృదయం పొంగిపోతోంది. ఎన్నో అవాంతరాలకు ఎదురొడ్డి బిడ్డను ప్రయోజకుడిని చేసి అమ్మదనానికే పరిపూర్ణత్వాన్నిచ్చింది.

autism-boy
author img

By

Published : May 12, 2019, 9:22 AM IST

కడపజిల్లాలోని ఓ కుగ్రామమైన వేపరాలకు చెందిన సాధారణ మహిళ విశాలాక్షి. పైళైన రెండేళ్లకు కడుపు పండితే పొంగిపోయింది. బిడ్డజననం కోసం వేయికళ్లతో ఎదురుచూసింది. పుట్టిన బిడ్డను చూసి ఆమె గొంతు మూగబోయింది. పుట్టిన పిల్లాడు మాట్లాడలేడని, ఆటిజం సమస్య కూడా ఉందని వైద్యులు తేల్చారు. ఒళ్లంతా ముడతలతో పుట్టిన ఆ పసికందును చూసి అయినవాళ్లంతా ఈసడించుకున్నారు. చదువు, ఆట పాటల్లో ఎంతో చురుకుగా ఉండే తనకు ఇలాంటి బిడ్డ పుట్టాడని బాధకు తోడు.... ఇరుగు పొరుగు వారి సూటి పోటి మాటలు ఆమెను చిత్రవధ చేశాయి. బాధను తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరికి షాక్​ట్రీట్​ మెంటుతో కోలుకుని తన ఆలోచన మార్చుకుని బిడ్డ భవిష్యత్తుకోసం అహర్నిశలు శ్రమించింది.

అప్పడు ఛీత్కారాలు.. ఇప్పుడు సత్కారాలు

ఛీత్కారాలన్నింటినీ సత్కారాలుగా.. అవమానాలన్నింటినీ ఆయుధాలుగా.. తిట్లనన్నింటినీ మెట్లుగా మార్చి తన బిడ్డకు బంగారు భవిష్యత్తునిచ్చింది. బిడ్డనే సర్వంగా భావించి నిత్యం పిల్లాడితో సాధన చేయించేది. అలా పాటలు పాడడం, లిప్​రీడింగ్​, కీబోర్డు వాయించడంలో ప్రావీణ్యున్ని చేసింది. తన స్వరపేటిక దెబ్బతిన్నా లెక్కచేయలేదు. సుమారు 500 పాటల వరకూ పిల్లాడికి నేర్పింది. బుద్ధిమాంద్యంతో పుట్టిన ఆ చిన్నారి ఇప్పుడు ఓ అసాధారణ ప్రతిభగల చిన్నారిగా మలిచి రాష్ట్రపతి పురస్కారం పొందేస్థాయికి తీసుకెళ్లింది. ఒకప్పుడు తన బిడ్డను చూడడానికే ఇష్టపడని వారందరిచేతా గ్రేట్​ అనిపించింది.

తన కొడుకు జీవితాన్ని బయోపిక్​గా తీయాలని భావించిన విశాలాక్షి సొంతంగా కథను సైతం సిద్ధం చేసింది. ఆ సినిమాలో తన తల్లిదండ్రుల పాత్రల్లో నాగచైతన్య, సమంత నటించాలని కోరుతున్నాడు ఆ పిల్లాడు.

ఎందరికో ఆదర్శం

తనలాంటి బిడ్డలున్న వారికి సహాయం చేయాలని వెంకట్​ ఫౌండేషన్​ని స్థాపించి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బిడ్డలు ఎలా ఉన్నా వారి బాగు కోరుకునేది తల్లి. బిడ్డకు బంగారు భవిష్యత్తునిచ్చి మాతృత్వానికే మాధుర్యాన్నిచ్చిన విశాలాక్షి ఎందరికో ఆదర్శం.

రాయిలాంటి బిడ్డను రత్నంగా మలిచిన మాతృమూర్తి

ఇదీ చదవండి: పిల్లలు కనడంపై ప్రియాంకాచోప్రా ఏమంటోంది?

కడపజిల్లాలోని ఓ కుగ్రామమైన వేపరాలకు చెందిన సాధారణ మహిళ విశాలాక్షి. పైళైన రెండేళ్లకు కడుపు పండితే పొంగిపోయింది. బిడ్డజననం కోసం వేయికళ్లతో ఎదురుచూసింది. పుట్టిన బిడ్డను చూసి ఆమె గొంతు మూగబోయింది. పుట్టిన పిల్లాడు మాట్లాడలేడని, ఆటిజం సమస్య కూడా ఉందని వైద్యులు తేల్చారు. ఒళ్లంతా ముడతలతో పుట్టిన ఆ పసికందును చూసి అయినవాళ్లంతా ఈసడించుకున్నారు. చదువు, ఆట పాటల్లో ఎంతో చురుకుగా ఉండే తనకు ఇలాంటి బిడ్డ పుట్టాడని బాధకు తోడు.... ఇరుగు పొరుగు వారి సూటి పోటి మాటలు ఆమెను చిత్రవధ చేశాయి. బాధను తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరికి షాక్​ట్రీట్​ మెంటుతో కోలుకుని తన ఆలోచన మార్చుకుని బిడ్డ భవిష్యత్తుకోసం అహర్నిశలు శ్రమించింది.

అప్పడు ఛీత్కారాలు.. ఇప్పుడు సత్కారాలు

ఛీత్కారాలన్నింటినీ సత్కారాలుగా.. అవమానాలన్నింటినీ ఆయుధాలుగా.. తిట్లనన్నింటినీ మెట్లుగా మార్చి తన బిడ్డకు బంగారు భవిష్యత్తునిచ్చింది. బిడ్డనే సర్వంగా భావించి నిత్యం పిల్లాడితో సాధన చేయించేది. అలా పాటలు పాడడం, లిప్​రీడింగ్​, కీబోర్డు వాయించడంలో ప్రావీణ్యున్ని చేసింది. తన స్వరపేటిక దెబ్బతిన్నా లెక్కచేయలేదు. సుమారు 500 పాటల వరకూ పిల్లాడికి నేర్పింది. బుద్ధిమాంద్యంతో పుట్టిన ఆ చిన్నారి ఇప్పుడు ఓ అసాధారణ ప్రతిభగల చిన్నారిగా మలిచి రాష్ట్రపతి పురస్కారం పొందేస్థాయికి తీసుకెళ్లింది. ఒకప్పుడు తన బిడ్డను చూడడానికే ఇష్టపడని వారందరిచేతా గ్రేట్​ అనిపించింది.

తన కొడుకు జీవితాన్ని బయోపిక్​గా తీయాలని భావించిన విశాలాక్షి సొంతంగా కథను సైతం సిద్ధం చేసింది. ఆ సినిమాలో తన తల్లిదండ్రుల పాత్రల్లో నాగచైతన్య, సమంత నటించాలని కోరుతున్నాడు ఆ పిల్లాడు.

ఎందరికో ఆదర్శం

తనలాంటి బిడ్డలున్న వారికి సహాయం చేయాలని వెంకట్​ ఫౌండేషన్​ని స్థాపించి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బిడ్డలు ఎలా ఉన్నా వారి బాగు కోరుకునేది తల్లి. బిడ్డకు బంగారు భవిష్యత్తునిచ్చి మాతృత్వానికే మాధుర్యాన్నిచ్చిన విశాలాక్షి ఎందరికో ఆదర్శం.

రాయిలాంటి బిడ్డను రత్నంగా మలిచిన మాతృమూర్తి

ఇదీ చదవండి: పిల్లలు కనడంపై ప్రియాంకాచోప్రా ఏమంటోంది?

Intro:FILE NAME:HYD_TG_21_22_CP MAHESH BHAGVATH_AVB_C13

A.SANDEEP KUMAR

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్ పి. ఎస్.జి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల వలస కార్మికుల బాలబాలికల సంక్షేమ కార్యక్రమానికి హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ మరియు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. వలస కార్మికుల రక్షణ బాలకార్మికుల నిర్మూలన కోసం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటుక బట్టీల వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ , సిపి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 150 ఇటుక బట్టీలలో వేలాదిమంది కార్మికులు పని చేస్తున్నారని, వారి రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. వలస కార్మికుల పట్ల బట్టి యాజమాన్యాలు చట్టాలను అధిగమించి పిల్లలతో కానీ, కార్మికులతో పని చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. 14 సంవత్సరాల వయస్సు గలా పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని అలా కాకుండా వారిని పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎంతోమంది బలకార్మికులకు విముక్తి కలిగించి బడిలో చేర్చమని అన్నారు.ఓడిశా,ఛాతీసుగఢ్ రాష్ట్రాల నుండి తీసుకొచ్చే వలస కార్మికుల వివరాలను జిల్లా అధికారులకు తెలుపాలని అన్నారు.అక్కడి నుండి అనుమతితో మాత్రమే కూలీలను తీసుకురావాలని అన్నారు.విద్యార్థులకు బ్యాగులు,పాఠ్య పుస్తకాలు అందించారు.
బైట్:
1.లోకేష్ కుమార్(జిల్లా కలెక్టర్)
2.మహేష్ భగవత్(సిపి రాచకొండ)



Body:FILE NAME:HYD_TG_21_22_CP MAHESH BHAGVATH_AVB_C13

A.SANDEEP KUMAR

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్ పి. ఎస్.జి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల వలస కార్మికుల బాలబాలికల సంక్షేమ కార్యక్రమానికి హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ మరియు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. వలస కార్మికుల రక్షణ బాలకార్మికుల నిర్మూలన కోసం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటుక బట్టీల వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ , సిపి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 150 ఇటుక బట్టీలలో వేలాదిమంది కార్మికులు పని చేస్తున్నారని, వారి రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. వలస కార్మికుల పట్ల బట్టి యాజమాన్యాలు చట్టాలను అధిగమించి పిల్లలతో కానీ, కార్మికులతో పని చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. 14 సంవత్సరాల వయస్సు గలా పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని అలా కాకుండా వారిని పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎంతోమంది బలకార్మికులకు విముక్తి కలిగించి బడిలో చేర్చమని అన్నారు.ఓడిశా,ఛాతీసుగఢ్ రాష్ట్రాల నుండి తీసుకొచ్చే వలస కార్మికుల వివరాలను జిల్లా అధికారులకు తెలుపాలని అన్నారు.అక్కడి నుండి అనుమతితో మాత్రమే కూలీలను తీసుకురావాలని అన్నారు.విద్యార్థులకు బ్యాగులు,పాఠ్య పుస్తకాలు అందించారు.
బైట్:
1.లోకేష్ కుమార్(జిల్లా కలెక్టర్)
2.మహేష్ భగవత్(సిపి రాచకొండ)



Conclusion:FILE NAME:HYD_TG_21_22_CP MAHESH BHAGVATH_AVB_C13

A.SANDEEP KUMAR

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్ పి. ఎస్.జి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల వలస కార్మికుల బాలబాలికల సంక్షేమ కార్యక్రమానికి హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ మరియు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. వలస కార్మికుల రక్షణ బాలకార్మికుల నిర్మూలన కోసం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటుక బట్టీల వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ , సిపి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 150 ఇటుక బట్టీలలో వేలాదిమంది కార్మికులు పని చేస్తున్నారని, వారి రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. వలస కార్మికుల పట్ల బట్టి యాజమాన్యాలు చట్టాలను అధిగమించి పిల్లలతో కానీ, కార్మికులతో పని చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. 14 సంవత్సరాల వయస్సు గలా పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని అలా కాకుండా వారిని పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎంతోమంది బలకార్మికులకు విముక్తి కలిగించి బడిలో చేర్చమని అన్నారు.ఓడిశా,ఛాతీసుగఢ్ రాష్ట్రాల నుండి తీసుకొచ్చే వలస కార్మికుల వివరాలను జిల్లా అధికారులకు తెలుపాలని అన్నారు.అక్కడి నుండి అనుమతితో మాత్రమే కూలీలను తీసుకురావాలని అన్నారు.విద్యార్థులకు బ్యాగులు,పాఠ్య పుస్తకాలు అందించారు.
బైట్:
1.లోకేష్ కుమార్(జిల్లా కలెక్టర్)
2.మహేష్ భగవత్(సిపి రాచకొండ)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.