ETV Bharat / briefs

'పేలిన సిలిండర్లు.. 20 లక్షల ఆస్తి నష్టం'

ఖరీఫ్ పంట కోసం పెట్టుబడిగా తెచ్చిపెట్టుకున్న సొమ్ము అగ్నికి ఆహుతైన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద మెుత్తంలో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు.

author img

By

Published : Jun 17, 2019, 2:35 PM IST

ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తాం : తహసీల్దార్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బుర్​గూడ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడు సిలిండర్లు పేలి మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి ఇంట్లోని బంగారం,నగదు, బట్టలు, పప్పు దినుసులు, వడ్లు ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని మూడు కుటుంబాల సభ్యులు వాపోయారు.
ఖరీఫ్ పంట ప్రారంభమైనందున పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు నగదును బ్యాంకు నుంచి ఇంటికి తెచ్చిపెట్టుకున్నామన్నారు. ఇవాళ పత్తి విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉందని..ఇంతలోనే ఇంటికి మంటలు వ్యాపించి అంతా దగ్ధం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే తహసీల్దార్ కిషన్ సందర్శించారు. నష్టాన్ని లెక్కించిన తహసీల్దార్, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అగ్నికి ఆహుతైన ఇళ్లు

ఇవీ చూడండి : నిమ్స్​ ఆస్పత్రి వద్ద రోగుల ఇక్కట్లు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బుర్​గూడ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడు సిలిండర్లు పేలి మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి ఇంట్లోని బంగారం,నగదు, బట్టలు, పప్పు దినుసులు, వడ్లు ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని మూడు కుటుంబాల సభ్యులు వాపోయారు.
ఖరీఫ్ పంట ప్రారంభమైనందున పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు నగదును బ్యాంకు నుంచి ఇంటికి తెచ్చిపెట్టుకున్నామన్నారు. ఇవాళ పత్తి విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉందని..ఇంతలోనే ఇంటికి మంటలు వ్యాపించి అంతా దగ్ధం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే తహసీల్దార్ కిషన్ సందర్శించారు. నష్టాన్ని లెక్కించిన తహసీల్దార్, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అగ్నికి ఆహుతైన ఇళ్లు

ఇవీ చూడండి : నిమ్స్​ ఆస్పత్రి వద్ద రోగుల ఇక్కట్లు

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం buruguda గ్రామంలో ఈ రోజు ఉదయము మూడు సిలిండర్లు పేలి 3 ఇండ్లు దగ్ధమయ్యాయి సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఇంటి యజమానులు

బోర్ గూడ గ్రామపంచాయతీ పరిధిలోని buruguda గ్రామంలో మల్లేష్ పర్వతాలు రాజయ్య వీరి ముగ్గురి ఇల్లులు సిలిండర్లు పేలి అగ్నికి ఆహుతయ్యాయి వివరాల్లోకి వెళితే బంగారము నగదు ఇంట్లోని బట్టలు పప్పు దినుసులు వడ్లు ఇతర సామాగ్రి మూడు ఇళ్లలో పూర్తిగా దగ్ధమై పోయాయి సుమారుగా మూడు కుటుంబాల కలుపుకొని 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని కుటుంబీకులు వాపోయారు ఆస్తి నష్టం జరిగిందని రోదనలు మిన్నంటాయి ఖరీఫ్ పంట ప్రారంభమైందని పత్తి విత్తనాలు కొనుగోలు చేయడానికి నగదును బ్యాంకు నుండి నిన్న ఇంటికి తీసుకు వచ్చామని ఈరోజు పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తామని వాపోయారు ఇంటికి మంటలు వ్యాపించినప్పుడు ఇంటి కుటుంబీకులు ఉదయమే చేలో పనులకు వెళ్లి పోయారు వీరిని వెంటనే ప్రభుత్వం ఆదుకొని ఆస్తి నష్టాన్ని ఇవ్వాలని కోరుకున్నారు ఇట్టి విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక తహసీల్దార్ కిషన్ వచ్చి పంచనామా నిర్వహించి ఆస్తి నష్టాన్ని లెక్కవేసి ప్రభుత్వం నుండి వచ్చేలా చూస్తామని తహసిల్దార్ ఆర్ అన్నారు

జి వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్


Body:tg_adb_25_17_agni_pramadam_avb_c10


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.