ETV Bharat / bharat

పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై హత్యాయత్నం - ముంబయిలో ఖార్​ రైల్వే స్టేషన్​లో యువతిని రైల్వే ట్రాక్​పైకి నెట్టివసిన యువకుడు

మంచివాడని నమ్మి అతనితో స్నేహం చేసింది యువతి. యువకుడు మద్యానికి బానిసైన కారణంగా అతన్ని దూరం పెట్టింది. ఉన్మాదిగా మారిన యువకుడు ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఒప్పుకోకపోయేసరికి రైల్వేస్టేషన్​లో రైలు కిందకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ముంబయిలోని ఖార్​ రైల్వే స్టేషన్​లో జరిగింది.

Young Man pushed her Girl Friend under Railway Rrack in Khar railway station mumbai
పెళ్లికి ఒప్పుకోలేదని..రైలుకిందికి యువతిని నెట్టివేసిన ప్రేమోన్మాది
author img

By

Published : Feb 21, 2021, 2:16 PM IST

ముంబయిలోని ఖార్ రైల్వేస్టేషన్​లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని.. స్నేహితురాలిని చంపే ప్రయత్నం చేశాడో యువకుడు. లోకల్​ ట్రైన్​ ఫ్లాట్​ఫామ్​పై.. ఆమెను రైలు కిందకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

రైల్వే పట్టాలపైకి యువతిని నెట్టివేస్తున్న యువకుడు

ఇదీ జరిగింది..

బాధిత యువతికి నిందితుడు రెండేళ్లుగా స్నేహితుడు. ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తారు. గత కొంత కాలంగా నిందితుడు.. మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి.. అతన్ని దూరం పెట్టింది. యువకుడు ఆమెను తరచు కలుస్తూ వేధించడం మొదలుపెట్టాడు. అసహనానికి గురైన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా యువకుడు హింసించడం ఆపలేదు.

ఈ నేపథ్యంలో.. శుక్రవారం సాయంత్రం.. నిందితుడు యువతిని వెంబడించాడు. యువతితో పాటు అంధేరీ రైల్వేస్టేషన్​లో లోకల్​ ట్రైన్​ ఎక్కాడు. భయంతో యువతి.. ఆమె తల్లికి ఫోన్​ చేసింది. ఖార్​ రైల్వేస్టేషన్​లో కూతురు కోసం వేచి ఉన్న బాధితురాలి తల్లిని నిందితుడు కలుసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని అక్కడే అడిగాడు. బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి పరుగులు పెట్టాడు. ఇంతలో.. ఒక్కసారిగా వెనక్కి వచ్చి యువతిని రైలు కిందికి నెట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సుమేద్​ జాదవ్​గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఇదీ చదవండి: నగ్న చిత్రాలతో యువతి మోసం- రూ.లక్షకు టోకరా

ముంబయిలోని ఖార్ రైల్వేస్టేషన్​లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని.. స్నేహితురాలిని చంపే ప్రయత్నం చేశాడో యువకుడు. లోకల్​ ట్రైన్​ ఫ్లాట్​ఫామ్​పై.. ఆమెను రైలు కిందకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

రైల్వే పట్టాలపైకి యువతిని నెట్టివేస్తున్న యువకుడు

ఇదీ జరిగింది..

బాధిత యువతికి నిందితుడు రెండేళ్లుగా స్నేహితుడు. ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తారు. గత కొంత కాలంగా నిందితుడు.. మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి.. అతన్ని దూరం పెట్టింది. యువకుడు ఆమెను తరచు కలుస్తూ వేధించడం మొదలుపెట్టాడు. అసహనానికి గురైన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా యువకుడు హింసించడం ఆపలేదు.

ఈ నేపథ్యంలో.. శుక్రవారం సాయంత్రం.. నిందితుడు యువతిని వెంబడించాడు. యువతితో పాటు అంధేరీ రైల్వేస్టేషన్​లో లోకల్​ ట్రైన్​ ఎక్కాడు. భయంతో యువతి.. ఆమె తల్లికి ఫోన్​ చేసింది. ఖార్​ రైల్వేస్టేషన్​లో కూతురు కోసం వేచి ఉన్న బాధితురాలి తల్లిని నిందితుడు కలుసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని అక్కడే అడిగాడు. బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి పరుగులు పెట్టాడు. ఇంతలో.. ఒక్కసారిగా వెనక్కి వచ్చి యువతిని రైలు కిందికి నెట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సుమేద్​ జాదవ్​గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఇదీ చదవండి: నగ్న చిత్రాలతో యువతి మోసం- రూ.లక్షకు టోకరా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.