ETV Bharat / bharat

కన్నవారిని ఒప్పించలేక.. విడిచి బతకలేక.. ప్రేమ జంట ఆత్మహత్య!

author img

By

Published : Feb 11, 2022, 10:45 AM IST

తమ ప్రేమ ఎక్కడ విఫలమవుతుందోనని ఆందోళన చెందిన ఓ యువ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. ప్రేమికుల రోజుకు కొద్ది రోజుల ముందే ఘటన జరగటం ఝార్ఖండ్​లోని జంషెద్​పుర్​లో కలకలం రేపింది.

d
d

ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమ లోకంలో విహరించారు. అయితే, వారి ప్రేమకు ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో కలత చెందారు. ఒకరినొకరు విడిచి బతకలేమని నిశ్చయించుకున్నారు. ఒకే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఝార్ఖండ్​లోని జంషెద్​పుర్​ జిల్లాలో గురువారం జరిగింది.

జిల్లాలోని కొలజ్​హోర్​ గ్రామంలో పొలాల సమీపంలో చెట్టుకు వేళాడుతున్న మృతదేహాలను గురువారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

suicide
చెట్టుకు ఉరేసుకున్న ప్రేమ జంట

"గ్రామస్థుల సమాచారం మేరకు వీరిద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. వీరి వయసు 20-22 మధ్య ఉండొచ్చు. మరణానికి సంబంధించి ఎటువంటి సూసైడ్​ నోట్​లు దొరకలేదు. ఈ ఘటనలో ఎవరిదైనా ప్రమేయం ఉందా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. "

- డా.ఎం.తమిళ్​ వనన్, ఎస్పీ

ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన క్రమంలో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: పెళ్లిరోజే పెను విషాదం... కుమారుడిని రక్షించబోయి..

ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమ లోకంలో విహరించారు. అయితే, వారి ప్రేమకు ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో కలత చెందారు. ఒకరినొకరు విడిచి బతకలేమని నిశ్చయించుకున్నారు. ఒకే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఝార్ఖండ్​లోని జంషెద్​పుర్​ జిల్లాలో గురువారం జరిగింది.

జిల్లాలోని కొలజ్​హోర్​ గ్రామంలో పొలాల సమీపంలో చెట్టుకు వేళాడుతున్న మృతదేహాలను గురువారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

suicide
చెట్టుకు ఉరేసుకున్న ప్రేమ జంట

"గ్రామస్థుల సమాచారం మేరకు వీరిద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. వీరి వయసు 20-22 మధ్య ఉండొచ్చు. మరణానికి సంబంధించి ఎటువంటి సూసైడ్​ నోట్​లు దొరకలేదు. ఈ ఘటనలో ఎవరిదైనా ప్రమేయం ఉందా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. "

- డా.ఎం.తమిళ్​ వనన్, ఎస్పీ

ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన క్రమంలో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: పెళ్లిరోజే పెను విషాదం... కుమారుడిని రక్షించబోయి..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.