హిందువులు పవిత్రంగా భావించే 'చార్ధామ్' ఆలయాలు అక్షయ తృతీయ సందర్భంగా తెరుచుకున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్లోని యమునోత్రి ఆలయం ఆన్లైన్ పోర్టల్ శుక్రవారం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది పూజారులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భక్తులకు ప్రవేశాన్ని నిరాకరించారు.
అక్షయ తృతీయ సందర్భంగా మధ్యాహ్నం 12.15 గంటలకు పూజారులు, అధికారులతో సహా.. 25 మంది సమక్షంలో ఈ ఆలయ ద్వారాలు తెరిచినట్లు యమునోత్రి ఆలయ తీర్థ్ పురోహిత్ పవన్ ఉనియల్ తెలిపారు. మొదటి పూజను ప్రధాని నరేంద్ర మోదీ తరఫున నిర్వహించారు పూజారులు.


శీతాకాలంలో ఆరునెలల పాటు మూసి ఉండే చార్ధామ్ ఆలయాలు భక్తుల సందర్శనార్థం వేసవికాలంలో తెరుచుకుంటాయి. అయితే కరోనా కారణంగా గతేడాది నుంచి ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఇక చార్ధామ్ దేవాలయాల్లో భాగమైన గంగోత్రి పోర్టల్ మే 15(శనివారం) ఉదయం 7 గంటల 31 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. కేదార్నాథ్ మే 17న, బద్రీనాథ్ ఆలయం మే 18న తెరుచుకోనున్నాయి.
ఇవీ చదవండి: నేటి నుంచే చార్ధామ్ యాత్ర.. భక్తులకు నో ఎంట్రీ