ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన రామాయణం- 3వేల కిలోల ఇనుము, సూపర్ ఫీచర్స్​తో తయారీ! - Worlds largest heaviest Ramayana

Worlds largest and heaviest Ramayana : ప్రపంచంలోనే అతి బరువైన, పెద్ద రామాయణాన్ని రూపొందించింది ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని ఓ సంస్థ. 3వేల కిలోల ఇనుముతో చెక్కిన వాల్మీకి రామాయణాన్ని త్వరలోనే అయోధ్య ట్రస్ట్​కు అందించనుంది.

World's largest and heaviest Ramayana
World's largest and heaviest Ramayana
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 7:27 AM IST

Updated : Jan 15, 2024, 8:11 AM IST

Worlds Largest and Heaviest Ramayana : అయోధ్య ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో తమ భక్తిని వినూత్నంగా చాటుకుంది ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని ఓ సంస్థ. ప్రపంచంలోనే అతి బరువైన, పెద్ద రామాయణాన్ని రాముడికి కానుకగా ఇవ్వనుంది. ఇందుకోసం 3వేల కిలోల ఇనుమును ఉపయోగించి వాల్మీకి రామాయణాన్ని దానిపై చెక్కుతున్నారు. ఇప్పటికే 95కిలోల ఇనుముతో డ్రాఫ్ట్​ను సిద్ధం చేయగా, తాజాగా ఈ భారీ రామాయణాన్ని అనేక ప్రత్యేక ఫీచర్లతో రూపొందిస్తున్నారు.

World's largest and heaviest Ramayana
ఇనుముతో చేసిన రామాయణం డ్రాఫ్ట్

శాస్త్రీపురంలోని శ్రీ కృష్ణ గ్రంథాలయ ధారోహర్​ అనే సంస్థ ఈ భారీ రామాయణాన్ని రూపొందిస్తోంది. ఇది పూర్తైతే ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన రామాయణంగా మారనుంది. దీనిని అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో సుమారు 30-35 పేజీలు ఉండనున్నాయని చెప్పారు. ప్రతి పేజీ సుమారు 100 కేజీల వరకు ఉంటుందని, మొత్తంగా 3వేల కిలోల బరువు ఉండనుందని సంస్థ సభ్యులు ఆరాధన చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన రామాయణం

"కరోనా లాక్​డౌన్​ సమయంలో ఉన్నప్పుడు ఇంటిని శుభ్రం చేస్తుండగా రామాయణం కనిపించింది. కానీ అందులో కొన్ని పేజీలు చినిగిపోగా, మరికొన్ని చెదలు పట్టాయి. దీంతో చాలా బాధ పడ్డాను. ఈ క్రమంలోనే లోహంపై రామాయణాన్ని ఎందుకు చెక్కకూడదు అనే ఆలోచన వచ్చింది. అనేక మందితో చర్చలు చేసిన తర్వాత మొదటగా 95 కిలోల ఇనుముతో చిన్న రామయాణాన్ని తయారు చేశాం. దీని కోసం నెల రోజులపాటు కష్టపడ్డాం. ఏడు పేజీలు ఉన్న ఈ రామాయణంలో వాల్మీకి శ్లోకాలను చెక్కాం. త్వరలోనే దీనిని ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు అందజేస్తాం."
--ఆరాధన సైనీ, శ్రీ కృష్ణ గ్రంథాలయ ధారోహర్​ సభ్యురాలు

ఈ భారీ రామాయణాన్ని 9 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల మందంతో రూపొందిస్తున్నారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ సమయానికి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​కు అందజేస్తామని చెప్పారు. దీనిని తయారు చేయడానికి సుమారు రూ.కోటి వరకు ఖర్చు అయ్యిందని తెలిపారు. రామ భక్తులతో పాటు అనేక మంది ప్రజలు దీనికి సహాయం చేసినట్లు చెప్పారు.

రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం

అయోధ్య రాముడి కోసం షిర్డీలోని వృద్ధుల సంకల్పం - ప్రతి రోజూ 11 గంటల పాటు భజన

Worlds Largest and Heaviest Ramayana : అయోధ్య ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో తమ భక్తిని వినూత్నంగా చాటుకుంది ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని ఓ సంస్థ. ప్రపంచంలోనే అతి బరువైన, పెద్ద రామాయణాన్ని రాముడికి కానుకగా ఇవ్వనుంది. ఇందుకోసం 3వేల కిలోల ఇనుమును ఉపయోగించి వాల్మీకి రామాయణాన్ని దానిపై చెక్కుతున్నారు. ఇప్పటికే 95కిలోల ఇనుముతో డ్రాఫ్ట్​ను సిద్ధం చేయగా, తాజాగా ఈ భారీ రామాయణాన్ని అనేక ప్రత్యేక ఫీచర్లతో రూపొందిస్తున్నారు.

World's largest and heaviest Ramayana
ఇనుముతో చేసిన రామాయణం డ్రాఫ్ట్

శాస్త్రీపురంలోని శ్రీ కృష్ణ గ్రంథాలయ ధారోహర్​ అనే సంస్థ ఈ భారీ రామాయణాన్ని రూపొందిస్తోంది. ఇది పూర్తైతే ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన రామాయణంగా మారనుంది. దీనిని అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో సుమారు 30-35 పేజీలు ఉండనున్నాయని చెప్పారు. ప్రతి పేజీ సుమారు 100 కేజీల వరకు ఉంటుందని, మొత్తంగా 3వేల కిలోల బరువు ఉండనుందని సంస్థ సభ్యులు ఆరాధన చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన రామాయణం

"కరోనా లాక్​డౌన్​ సమయంలో ఉన్నప్పుడు ఇంటిని శుభ్రం చేస్తుండగా రామాయణం కనిపించింది. కానీ అందులో కొన్ని పేజీలు చినిగిపోగా, మరికొన్ని చెదలు పట్టాయి. దీంతో చాలా బాధ పడ్డాను. ఈ క్రమంలోనే లోహంపై రామాయణాన్ని ఎందుకు చెక్కకూడదు అనే ఆలోచన వచ్చింది. అనేక మందితో చర్చలు చేసిన తర్వాత మొదటగా 95 కిలోల ఇనుముతో చిన్న రామయాణాన్ని తయారు చేశాం. దీని కోసం నెల రోజులపాటు కష్టపడ్డాం. ఏడు పేజీలు ఉన్న ఈ రామాయణంలో వాల్మీకి శ్లోకాలను చెక్కాం. త్వరలోనే దీనిని ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు అందజేస్తాం."
--ఆరాధన సైనీ, శ్రీ కృష్ణ గ్రంథాలయ ధారోహర్​ సభ్యురాలు

ఈ భారీ రామాయణాన్ని 9 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల మందంతో రూపొందిస్తున్నారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ సమయానికి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​కు అందజేస్తామని చెప్పారు. దీనిని తయారు చేయడానికి సుమారు రూ.కోటి వరకు ఖర్చు అయ్యిందని తెలిపారు. రామ భక్తులతో పాటు అనేక మంది ప్రజలు దీనికి సహాయం చేసినట్లు చెప్పారు.

రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం

అయోధ్య రాముడి కోసం షిర్డీలోని వృద్ధుల సంకల్పం - ప్రతి రోజూ 11 గంటల పాటు భజన

Last Updated : Jan 15, 2024, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.