ETV Bharat / bharat

కన్నీటి గాథ- రెండు నెలలగా ఆకలితోనే!

ఆహారం లేక ఐదుగురు పిల్లలతో కూడిన ఆ కుటంబం రెండు నెలల పాటు ఆకలితో అలమటించింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురవగా.. ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ కుటంబంలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.

author img

By

Published : Jun 16, 2021, 9:26 PM IST

Updated : Jun 17, 2021, 9:08 AM IST

woman-with-5-children-reeling-under-starvation
రెండు నెలలగా ఆహారం లేక..

ఆకలితో ఆ కుటుంబం అలమటించింది. చట్టుపక్కల వారు ఆహారం అందించినా అది సరిపోయేది కాదు. పరిస్థితి విషమించింది. తీవ్ర అనారోగ్యపాలైన తన ఐదుగురు పిల్లలతో ఆ తల్లి ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించగా.. వారు రెండు నెలలుగా ఆకలితో అలమటించారని తేలింది. ఈ ఘటన ఉతర్​ప్రదేశ్​లో అలీగఢ్​ జిల్లాలో జరిగింది.

"ఐదుగురిలో ముగ్గురి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం."

-డాక్టర్​ అమిత్​, మల్కాన్​ సింగ్​ ఆసుపత్రి, అలీగఢ్​

అలీగఢ్​లోని మందిర్​ నగ్లా ప్రాంతంలో గుడ్డీ అనే 40ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమెకు అజయ్​(20), విజయ్(15), తీతు(10), సుందర్​ రామ్​(5), అనురాధ(13) అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు.

తీవ్ర ఆనారోగ్యంతో 2020లో ఆమె భర్త వినోద్​ చనిపోయాడు. అప్పటి నుంచి ఓ ఫ్యాక్టరీలో నెలకు రూ.4000 జీతానికి పనిచేసింది. కుటుంబానికి ఆసరాగా పెద్ద కుమారుడు అజయ్​ కూలీ పనిచేసేవాడు. అయితే కరోనా కట్టడికి లాక్​డౌన్​ విధించడం వల్ల ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో వారి పరిస్థితి అగమ్యగోచరమైంది. పనిలేక ఇల్లు గడవడం కష్టంగా మారింది. చుట్టుపక్కల వారు ఆహారాన్ని అందించినా సరిపోయేది కాదు. కేవలం నీళ్లుతాగే బతుకీడ్చారు. దాంతో వారంతా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

woman-with-5-children-reeling-under-starvation
గుడ్డీ కుమారుడు
woman-with-5-children-reeling-under-starvation
గుడ్డీ కుమార్తె
woman-with-5-children-reeling-under-starvation
గుడ్డీ కుమారుడు
woman-with-5-children-reeling-under-starvation
ఆకలితో ఆసుపత్రిలో చేరిన కుటుంబం

ఇదీ చదవండి: పిల్లల ఆకలి తీర్చలేని స్థితిలో తల్లి!

ఇదీ చదవండి: తల్లితండ్రులు మృతి- చిన్నారికి అన్నీ తానైన అక్క

ఆకలితో ఆ కుటుంబం అలమటించింది. చట్టుపక్కల వారు ఆహారం అందించినా అది సరిపోయేది కాదు. పరిస్థితి విషమించింది. తీవ్ర అనారోగ్యపాలైన తన ఐదుగురు పిల్లలతో ఆ తల్లి ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించగా.. వారు రెండు నెలలుగా ఆకలితో అలమటించారని తేలింది. ఈ ఘటన ఉతర్​ప్రదేశ్​లో అలీగఢ్​ జిల్లాలో జరిగింది.

"ఐదుగురిలో ముగ్గురి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం."

-డాక్టర్​ అమిత్​, మల్కాన్​ సింగ్​ ఆసుపత్రి, అలీగఢ్​

అలీగఢ్​లోని మందిర్​ నగ్లా ప్రాంతంలో గుడ్డీ అనే 40ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమెకు అజయ్​(20), విజయ్(15), తీతు(10), సుందర్​ రామ్​(5), అనురాధ(13) అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు.

తీవ్ర ఆనారోగ్యంతో 2020లో ఆమె భర్త వినోద్​ చనిపోయాడు. అప్పటి నుంచి ఓ ఫ్యాక్టరీలో నెలకు రూ.4000 జీతానికి పనిచేసింది. కుటుంబానికి ఆసరాగా పెద్ద కుమారుడు అజయ్​ కూలీ పనిచేసేవాడు. అయితే కరోనా కట్టడికి లాక్​డౌన్​ విధించడం వల్ల ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో వారి పరిస్థితి అగమ్యగోచరమైంది. పనిలేక ఇల్లు గడవడం కష్టంగా మారింది. చుట్టుపక్కల వారు ఆహారాన్ని అందించినా సరిపోయేది కాదు. కేవలం నీళ్లుతాగే బతుకీడ్చారు. దాంతో వారంతా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

woman-with-5-children-reeling-under-starvation
గుడ్డీ కుమారుడు
woman-with-5-children-reeling-under-starvation
గుడ్డీ కుమార్తె
woman-with-5-children-reeling-under-starvation
గుడ్డీ కుమారుడు
woman-with-5-children-reeling-under-starvation
ఆకలితో ఆసుపత్రిలో చేరిన కుటుంబం

ఇదీ చదవండి: పిల్లల ఆకలి తీర్చలేని స్థితిలో తల్లి!

ఇదీ చదవండి: తల్లితండ్రులు మృతి- చిన్నారికి అన్నీ తానైన అక్క

Last Updated : Jun 17, 2021, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.