ETV Bharat / bharat

రైలు కింద పడి ముగ్గురు పిల్లలు, తల్లి మృతి

author img

By

Published : May 10, 2021, 2:25 PM IST

కుటుంబ కలహాలతో రాజస్థాన్​లోని ఓ మహిళ తన అయిదుగురు పిల్లలతో పాటు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతిచెందగా.. మరో ఇద్దరు చివరి నిమిషంలో తల్లి చెయ్యిని వదిలించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

woman, train
రైలు కింద పడి ముగ్గురు పిల్లలు, తల్లి మృతి

రాజస్థాన్​ దౌసలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సమస్యలతో విసిగిపోయిన ఓ తల్లి కన్నబిడ్డలతో కలిసి కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మరణించింది. ఆమెతో పాటు ముగ్గురు పిలల్లు చనిపోయారు. మరో ఇద్దరు బతికి బయటపడ్డారు. పట్టలపై ఉన్న వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

woman died with 5 childern
పట్టాలపై మృతదేహాలు
woman died with 5 childern
మృతదేహాల తరలింపు
woman died with 5 childern
మృతదేహాలను తరలిస్తున్న సిబ్బంది
woman died with 5 childern
రైలు కిందపడిన బాలుడు

వారిద్దరు మాత్రం...

ఐదుగురు పిల్లలను తీసుకుని పట్టాలపైకి వెళ్లింది ఆ మహిళ. ఈ క్రమంలో.. రైలు వస్తుండటం చూసి ఆ ఐదుగురిలో ఇద్దరు.. తల్లి చెయ్యిని వదిలించుకుని అక్కడి నుంచి తప్పించుకున్నారు. చివరికి ముగ్గురు పిల్లలు సహా తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

చనిపోయిన మహిళ భర్త స్థానికంగా ఉండే రైల్వేగేటు వద్ద గేట్​ మ్యాన్​గా పని చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. అతను మాండవర్​లోని బావిఖేడా గ్రామంలో నివసిస్తున్నాడని చెప్పారు. ఈ ఘటనపై మాండవర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఇదీ చూడండి:అంత్యక్రియలకు తోపుడు బండిపైనే తల్లి మృతదేహం

రాజస్థాన్​ దౌసలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సమస్యలతో విసిగిపోయిన ఓ తల్లి కన్నబిడ్డలతో కలిసి కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మరణించింది. ఆమెతో పాటు ముగ్గురు పిలల్లు చనిపోయారు. మరో ఇద్దరు బతికి బయటపడ్డారు. పట్టలపై ఉన్న వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

woman died with 5 childern
పట్టాలపై మృతదేహాలు
woman died with 5 childern
మృతదేహాల తరలింపు
woman died with 5 childern
మృతదేహాలను తరలిస్తున్న సిబ్బంది
woman died with 5 childern
రైలు కిందపడిన బాలుడు

వారిద్దరు మాత్రం...

ఐదుగురు పిల్లలను తీసుకుని పట్టాలపైకి వెళ్లింది ఆ మహిళ. ఈ క్రమంలో.. రైలు వస్తుండటం చూసి ఆ ఐదుగురిలో ఇద్దరు.. తల్లి చెయ్యిని వదిలించుకుని అక్కడి నుంచి తప్పించుకున్నారు. చివరికి ముగ్గురు పిల్లలు సహా తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

చనిపోయిన మహిళ భర్త స్థానికంగా ఉండే రైల్వేగేటు వద్ద గేట్​ మ్యాన్​గా పని చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. అతను మాండవర్​లోని బావిఖేడా గ్రామంలో నివసిస్తున్నాడని చెప్పారు. ఈ ఘటనపై మాండవర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఇదీ చూడండి:అంత్యక్రియలకు తోపుడు బండిపైనే తల్లి మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.