ETV Bharat / bharat

చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?

author img

By

Published : Jan 31, 2021, 5:40 PM IST

Updated : Feb 8, 2021, 10:31 PM IST

జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ జైలు నుంచి విడుదల కావడం, తదనంతరం జరిగే పరిణామాలపై తమిళనాడు రాజకీయాల్లో ప్రధానంగా చర్చసాగుతోంది. జైలు శిక్ష తర్వాత ప్రజల్లో లభించిన సానుభూతిని ఆమె ఏ విధంగా ఉపయోగించుకుంటారు? తనపై వేటు వేసిన అన్నాడీఎంకే పార్టీని మళ్లీ హస్తగతం చేసుకుంటారా? త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ తర్వాతి అడుగు ఏమై ఉంటుంది? అన్న ప్రశ్నలపై ఆసక్తి నెలకొంది.

shashikala role in tamil nadu election
చిన్నమ్మ రాక- తమిళ రాజకీయల్లో కొత్త మలుపా?

2021 జనవరి 27.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్మారకాన్ని అన్నాడీఎంకే నాయకద్వయం పళనిస్వామి, పనీర్​సెల్వం ఆవిష్కరించిన ఈ రోజే.. ఆ పార్టీ వేటుకు గురైన తలైవి నెచ్చెలి వీకే శశికళ.. జైలుబంధం నుంచి విముక్తులయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న చిన్నమ్మ.. మళ్లీ ఆ పదవిని దక్కించుకునేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. అన్నాడీఎంకేలో 'కీలక హోదా' అధిరోహించేంత వరకు ఆమె విశ్రమించరని శశికళ సన్నిహితులు సైతం చెబుతున్నారు. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపులకు కారణమవుతాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఈ విషయంపై ఉన్న అభిప్రాయభేదాలను పరిష్కరించేందుకు భాజపా అగ్రనేతల మధ్యవర్తిత్వంతో పళనిస్వామి, పనీర్​సెల్వం- శశికళ మేనల్లుడు దినకరన్ మధ్య అనధికార చర్చలు జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పార్టీ అధికార పగ్గాలు తనకు అప్పగిస్తే స్వీకరించేందుకు శశికళ సిద్ధంగా ఉంటారని, లేదంటే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా పనిచేస్తారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పళనిస్వామి, పనీర్​సెల్వంను అధికార పీఠం నుంచి దించేందుకు పావులు కదుపుతారని అంటున్నారు. పార్టీ అభిమానులను, మద్దతుదారులను తనవైపు లాక్కుంటారని విశ్లేషిస్తున్నారు.

"జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉండటం కూడా శశికళకు శిక్ష పడటానికి ఓ కారణం. జైలు శిక్ష అనుభవించిన తర్వాత డెల్టా, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో శశికళకు సానుభూతి పెరిగింది. థెవార్ వర్గానికి ఈ ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఇక్కడ అన్నాడీఎంకే ఓడిపోతే పార్టీలో పరిణామాలు మారిపోతాయి."

-రాజకీయ విశ్లేషకులు

జయలలిత మరణాంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ ఎంపిక చేసిన ఎడప్పాడి పళనిస్వామి మాత్రం తనను సీఎం కుర్చీపై కూర్చొబెట్టింది ఎమ్మెల్యేలే అని, చిన్నమ్మ కాదని చెబుతూ వస్తున్నారు. పళనిస్వామి, పనీర్​సెల్వం ఐక్యంగా ఉన్నట్లే పైకి కనిపిస్తున్నారు. అయితే అధికార పంపిణీ విషయంలో లోపల ఇంకా విభేదాలు ఉన్నాయని పార్టీ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. జయలలిత విధేయుడిగా చెప్పుకుంటూ పత్రికలు, టీవీ ఛానెళ్లలో వ్యక్తిగతంగా పనీర్​సెల్వం ప్రచారం చేసుకోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది.

ఇదీ చదవండి: సవాళ్ల సుడిలో అన్నాడీఎంకే - పళనిస్వామి గట్టెక్కించేనా?

మేనల్లుడికి మద్దతివ్వలేరా?

శశికళ మేనల్లుడు దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీకీ చిన్నమ్మ నేరుగా మద్దతిచ్చే అవకాశం లేదు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు కోసం ఇప్పటికీ చిన్నమ్మ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉంది. అన్నాడీఎంకే పార్టీనే తనదని భావిస్తున్నారు కాబట్టి బహిరంగంగా ఏఎంఎంకేకు మద్దతు పలకలేరన్నది విశ్లేషకుల మాట. దినకరన్ సైతం శశికళ భవిష్యత్ ప్రణాళికల గురించి పెద్దగా ప్రస్తావించింది లేదు.

అన్నాడీఎంకే ఏం చేస్తుంది?

కరోనా నుంచి కోలుకొని ఆదివారం డిశ్ఛార్జ్ అయిన శశికళ.. కొద్దిరోజుల్లో చెన్నై చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సైతం చిన్నమ్మకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శశికళను అడ్డుకునేందుకు అన్ని రకాల వ్యూహాలు అమలు చేస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

"పార్టీకి ఆమె(శశికళ) నాయకత్వం, మార్గదర్శకత్వం ఏ రకంగానూ అవసరం లేదు. ఆమె జైలు శిక్ష అనుభవించిన ఒక దోషి. మిగిలిన ఈ సమయాన్ని ఆమె కుటుంబసభ్యులతో ప్రశాంతంగా గడపనివ్వండి. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపేందుకు పళనిస్వామి, పనీర్​సెల్వం ఉన్నారు."

-బాబు మురుగవేల్, అన్నాడీఎంకే ప్రతినిధి

మరోవైపు, అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడంపై అమ్మ మక్కల్ పార్టీ సైతం విశ్వాసంగా ఉంది. అన్నాడీఎంకేను తమ చేతుల్లోకి తీసుకోవడంపై కొంచెం కూడా అనుమానం అక్కర్లేదని ఏఎంఎంకే పార్టీ ప్రతినిధి వెట్రిపాండియన్ తెలిపారు. ఏఎంఎంకే పార్టీని ఉపయోగించుకొని అన్నాడీఎంకేను తమ అధీనంలోకి తీసుకుంటామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో చిన్నమ్మ ఎటువైపు అడుగు వేస్తారనే విషయం విశ్లేషకులకే అంతుపట్టకుండా ఉంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకేలో సునామీ సృష్టించి.. ప్రజల మద్దతు కూడబెడతారా? లేదా దినకరన్​ను వెనకుండి నడిపించి రాజకీయ వ్యూహాలు రచిస్తారా? అన్న ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఏదేమైనా, అరంగేట్రంపై రజనీకాంత్ వెనక్కి తగ్గిన తర్వాత డీలా పడ్డ రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు మాత్రం వేడి రాజేస్తున్నాయి.

ఇదీ చదవండి:'ఉంటారా.. వెళతారా?'- భాజపాకు అన్నాడీఎంకే అల్టిమేటం!

2021 జనవరి 27.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్మారకాన్ని అన్నాడీఎంకే నాయకద్వయం పళనిస్వామి, పనీర్​సెల్వం ఆవిష్కరించిన ఈ రోజే.. ఆ పార్టీ వేటుకు గురైన తలైవి నెచ్చెలి వీకే శశికళ.. జైలుబంధం నుంచి విముక్తులయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న చిన్నమ్మ.. మళ్లీ ఆ పదవిని దక్కించుకునేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. అన్నాడీఎంకేలో 'కీలక హోదా' అధిరోహించేంత వరకు ఆమె విశ్రమించరని శశికళ సన్నిహితులు సైతం చెబుతున్నారు. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపులకు కారణమవుతాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఈ విషయంపై ఉన్న అభిప్రాయభేదాలను పరిష్కరించేందుకు భాజపా అగ్రనేతల మధ్యవర్తిత్వంతో పళనిస్వామి, పనీర్​సెల్వం- శశికళ మేనల్లుడు దినకరన్ మధ్య అనధికార చర్చలు జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పార్టీ అధికార పగ్గాలు తనకు అప్పగిస్తే స్వీకరించేందుకు శశికళ సిద్ధంగా ఉంటారని, లేదంటే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా పనిచేస్తారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పళనిస్వామి, పనీర్​సెల్వంను అధికార పీఠం నుంచి దించేందుకు పావులు కదుపుతారని అంటున్నారు. పార్టీ అభిమానులను, మద్దతుదారులను తనవైపు లాక్కుంటారని విశ్లేషిస్తున్నారు.

"జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉండటం కూడా శశికళకు శిక్ష పడటానికి ఓ కారణం. జైలు శిక్ష అనుభవించిన తర్వాత డెల్టా, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో శశికళకు సానుభూతి పెరిగింది. థెవార్ వర్గానికి ఈ ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఇక్కడ అన్నాడీఎంకే ఓడిపోతే పార్టీలో పరిణామాలు మారిపోతాయి."

-రాజకీయ విశ్లేషకులు

జయలలిత మరణాంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ ఎంపిక చేసిన ఎడప్పాడి పళనిస్వామి మాత్రం తనను సీఎం కుర్చీపై కూర్చొబెట్టింది ఎమ్మెల్యేలే అని, చిన్నమ్మ కాదని చెబుతూ వస్తున్నారు. పళనిస్వామి, పనీర్​సెల్వం ఐక్యంగా ఉన్నట్లే పైకి కనిపిస్తున్నారు. అయితే అధికార పంపిణీ విషయంలో లోపల ఇంకా విభేదాలు ఉన్నాయని పార్టీ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. జయలలిత విధేయుడిగా చెప్పుకుంటూ పత్రికలు, టీవీ ఛానెళ్లలో వ్యక్తిగతంగా పనీర్​సెల్వం ప్రచారం చేసుకోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది.

ఇదీ చదవండి: సవాళ్ల సుడిలో అన్నాడీఎంకే - పళనిస్వామి గట్టెక్కించేనా?

మేనల్లుడికి మద్దతివ్వలేరా?

శశికళ మేనల్లుడు దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీకీ చిన్నమ్మ నేరుగా మద్దతిచ్చే అవకాశం లేదు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు కోసం ఇప్పటికీ చిన్నమ్మ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉంది. అన్నాడీఎంకే పార్టీనే తనదని భావిస్తున్నారు కాబట్టి బహిరంగంగా ఏఎంఎంకేకు మద్దతు పలకలేరన్నది విశ్లేషకుల మాట. దినకరన్ సైతం శశికళ భవిష్యత్ ప్రణాళికల గురించి పెద్దగా ప్రస్తావించింది లేదు.

అన్నాడీఎంకే ఏం చేస్తుంది?

కరోనా నుంచి కోలుకొని ఆదివారం డిశ్ఛార్జ్ అయిన శశికళ.. కొద్దిరోజుల్లో చెన్నై చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సైతం చిన్నమ్మకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శశికళను అడ్డుకునేందుకు అన్ని రకాల వ్యూహాలు అమలు చేస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

"పార్టీకి ఆమె(శశికళ) నాయకత్వం, మార్గదర్శకత్వం ఏ రకంగానూ అవసరం లేదు. ఆమె జైలు శిక్ష అనుభవించిన ఒక దోషి. మిగిలిన ఈ సమయాన్ని ఆమె కుటుంబసభ్యులతో ప్రశాంతంగా గడపనివ్వండి. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపేందుకు పళనిస్వామి, పనీర్​సెల్వం ఉన్నారు."

-బాబు మురుగవేల్, అన్నాడీఎంకే ప్రతినిధి

మరోవైపు, అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడంపై అమ్మ మక్కల్ పార్టీ సైతం విశ్వాసంగా ఉంది. అన్నాడీఎంకేను తమ చేతుల్లోకి తీసుకోవడంపై కొంచెం కూడా అనుమానం అక్కర్లేదని ఏఎంఎంకే పార్టీ ప్రతినిధి వెట్రిపాండియన్ తెలిపారు. ఏఎంఎంకే పార్టీని ఉపయోగించుకొని అన్నాడీఎంకేను తమ అధీనంలోకి తీసుకుంటామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో చిన్నమ్మ ఎటువైపు అడుగు వేస్తారనే విషయం విశ్లేషకులకే అంతుపట్టకుండా ఉంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకేలో సునామీ సృష్టించి.. ప్రజల మద్దతు కూడబెడతారా? లేదా దినకరన్​ను వెనకుండి నడిపించి రాజకీయ వ్యూహాలు రచిస్తారా? అన్న ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఏదేమైనా, అరంగేట్రంపై రజనీకాంత్ వెనక్కి తగ్గిన తర్వాత డీలా పడ్డ రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు మాత్రం వేడి రాజేస్తున్నాయి.

ఇదీ చదవండి:'ఉంటారా.. వెళతారా?'- భాజపాకు అన్నాడీఎంకే అల్టిమేటం!

Last Updated : Feb 8, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.